రామాయణము
కిష్కిందకాండ - అరువదినాలుగవసర్గ
సంపాతి మాటలు విన్న వానరులు సంతోషముతో కేరింతలు కొట్టిరి సీతాదేవిని దర్శించుటకై ఉబలాట పడిరి . వారందరు లంకా నగరము చేరుటకై సముద్ర తీరమునకు చేరిరి. ఆ సముద్రము పెద్దపెద్ద అలలతో భయంకరముగా ఉండెను
ఆ సముద్రమును చూసిన వెంటనే వానరుల ఉత్సాహము నీరు కారి పోయింది . సముద్రమును దాటుట ఎట్లు ?అని , ఈ సముద్రమును దాటగల సమర్ధుడు ఎవరు? అని , వారిలోవారు చర్చించుకోసాగిరి . ఇంతలో చీకటి పడుటచే వారంతా ఒక ప్రదేశములో విశ్రమించిరి . అంగదుడి చుట్టూ వానరులంతా చేరిరి . అంగదుడు వానరులందరిని ఉద్దేసించి , "ఓ వానరులారా మీరందరూ మహా వీరులు సింహబలులు. ఎవడైనను , ఎక్కడైనను , మీ గమనమును అడ్డుకొనువాడు లేడు . కావున బాగుగా ఆలోచించి ఈ మహా సముద్రమును దాటగలవాడు ఎవడైనా ఉంటె ఎడారికి రండి . సముద్రమును డాటా గలిగిన వారివలన మనమందరము తిరిగి కిష్కిందలోని మన కుటుంబములను కలుసుకొనువచ్చును .
No comments:
Post a Comment