రామాయణము
కిష్కిందకాండ - అరువదిఒకటవ సర్గ
నిశాకర మహర్షి అలా అడిగినప్పుడు నేను ఆ మహర్షితో "మహాత్మా !నేనూ నా తమ్ముడు పైపైకి ఎగురుతూ మిక్కిలి పైకి చేరుకున్నాము . సూర్యమండలం దగ్గరదగ్గరకు చేరుకున్నాము . ఆ వేడిని తట్టుకోలేక నా తమ్ముడు జటాయువు ,కిందపడిపోనారంభించెను . అప్పుడు నేను నా తమ్ముడికి అడ్డముగా నా రెక్కలను పెట్టితిని . అప్పుడు నా రెక్కలు ఇంకా కొన్ని అవయవములు కాలిపోయినవి . అప్పుడు నా తమ్ముడు కిందకు పడిపోయెను . కొంతసేపటికి నేను కింద పడిపోయాను . నేను అనుకున్న ప్రకారము నా తమ్ముడు దండకారణ్యములో పడివుంటాడు . నేను వింధ్య పర్వతముపై పడిపోయాను . రాజ్యము కోల్పోయాను ,తమ్ముడు దూరమయ్యాడు ,రెక్కలు కాలిపోయెను , పరాక్రమము నశించెను . ఈ గిరిశిఖమునుండి క్రింబడి చచ్చిపోవుటయే మేలని అనుక్షణము ఆలోచించుచుంటిని.
No comments:
Post a Comment