రామాయణము
ఉత్తరకాండ -అరువదియైదవసర్గ
శత్రుఘ్నుడు రెండురోజులు ప్రయాణించి వాల్మీకి ఆశ్రమానికి చేరెను . అక్కడ వాల్మీకి మహర్షికి పాదాభివందనం చేసి ,"శ్రీరాముడి ఆదేశానుసారం ఒక ముఖ్యకార్యముపై సాగిపోవుచూ ఇక్కడికి వచ్చితిని . ఈ రాత్రికి ఇక్కడ ఉండి ,రేపు ప్రాతః కాలమునే బయలుదేరి పశ్చిమదిశగా వెళ్లెదను . "అని పలికెను .
శత్రుఘ్నుని మాటలు విని వాల్మీకి మహర్షి నవ్వుతూ "యశశ్వీ నీకు స్వాగతము "అని పలికి శత్రుఘ్నుడికి అతిథిసత్కారములు చేసెను .
రామాయణము ఉత్తరకాండ అరువదియైదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment