రామాయణము
ఉత్తర కాండ -ఏబది రెండవ సర్గ
లక్ష్మణుడు సుమంత్రుడితో కలిసి ఆ రాత్రి కేశినీ నదీ తీరంలోనే గడిపెను . ప్రాతః కాలమే నిద్రలేచి అచటి నుండి బయలుదేరెను . ఆ సౌమిత్రి మధ్యాహ్న సమయమునకు అయోధ్యలో ప్రవేశించెను . మిక్కిలి చింతాక్రాంతుడై వున్న లక్ష్మణుడు 'శ్రీరామునికి ఏమి చెప్పాలి ?ఎలా చెప్పాలి?ఆయనను ఎలా ఓదార్చాలి ?అని పరిపరి విధములుగా ఆలోచించన చేస్తూ రాజా భవనము వైపుగా రధమును నడిపెను .
రాజా భవనము లోకి ప్రవేశించి ,సింహాసనంపై కూర్చుని ఉన్న తన అన్నను దర్శించి ఆయన పాదములకు ప్రణమిల్లెను . అనంతరము అతడు గుండె దిటవు చేసుకుని ,"ప్రభూ !పూజ్యుడవైన నీ ఆజ్ఞను తలదాల్చి ,ముందుగా ఉద్దేశించిన ప్రకారము ,పవిత్రమైన వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపమునకల గంగా తీరమునందు జానకీ దేవిని విడిచి నీ పాద సేవకై ఇక్కడికి తిరిగి వచ్చాను . విధివిలాసము ఇలా వుంది . పురుష శ్రేష్టా !ధైర్యము వహించి దృఢ చిత్తుడవై ఈ మనోదౌర్బల్యమును వీడుము . "అని పలికెను .
రామాయణము ఉత్తర కాండ ఏబదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment