రామాయణము
ఉత్తరకాండ -అరువదిఆరవసర్గ
శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో ఉన్న ఆ రోజు రాత్రే సీతాదేవికి ప్రసవమై ఇద్దరు మగపిల్లలు జన్మించిరి. ఆ వార్త విన్నవెంటనే వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చి ముద్దులొలుకుతూ, బాలసూర్యునివలె విరాజిల్లుతున్న ఆ బాలురులను చూసిరి . పిమ్మట వారికి రాక్షస , భూతపిశాచ బాధలు కలుగకుండా రక్షావిధులని చేసిరి . ఆ ఇద్దరు శిశువులలో ముందు పుట్టిన వానికి కుశుడు అని పేరు, రెండవ వానికి లవుడు అని పేరు పెట్టిరి .
సీతాదేవి కవలలను కనుట ,వారికి వాల్మీకి మహర్షి ఆజ్ఞతో వృద్దవనితలు రక్షాకార్యక్రమాలు నిర్వహించుట, వారికి పేర్లు పెట్టుట, మొదలగు విషయములన్ని, ఆ అర్దరాత్రియందే విని శత్రుఘ్నుడు చాలా సంతోషించెను . పిమ్మట అయన తనలో తాను సీతామాత సౌభాగ్యంతో వర్ధిల్లు గాక అనుకొనెను . మరునాడు ప్రాతఃకాలమే సంధ్యావందనాది ప్రాతఃకాల క్రియలు ఆచరించి వాల్మీకి మహర్షి ఆశీస్సులు పొంది పశ్చిమ దిశగా ప్రయాణమయ్యెను . ఏడుదినములు ప్రయాణం చేసి యమునా తీరములో ఉన్న ఋషీశ్వరుల ఆశ్రమమునందు ఆగెను . కాంచనుడు మొదలగు మహర్షులతో పెక్కు కదా ప్రసంగాలతో విశ్రాంతిగా ఆరోజు రాత్రి గడిపెను
No comments:
Post a Comment