రామాయణము
ఉత్తర కాండ -అరువది నాలుగవసర్గ
శ్రీరాముడు శత్రుఘ్నుడితో "నాయనా !నాలుగువేల అశ్వబలము ,రెండువేల రథబలము ,ఒక వంద గజ బలము నీ వెంట వస్తాయి . వ్యాపారులు నటులు ,నర్తకులు కూడా వస్తారు . యుద్ధోత్సాహముతో వున్న యోధులుకల మహాసేనను అయోధ్యనుండి పంపివేసి ,పిమ్మట నీవు ఒక్కడివే వెళ్లి ధనుర్ధారివై లవణాసురుడుని చేరుము . నీవు యుద్దమునకై వచ్చుచున్న విషయము లవణాసురిడికే కాదు ఎవ్వరికీ అనుమానము కలగని విధముగా నీవు అక్కడికి వెళ్లుము . వర్షాకాలం ప్రారంభము కాగానే ఆ రాక్షసుడిని చంపివేయుము . "అని పలికెను .
శత్రుఘ్నుడు శ్రీరాముడు పలికిన విధముగా ముందుగా తన బలములను పంపివేసి ,ఒక నెల రోజులు గడిచిన పిమ్మట ,యుద్ధమునకు ప్రయాణమై కౌసల్య సుమిత్ర కైకేయి మాతలకు నమస్కారము చేసెను . శ్రీరాముడికి ప్రదక్షణ నమస్కారాలు చేసి ,పిమ్మట లక్ష్మణుడికి భరతుడికి నమస్కారము చేసెను . పిమ్మట కులగురువు వశిష్ఠుడికి కూడా ప్రదక్షణ పూర్వకముగా నమస్కారము చేసి యుద్దమునకై బయలుదేరెను .
రామాయణము ఉత్తరకాండ అరువదినాలుగవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment