Monday 20 December 2021

రామాయణము- ఉత్తరకాండ - యాబది ఆరవసర్గ

                       రామాయణము 

                       ఉత్తరకాండ - యాబది ఆరవసర్గ 

శ్రీ రాముడి మాటలు విన్న సౌమిత్రి అంజలి ఘటించి "రాజా! దేవతలతో సామానులు విదేహులు అయిన వసిష్ఠుడు నిమి మహారాజు మరలా దేహమును పొంద గలిగిరి " అని ప్రశ్నించగా శ్రీ రాముడు " సౌమిత్రి ! తపోధనులు, ధార్మికులు అయిన నిమి వశిష్ఠులు పరస్పరం శపించుకొని దేహములు కోల్పోయి వాయువు వాలే మసలుకోన సాగిరి . వశిష్ట మహాముని తన తండ్రి అయిన బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లెను . బ్రహ్మ దేవుడి పాదములకు ప్రణమిల్లి " లోక నాధా! నిమి యొక్క శాపం వలన నేను విదేహుడనయితిని నాకు మరియొక దేహమును అనుగ్రహించుము . బ్రహ్మ దేవుడు" అట్లే నీ కోరిక తప్పక నెరవేరును . " ఆ మాటలు విన్న వసిష్ఠుడు సంతోషించి బ్రహ్మ దేవుడికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అచట నుండి వరుణ లోకమునకు వెళ్లిపోయెను . 
వరుణ లోకం లో ఊర్వశి చేసిన ఒక తప్పునకు కాను సూర్యుడు ఆమెను "నీవు మనుష్య లోకం చేరి కొంత కాలం అక్కడే నివసింతుము . బుధుని యొక్క పుత్రుడు కాశీ దేశమునకు రాజు అయిన పురూరవుని వద్దకు నేడే వెళ్లుము . అతడు నీకు భర్త కాగలడు ."అని శపించెను . 
సూర్యుడు చెప్పినట్లు ఊర్వశి బుధుడి కుమారుడయిని పురూరవుని వద్దకు వెళ్లెను . వారు ఇరువురికి ఆయువు అనే కుమారుడు కలిగెను . ఆయువు కుమారుని పేరు నహుషుడు . ఇతడు ఇంద్రుని వాలే మహా తేజస్వి . వజ్రాయుధమును ప్రయోగించి వృత్తాసురుడుని సంహరించిన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకొనగా ఆ సమయంలో నహుషుడు ఇంద్ర పదవిని అలంకరించి లక్ష సంవత్సరమునులు స్వర్గమును పరిపాలించెను . 
అలా ఊర్వశి సూర్యుడి శాప కారణంగా భూలోకం లో అనేక సంవత్సరములు ఉండి పిదప స్వర్గ లోకమునకు చేరెను " అని శ్రీ రాముడు పలికెను. 





రామాయణము , ఉత్తరకాండ ------ యాబది ఆరవ సర్గ . 

శశి ,

ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 

No comments:

Post a Comment