Tuesday 17 October 2017

రామాయణము కిష్కిందకాండ -పదునొకొండవసర్గ

                                              రామాయణము 

                                                కిష్కిందకాండ -పదునొకొండవసర్గ 

శ్రీరాముడు పలికిన వచనములు విని సుగ్రీవుడు సంతోషించి తిరిగి ఆ మహానుభావుడితో "రామా !వాలి బాలసామర్ధ్యములు వివరించెదను "అని పలికి ఇలా తెలుపసాగెను . "రామా !వాలి బ్రహ్మయే ముహూర్తమునే లేచి భూమండలం నలుదిక్కులా కల సరోవరములలో స్నానము చేసిరాగలడు . వాలి పర్వత శిఖరములను బంతుల వలె ఆడుకొనగలడు . మహా వృక్షములను సైతము పెకలించగలడు ఒకానొక సమయములో దుందుభి అను పేరు కల ఒక పర్వతము తో సమానమైన భారీ దేహము కల ఒక రాక్షసుడు వుండెడివాడు . అతడు దేవతలా వలన పొందిన వార గర్వముతో సముద్రము వద్దకు వెళ్లి యుద్ధమునకు రమ్మని పిలిచెను . అప్పుడు సముద్రుడు వెలుపలికి వచ్చి "నీతో యుద్ధము చేయుటకు నేను అశక్తుడను . హిమవంతుడు అను ఒక మహా పర్వతుడు కలదు అతడే నీతో యుద్ధము చేయుటకు సమర్థుడు "అని పలికెను . 
అప్పుడా  దుందుభి హిమవత్పర్వతము వద్దకు వెళ్లి యుద్ధమునకు రమ్మని రెచ్చగొట్టెను . అప్పుడా మహాత్ముడు "ఓ వీరా !నేను తాపములాచరించెడి సాధువులకు నెలవైనవాడిని . నీతో యుద్ధము చేయలేను . కావున నీవు మరలిపొమ్ము "అని పలుకగా అప్పుడా రాక్షసుడు "నాకు యుద్ధము చేయవలెనని బాగుగా కోరిక వున్నది కావున నీవు యుద్ధము చేయలేను ఎడల ,నాతొ యుద్ధము చేయగల సమర్థుడు ఎవరో తెలుపుము "అని పలికెను . అప్పుడా హిమవంతుడు "వాలి అను వీరుడు కలడు . అతడు నీతో యుద్ధము చేయుటకు సమర్థుడు . కిష్కింధకు రాజు ,మహాబలశాలి ,వానరవీరుడు "అని తెలుపగా ఆ దుందుభి సమరోత్సాహముతో కిష్కింధకు వెళ్లి అచట ద్వారమును బాదుతూ ,పక్కన వున్నా చెట్లను పీకి వేయుచూ ,మహా నాదము చేస్తూ ,వాలిని యుద్ధమునకు రమ్మని బిగ్గరగా పిలువసాగెను . 
అప్పుడు వాలి ఆ చప్పుళ్లకు అంతఃపురము నుండీ స్త్రీలతో కలిసి బయటకు వచ్చి ఆ దుందుభిని చూసి "ఓ వీరా !దుందుభీ ! నీ గూర్చి ఇదివరలోనే వింటివుంటిని . ఎందుకు అలా ద్వారమును బాదుతూ వృక్షములను నాశనము చేస్తూ నీ మరణమును నీవే కొనితెచ్చుకొనెదవు "అని పలుకగా దుందుభి "ఓ వాలీ !స్త్రీల మధ్యలో నిలబడి ప్రగల్బాలు పలుకుచున్నావు . నీకు ఈ రాత్రికి గడువు ఇస్తున్నాను . ఈ రాత్రి హాయిగా గడిపిన పిమ్మట నిన్ను రేపు ఉదయమే వధించెదను . "అని పలికెను . అప్పుడు వాలి నవ్వుతూ స్త్రీలనందరినీ అంతఃపురములోకి పంపివేసి ఆ రక్కసుడితో యుద్ధమునకు దిగెను . ఇద్దరు హోరాహోరీగా పోట్లాడుకొనిరి . కొంతసేపటికి వాలి మెడలోని సువర్ణమాల కారణముగా దుందుభి శక్తి క్షీణించి వాలి శక్తి ఎక్కువయ్యెను . అంత వాలి ఆ దుందుభిని తన దెబ్బలతో చంపి ,వాడి శరీరమును దూరముగా విసిరివేసెను . 
ఆ దుందుభి శరీరము ఋష్యమూక పర్వతముపైవున్న మతంగా మహర్షి ఆశ్రమము దగ్గరలో పడెను . ఆ శరీరము నోటి నుండి కొన్ని రక్తపు బిందువులు మతంగా మహర్షి ఆశ్రముపై పడెను . అంత మహర్షి కోపించి దీనికి కారణము ఎవరా అని అలోచించి ,వాలి అని గ్రహించి అతడిని" ఈ ఆశ్రమము .పరిసరములు అపవిత్రము చేసిన కారణముగా ఈ పరిసర ప్రాంతములకు అడుగుపెట్టిన వెనువెంటనే మరణింతువని "శపించెను . "వాలి అనుచరులు కూడా ఈ పర్వతముపైనుండి రేపటిలోగా మరలిపోనిచో మరణించెదరు . "అని శపించెను . ఆ శాప వాక్కులు విన్న వాలి అనుచరులు అచటి నుండి కిష్కిన్దాకు చేరి వాలికి జరిగిన విషయము వివరించిరి . ఆ విషయము తెలుసుకున్న వాలి మాత్మగా మహర్షి ని కరుణించమని ప్రార్ధించెను . కానీ మతంగా మహర్షి వినిపించుకోలేదు . ఆ కారణముగా వాలి ఎప్పుడు ఈ పర్వతము వైపు కన్నెత్తి కూడా చూడడు "అని సుగ్రీవుడు పలికెను . 
ఇంకనూ సుగ్రీవుడు రామునితో "ఈ విషయముత్ తెలుసుకున్న నేను మా అన్న నుండీ  రక్షించుకొనుటకు  నివసించుచున్నాను . ఇదిగో పెద్ద కొండలా ఉన్న ఇదే దుందుభి అస్థిపంజరం . "అని పలికి సుగ్రీవుడు మరి వాలిని మీరు జనించగలరా ?"అని ప్రశ్నించెను . దానికి సమాధానముగా శ్రీరాముడు దుందుభి అస్తిపంజరమును తన ఎడమకాలి బొటనవేలితో దూరముగా ఎగురునట్లు చేసెను .

రామాయణము కిష్కిందకాండ పదునొకొండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday 12 October 2017

రామాయణము కిష్కిందకాండ -పదవసర్గ

                                               రామాయణము 

                                                        కిష్కిందకాండ -పదవసర్గ 

పిమ్మట నేను మా అన్న వాలితో "అన్నా !నీవు శత్రువును పరిమార్చి ,క్షేమముగా కిష్కింధకు విచ్చేయుట చాలా సంతోషము . ఈ వింజామరతో నీకు విసిరెదను . నీకు సేవ చేసెడి భాగ్యమును నాకు కలిగించుము . "ఓ అన్నా !పూర్తిగా సంవత్సర కాలము పాటు నేను ఆ గుహ వెలుపలే వేచి వున్నాను . పిమ్మట ఆ గుహ నుండి వచ్చిన రక్తము చూసి నేను నీకు అపాయము సంభవించిందని భ్రమించినాను . పిమ్మట ఆ రాక్షసుడు బయటపడకుండా ఉండుటకు గాను ఒక పెద్ద కొండరాయిని ఆ బిలద్వారమునకు అడ్డుగా పెట్టితిని . 
బాధతో ఉన్న నా నుండి సమాచారం రాబట్టిన మంత్రులు నన్ను బలవంతముగా రాజును చేసిరి . నేను ఈ రాజ్యమును న్యాసముగా (సంరక్షించి తిరిగి ఇచ్చు నట్లు )శ్వీకరించితిని . ఇప్పుడు సంతోషముగా ఈ రాజ్యమును శ్వీకరించు "అని పలికితిని . అయినను మా అన్న నా మాటలు వినక మంత్రులు ,ప్రముఖుల ముందు నన్ను అవమానించెను . ఇంకనూ ఇలా మాట్లాడేను . "నేను సుగ్రీవుడు గుహ బయట ఉంటాడనే ధైర్యముతో గుహలోకి వెళ్లితిని చీకటిగా వున్నా ఆ గుహలో ఆ రక్కసుడు కనపడకుండెను . ఒక సంవత్సర కాలము నేను అతడిని వెతుకుతూనే కాలము గడిపితిని . ఎట్టకేలకు సంవత్సరము ఐన పిమ్మట ఆ మాయావిని ,అతడి అనుచరులను చంపి బయటకు రాబోగా గుహ బయటకు వచ్చుటకు వీలులేకుండా ఒక రాయి అడ్డుగా ఉండెను . 
నేను సుగ్రీవా !సుగ్రీవా !అని పెక్కుమార్లు అరిచి అరిచి ప్రయోజనము లేక కాలితో తన్ని ఆ రాతిని బద్దలుకొట్టి బయటకు వచ్చితిని . వచ్చి చూస్తే బయట వేచి చూస్తానన్న తమ్ముడు లేడు . యితడు దుర్భుద్ధితో నన్ను చంపవలెననే ఉద్దేశ్యముతో ఆ రాతిని అడ్డుగా పెట్టి యితడు రాజ్యమును అనుభవించుచున్నాడు "అని పరుషముగా పలికెను . అంతటితో ఆగక అతడు నన్ను కట్టుబట్టలతో బయటకు గెంటివేసెను . నా భార్యను కూడా అపహరించాడు "అని చెప్పి సుగ్రీవుడు కన్నీరు కార్చెను . అప్పుడు శ్రీరాముడు 
"సుగ్రీవా !నీవు నాకు మిత్రుడవు నీ భాదకు కారణమైన వాడు నాకు పరమ శత్రువు కావున దుఃఖించవలదు . ఈ రోజే నేను వాలిని నా పదునైన బాణములకు బాలి చేసి నీ రాజ్యమును ,నీ భార్యను నీకు అప్పగించెదను "అని మాటిచ్చేను . ఆ మాటలు విన్న సుగ్రీవుడు తన బాధ తొలిగిపోతున్నదని సంతోషపడెను . అతడి మనసు ఊరడిల్లేను . 

 రామాయణము కిష్కిందకాండ పదవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Wednesday 11 October 2017

రామాయణము కిష్కిందకాండ -తొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                    కిష్కిందకాండ -తొమ్మిదవసర్గ 


మా తండ్రి ఋక్షరజుడు మరణించిన పిమ్మట ,మా అన్న వాలి కిష్కిందరాజ్యమునకు రాజు అయ్యెను . మా అన్న అన్న నాకు మిక్కిలి ప్రేమాభిమానములు ఉండెడివి . మయుని పెద్దకుమారుడైన మాయావి కి మా అన్నకు ఒక స్త్రీ కారణముగా విరోధము అని ప్రతీతి . అతడు దుందుభికి అన్న . ఆ మాయావి ఒకనాడు అర్ధరాత్రి వేల జనులందరు నిద్రించుచుండగా కిష్కిందనగరద్వారము వద్దకు వచ్చి బిగ్గరగా అరుస్తూ యుద్ధమునకు పిలిచెను . స్త్రీలు ,నేను ఎంతగా వద్దని వారించినను మా అన్న వాలి వినక ఆ రాక్షసుడిపైకి యుద్ధమునకు వెళ్లెను . 
నేనును మా అన్న మీదకల ప్రేమతో ఆయన వెంటే వెళ్లితిని . మమ్ములను చూసిన ఆ మాయావి పారిపోయెను . మేమును అతడిని వెంబడించుచు వెళ్ళితిమి . అతడు ఒక బిలములోకి దూరెను . మా అన్న వాలి కూడా అతడిని వెంబడిస్తూ వెళ్లబోగా నేనును వచ్చెదనని మా అన్నతో నేను అనగా మా అన్న నన్ను వద్దని తన పాదములమీద వొట్టు  పెట్టి గుహద్వారము వద్దనే వేచివుండమని చెప్పి లోపలి వెళ్లెను . అచట నేను ఒక సంవత్సరకాలం ఉంటిని . పూర్తిగా ఒక సంవత్సరము అయినా పిమ్మట నురగలతో కూడిన రక్తము బయటకు వచ్చుట నేను చూసితిని . 
పిమ్మట మా అన్న ఆక్రందన ,పిదప ఆ రాక్షసుడి గర్జన నాకు వినిపించెను . అప్పుడు నేను మా అన్న మరణించినట్లుగా భావించి బాధతో కాళ్ళీడ్చుకుంటూ రాజ్యమునకు తిరిగి వచ్చితిని . నేను బాధతో ఏమి చెప్పకున్నను మంత్రులు నాతో  సమాచారం రాబట్టి రాజ్యక్షేమము కోసము నన్ను రాజుగా పట్టాభిషిక్తుడను చేసితిరి . ఆ విధముగా నేను రాజ్యమును పరిపాలించుచుండగా ఒకరోజు మా అన్న వచ్చెను . వచ్చి నాపై శత్రుత్వము పూని ,నా మంత్రులందరినీ చెరసాలలో బంధించెను . అప్పుడు నేను మా అన్న తో "అన్నా !అజ్ఞానముతో తప్పు జరిగెను నన్ను మన్నించుము "అని నేను నా కిరీటమును ఆయన పాదమునకు ఆనించి నమస్కరించి ప్రార్ధించినను ఆయన నాపై దయ చూపలేదు నన్ను అనుగ్రహించలేదు . ఆయన కోపము చల్లారలేదు . 

రామాయణము కిష్కిందకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం .ఏ  .ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Monday 9 October 2017

రామాయణము కిష్కిందకాండ -ఎనిమిదవసర్గ

                                              రామాయణము 

                                                  కిష్కిందకాండ -ఎనిమిదవసర్గ 

శ్రీ రాముడి మాటలకు పొంగిపోయిన సుగ్రీవుడు లక్ష్మనుని  ముందు ,తన మంత్రుల ముందు రామునితో "రామా !నీవంటి మిత్రుడు లభించుట నా అదృష్టము . ప్రభూ !నీ అండదండలు లభించుటచే సురలోకాధిపత్యము కూడా  సులభముగా లభించును . ఇక కిష్కింద  విషయము వేరుగా చెప్పనేల ?ఓ రామా !నా మిత్రుడవైన నీ కోసము నేను ప్రాణములు త్యజించుటకైనను వెనుకాడను . "అని పలికెను పిమ్మట సుగ్రీవుడు రామలక్ష్మణులు నిలబడి ఉండుట గమనించి ,బాగుగా పుష్పించిన మద్ది చెట్టు కొమ్మ విరిచి తెచ్చి శ్రీరాముని కూర్చోమని చెప్పి తానునూ శ్రీరాముని పక్కన కూర్చొనెను . 
ఆంజనేయుడు లక్ష్మణుడు నిలబడి ఉండుట చూసి ,మద్ది చెట్టు దిమ్మను తెచ్చి ఆసీనుడిని చేసెను . ఆ విధముగా వారందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండెను . ఆ సమయములో సుగ్రీవుడు శ్రీరాముడంతటి మహావీరుడు స్నేహితుడైనందువలన సంతోషముతో వాలి వలన భయము అతడిలో గుర్తుకురాగా రామునితో "రామా !మా అన్న అగు వాలి నా భార్యను లాగుకొని నన్ను అవమానించెను . నేను మిగుల భయముతో దుఃఖితుడనై ఈ ఋశ్యమూకపర్వతము చేరి ,ఇచట వసించుచున్నాను . వాలి భయము వలన ఆర్తుడనై దిక్కుతోచక ఉన్నాను . సర్వరక్షకుడవైన నీవు నన్ను అనుగ్రహించి రక్షించుము . "అని పలికెను . 
అప్పుడు రాముడు "సుగ్రీవా !ఉపకారము చేయువాడు మిత్రుడు ,అపకారము చేయువాడు శత్రువు . నేను నీ  కావున నీకు అపకారము చేసిన వాలిని ఈ రోజే వధించెదను . నా శరములకు గురై ఒక పర్వతము వలె కుప్పకూలుట నీవు చూసెదవు . "అని పలికెను . అప్పుడు వానర రాజు ఐన సుగ్రీవుడు 'బాగుబాగు 'అని పలికెను . పిమ్మట అతడు "రామా !నేను మిక్కిలి శోకార్తుడనై వున్నాను . శోకముతో విలవిలలాడుతున్న నాకు నేవే దిక్కు . నీవు నా మిత్రుడివి కావున నిన్ను ప్రాధేయపడుచున్నాను . "అని పలికి మిక్కిలి శోకార్తుడై గద్గదతో మాటరాకుండెను . శ్రీరాముడికి తానూ ధైర్యము చెప్పి ఆయన ముందు ఏడ్చుట భావ్యము కాదని భావించి సుగ్రీవుడు బలవంతము మీద కన్నీరును ఆపుకొనెను . 

పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని ఓదార్చి అతడికి ధైర్యము చెప్పెను . పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునితో "నీకు వాలికి శత్రుత్వమునకు కారణమేమి ?దానిని గూర్చి నాకు సవివరముగా చెప్పుము . దానిని బట్టీ నేను నీకు మేలు కలుగునట్లు చేసెదను "అని పలికెను . అప్పుడు సుగ్రీవుడు శ్రీరామునికి  తన కథను వివరింపసాగెను . 

రామాయణము కిష్కిందకాండ ఎనిమిదవసర్గసమాప్తము . 

                          శశి 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ఏడవసర్గ

                                             రామాయణము 

                                                     కిష్కిందకాండ -ఏడవసర్గ 

శ్రీరాముడు శోకార్తుడై అలా వచించిన పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముడికి నమస్కరించి "ప్రభూ !ఆ రావణుని గురించి నాకు ఏమి తెలియదు అయినప్పటికీ వాడు ఎచట దాక్కున్ననూ ,కనిపెట్టి వానిని మృత్యుమార్గమునకు పంపెదను . మీరు ఈ విధముగా భాదపడుట యుక్తము కాదు . బాధ సర్వారిష్టములకు మూలకారణము . కావున దానిని వీడి ,ఇప్పుడు చేయవలసిన కర్తవ్యమును ఆలోచించుడు . నా భార్యను కూడా వాలి అపహరించాడు . నీవును నా వలెనే ధైర్యముగా ఉండుము . "అని పలికి శ్రీరాముని కౌగిలించుకొనెను . 

సుగ్రీవుని మాటలకు శ్రీరాముడు "సుగ్రీవా !సమయోచితముగా నీవు మాట్లాడిన మాటలకు నేను ఊరడిల్లితిని . నీవు చెప్పినట్టే రావణుని వెతికి చంపెదము "అని పలికెను . శ్రీరాముని మాటలు విన్న సుగ్రీవుడు ,ఆంజినేయుడు మొదలగువారు ఊరడిల్లిరి . పిదప రామసుగ్రీవులు ఇరువురు ఒకరికష్టములను ఒకరు చెప్పుకొంటిరి . ఒకరినొకరు ఓదార్చుకొనిరి . 

రామాయణము కిష్కిందకాండ ఏడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .        





Thursday 5 October 2017

రామాయణము కిష్కిందకాండ -ఆరవసర్గ

                                 రామాయణము 

                                  కిష్కిందకాండ -ఆరవసర్గ 

మిక్కిలి సంతోషముతో సుగ్రీవుడు" రామా !నా మంత్రి అగు ఆంజనేయుడు నీ గురించి చెప్పి వున్నాడు . నీవు లక్ష్మణునితో సీతాదేవి తో కలిసి వనవాసము చేయుచుండగా మాయావి రాక్షసుడు ఆమెను అపహరించినాడని హనుమంతుడు చెప్పాడు . నీవు ఏ మాత్రము చింతించవలదు . ఆమెను ఆ రక్కసుడు ఎక్కడ దాచినను నేను వెతికి తెచ్చెదను . నేను ఈ పర్వతము మీద మంత్రులతో కలిసి కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని బలవంతముగా తీసుకొనిపోవుట చూసాను . ఆమె జీరపోయిన గొంతుతో రామా !లక్ష్మణా !అని అరిచెను . ఆమె ఒక నగలమూటను మా మధ్య పడునట్లు వేసెను . 
దానిని నేను జాగ్రత్తపెట్టితిని . నీకు చూపించెదను నీవు తప్పక వాటిని గుర్తుపట్టగలవు . ఆమె తప్పక జనక నందిని అయివుంటుందని నా నమ్మకము . "అని పలికి నగల మూటను తెచ్చి రామునికి చూపించగా రాముడు ఆ ఉత్తరీయము ,ఆ నగలు సీతవిగా గుర్తించి ,కళ్ళనీళ్ళతో నేలపై కూలపడిపోయెను . పిమ్మట లక్ష్మణునితో "లక్ష్మణా ! ఈ నగలు చూడు ఇవి మీ వదినగారివే "అని పలుకగా లక్ష్మణుడు వాటిని చూచి "అన్నా !ఈ నాగాలన్నిటిని నేను గుర్తించలేను కానీ ,మా వదినగారి రోజు పాదాభివందనం చేయుటవలన నేను ఈ అందెలను గుర్తించగలను . "అని పలికెను . 
అప్పుడు రాముడు "సుగ్రీవా !ఆ రాక్షసుడిని నీవు చూసావు . వాడు ఎలా ఉంటాడు . ఏ దిశగా సీతను తీసుకువెళ్లాడు . ఆ రక్కసుడి ఆయువు మూడినట్లే "అని కోపావేశముతో పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఆరవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday 4 October 2017

రామాయణము కిష్కిందకాండ -అయిదవసర్గ

                                    రామాయణము 

                                      కిష్కిందకాండ -అయిదవసర్గ 

అప్పుడు హనుమంతుడు ఋష్యమూక పర్వతము నుండి మలయగిరికి చేరి ,సుగ్రీవుని రామలక్ష్మణులున్న ప్రదేశమునకు తీసుకువచ్చి ,ఆ కపిరాజుకి వారిని గూర్చి చెప్పసాగెను . వారి గురించి సవివరముగా వివరించి సుగ్రీవుని భయమును పోగొట్టి ,వారితో స్నేహము చేయమని చెప్పెను . ఆంజనేయుడి మాట విని సుగ్రీవుడు రామలక్ష్మణులను ఆలింగనము చేసుకుని వారితో మైత్రిని ఏర్పరచుకొనెను . వారు కూర్చొనుటకు ఆసనములు ఏర్పాటుచేసెను . 
పిమ్మట వారందరూ ఎంతో ప్రీతితో మాట్లాడుకొనసాగిరి  . అప్పుడు దీనవదనుడై సుగ్రీవుడు తన అన్న వాలి తనపై కోపమును పెంచుకుని తనను రాజ్యమునుండి వెడలగొట్టటం తన భార్య రుమను అపహరించుట మొదలైన సమస్త విషయములను వివరముగా చెప్పి రాముడి సహాయమును అర్ధించెను . రాముడు వెనువెంటనే సుగ్రీవునికి అభయహస్తము ఇచ్చి ,అతడిని ఓదార్చెను . ఆ సమయములో వాలికి,సీతాదేవికి ,రావణునికి ఒకేసారి ఎడమకన్ను అదిరెను . 

రామాయణము కిష్కిందకాండ అయిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Saturday 30 September 2017

రామాయణము కిష్కిందకాండ -నాల్గవసర్గ

                                      రామాయణము 

                                        కిష్కిందకాండ -నాల్గవసర్గ 

హనుమంతుడు లక్ష్మణుని మధుర వచనములు విని సుగ్రీవుని తలుచుకుని సుగ్రీవునికి మేలు జరుగునని సంతోషించి రామలక్ష్మణులతో "ఓ వీరులారా !వనములతో ,భయమకరమైన క్రూర మృగములతో దట్టముగా వున్న ఈ వనంలోకి మీరు ఎలా వచ్చితిరి . ?అని ప్రశ్నించగా లక్ష్మణుడు "ఓ వానరవీరా !దశరధుడు అను మహారాజు కలడు ఆయన మిక్కిలి ధార్మికుడు . పుత్రసంతానములేక పుత్రసంతానముకోసము వారు పుత్రకామేష్టి యాగము చేయగా తత్ఫలితముగా ఆయనకు నలుగురు పుత్రులు జన్మించారు . వారిలో అగ్రుడు శ్రేష్ఠుడు శ్రీరాముడు ,మా అన్నగారు నేను ఈయన చిన్న తమ్మడు లక్ష్మణుడిని . 

తండ్రి మాట నిలుపుటకై అన్నగారు సమస్త రాజ్యభోగములను ,రాజ్యాధికారమును విడిచి ,అడవులలో ఉండుటకు వచ్చెను . నేను ,ఆయన ధర్మపత్ని ,జనకనందిని అయిన సీతాదేవి ఆయనను అనుసరించి వచ్చితిమి . 

మేమెవరమూ లేని సమయము చూసి మాయావి ఐన ఒక రాక్షసుడు మా వదినగారిని అపహరించాడు . 

ఆవిడను వెతుకుతూ ఇచటికి వచ్చితిమి . కబంధుడు అనే రాక్షసుడు మరణించుతూ తన పూర్వరూపమును ధరించి సుగ్రీవుని కలిసిన సీతాదేవి జాడ తెలియును అని తెలిపెను . సుగ్రీవుని కొరకై అన్వేషించుచున్నాము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న హనుమంతుడు "ఓ రాకుమారులారా !మా రాజు సుగ్రీవునుకును మీ సహాయము అవసరము . అదృష్టవశమున మీ దర్శనము మాకు లభించినది . ప్రస్తుతము మా ప్రభువు తన అన్న వాలి తో వైరము ఏర్పడి రాజ్యభ్రష్టుడైనాడు . ఆ వాలి సుగ్రీవుని వంచించి ,ఆయనను రాజ్యభ్రష్టుడిని చేయుటయే కాక ఆయన భార్య రుమను అపహరించెను . తత్ఫలితముగా వనములపాలైతిమి . సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాదేవిని వెతుకుటకు మీకు సహాయపడగలడు . "అని పలికి బ్రాహ్మణరూపము వదిలి తన వానరరూపమును దాల్చి రామలక్ష్మణులు ఇరువురిని తన భుజములపై ధరించి సుగ్రీవుని వద్దకు తీసుకెళ్ళేను . 

రామాయణము కిష్కిందకాండ నాల్గవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













Tuesday 19 September 2017

రామాయణము కిష్కిందకాండ -మూడవసర్గ

                               రామాయణము 

                                  కిష్కిందకాండ -మూడవసర్గ 

ఆంజనేయుడు సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు సన్యాసి వేషములో రామలక్ష్మణుల వద్దకు వెళ్లి వారిని బాగుగా పొగిడి ,వారి రూపలావణ్యములను మెచ్చుకుని అచటకు వచ్చుటకు కల కారణమును అడిగెను . రామలక్ష్మణులు మాట్లాడక మౌనముగా ఉండుటచే ,తిరిగి ఆంజనేయుడు "స్వామీ !నా పేరు హనుమంతుడు అంటారు . నేను సుగ్రీవుడు మంత్రిని అతడు తన అన్న వలన బయపడి ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నారు . సుగ్రీవుడు బలపరాక్రమవంతుడు . సూర్యుని పుత్రుడు . అతడు మీతో స్నేహము చేయ కోరుతున్నాడు . మీ గురించి వివరములు తెలుసుకొనుటకు నన్ను మారు వేషములో ఇచటికి పంపినాడు . నేను వానరుడను "అని పలికి వారి సమాధానమునకై  నిరీక్షించుచు ఉండెను . 


రాముడు హనుమంతుడి  మాటలు విని లక్ష్మణుడితో "లక్ష్మణా !ఈ వచ్చినవాడు సకల శాస్త్రములను బాగుగా నేర్చినవాడు . వ్యాకరణశాస్త్ర విషయములను అన్నిటిని బాగుగా ఎరిగినవాడు . కావుననే ఇతని మాటలలో ఒక్క వ్యాకరణ దోషపదము లేదు . స్వరము మధ్యమ స్వరములో వున్నది . ఇతడితో తగు మర్యాదగా మాట్లాడుము . సుగ్రీవుడితో చెలిమి కోసము మనము వెతుకుతుండగా ,ఆయనే మన కొరకు పంపినాడు . ఈయన మాటలకు చంపుటకు కట్టి ఎత్తిన శత్రువు కూడా శత్రుత్వమును విడనాడును "అని పలికెను . 
లక్ష్మణుడు రాముడి మాటలు విని హనుమంతుడితో "ఓ వానరశ్రేష్టా !మహాత్ముడైన సుగ్రీవుని గుణగణములను కబంధుని వలన ఇదివరకే వినివుంటిమి . వానర ప్రభువైన సుగ్రీవుని వెతుకుతూ మేము ఇచటికి చేరితిమి . ఓ మారుతీ !మైత్రి విషయమున సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలకు మేము సమ్మతించితిమి . నీ సూచనలు మేము పాటించెదము . "అని పలికెను . పవనసుతుడైన హనుమంతుడు లక్ష్మణుని మాటలకు ఏంటో సంతోషించెను . సుగ్రీవుని కార్యము (సుగ్రీవుని  బాధలు తొలగునని )ఫలించునని సంతోషపడెను . 

         రామాయణము కిష్కిందకాండ మూడవసర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Sunday 17 September 2017

రామాయణము కిష్కిందకాండ -రెండవసర్గ

                                        రామాయణము 

                                         కిష్కిందకాండ -రెండవసర్గ 

చక్కని బలిష్టమైన రూపము ,శ్రేష్టమైన ఆయుధములు ధరించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు ,అతడితో వున్న మిగిలిన వానరులు మిక్కిలి బయపడసాగిరి . ఏమిచేయాలో ఆలోచించసాగిరి . సుగ్రీవుడు మాత్రము మిక్కిలి బయపడసాగెను అతడు తన మంత్రులతో "వీరు జింకచర్మము ధరించి సన్యాసుల వలేవున్నానూ ,వీరు శ్రేష్టమైన ఆయుధములను ధరించివున్నారు . కావున వీరిని తప్పకుండా వాలి పంపి ఉంటాడు . మనలను పరిమార్చుటకే వీరు ఇచటికి వచ్చివుంటారు . "అని పలికెను 

అప్పుడు ఆంజినేయుడు సుగ్రీవునికి ధైర్యము చెప్పి "వారు వాలి అనుచరులు అయివుండరు . వాలికి కల శాప కారణముగా ఈ పర్వతము మీదకు వచ్చుటకు ధైర్యము చెయ్యడు కావున నీవు భయపడవలిసిన అవసరము లేదు "అని పలికెను . అయినను సుగ్రీవునికి నమ్మకము కుదరక ఆంజినేయుడిని "వారి వద్దకు మారు వేషములో వెళ్లి వారితో తగిన విధముగా మాట్లాడి ,వారిని బాగుగా పొగిడి వారి నుండి విషయము రాబట్టుము "అని పలికెను . 
ఆవిధముగా సుగ్రీవుడు ఆంజినేయుడిని ఆజ్ఞాపించుటచే ఆంజినేయుడు రామలక్ష్మణుల వద్దకు మారు వేషములో వెళ్ళుటకు సంసిద్ధుడయ్యెను . 

రామాయణము కిష్కిందకాండ రెండవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 






Saturday 16 September 2017

రామాయణము కిష్కింధాకాండ -మొదటిసర్గము

                               రామాయణము 

                                కిష్కింధాకాండ -మొదటిసర్గము 

ఆ మనోహరములైన ప్రదేశములను చూచుచు రామలక్ష్మణులు ముందుకు నడుచుచుండిరి . ఆ ప్రదేశములు చూసి రాముడు సీతను గుర్తుతెచ్చుకుని మిక్కిలి వ్యాకులపడసాగెను . "లక్ష్మణా !నాకు సీత కనిపించినచో నేను సీతతో కలిసి ఇచటనే ఉండేదను . నాకు అమరసుఖములు కానీ అయోధ్యాధిపత్యము కానీ వద్దు . జానకి దొరికిన చాలు . అచట భరతుడు నాకోసము నందీ గ్రామములో ఉపవాసదీక్షలో భరతుడు బాధపడుతున్నాడు . రాక్షసుడి చే అపహరించబడి సీత ఎంత బాధపడుతున్నదో ,వారిరువురు అలా బాధపడుతుండగా నాకు ఈ రమ్యమైన ప్రకృతి ఏమాత్రము సంతోషమును కలిగించుటలేదు . 

పుణ్యాత్ముడైన జనకమహారాజు సీత క్షేమసమాచారమును ప్రశ్నించినచో నేనేమి సమాధానము చెప్పగలను . నా మీద కల ప్రేమతో కోరి ఈ వనములకు వచ్చి కష్టములు తెచ్చుకున్నది . కానీ నేను ఆమెను రక్షించలేకపోవుచున్నాను . "అని బాధతో మాట్లాడుతున్న రాముడితో లక్ష్మణుడు "అన్నా !బాధించకు వదిన తప్పక లభించును . ఆ రావణుడు పాతాళములో దాగివున్నను మన చేతిలో చావు తధ్యము . నీవు ఊరడిల్లుము "అని ఓదార్చెను . వారిరువురు అటుల మాట్లాడుకుంటూ ఋష్యమూక పర్వతము దగ్గరదగ్గరకు వచ్చిరి . వారిని చూసిన సుగ్రీవుడు ,ఇతర వానరులు వాలి పంపగా వచ్చిన వీరులని భావించి భయముతో అచటికి దగ్గరలో ఉన్న మాతంగమహర్షి ఆశ్రమములోకి పరుగిడిరి . 

రామాయణము కిష్కిందకాండ మొదటిసర్గము సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ .ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము అరణ్యకాండ -డబ్బదియైదవసర్గ

                                             రామాయణము 

                                           అరణ్యకాండ -డబ్బదియైదవసర్గ 

రామలక్ష్మణులు  ఆ శబరి చెప్పిన విశేషములను తలచుకుంటూ ,ఆ పంపా సరోవరం అందాలు చుట్టూ వున్నా వనములు చూసుకుంటూ వాటి మహాత్యములను తలచుకుంటూ ఋశ్యమూకపర్వతము వైపుగా అడుగులువేయసాగిరి . దారిలో కల ప్రకృతి సౌందర్యములు చూచుచున్నను రాముడికి ఏ మాత్రము సంతోషము కలుగకుండెను . అతడు సీతాదేవినే తలుచుకుని బాధపడసాగెను . పంపాసరస్సు లో స్నానమాచరించి వారు ముందుకు సాగసాగిరి . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియైదవసర్గసమాప్తము . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Friday 15 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదినాల్గవసర్గ

                                   రామాయణము 

                              అరణ్యకాండ -డబ్బదినాల్గవసర్గ 

రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన మార్గములో ప్రయాణించుచు ,పంపా సరోవరం యొక్క పశ్చిమమునకు చేరిరి . అచట శబరి ఆశ్రమమునకు చేరిరి . శబరి వారిని సముచితముగా ఆహ్వానించి సాదరముగా ఆదరించెను .

 అతిథిమర్యాదలు చేసెను . పిమ్మట శ్రీరాముడు శబరి ని కుశలప్రశ్నలు వేసెను . అప్పుడు శబరి "రామా !నిన్ను కన్నులారా చూచుటచే నా తపస్సు సిద్దించినది . నేనుఇచట మా గురువులు (మాతంగమహర్షి శిష్యులు )కు సేవలు చెసెదిదానను . నీవు చియారకూటములో వున్న సమయములో వారు దివ్యవిమానములు రాగా వాటిపై ఉన్నతలోకములకు వెడలిరి . వారు వెళ్తూ "శబరీ !నీవు ఇచటనే వుండుము . దశరథ తనయుడైన శ్రీరాముడు ఇచటికి వచ్చును . అతడి దర్శనభాగ్యముచే నీకు కైవల్యము ప్రాప్తించును "అని చెప్పిరి . ఆనాటి నుండి నీ కోసమే ఎదురుచూచుచు వున్నాను . "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు "శబరీ !మీ గురువుల గొప్పతనమును నేనునూ వింటిని . వారు నివసించిన ప్రదేశమును చూడగోరుతున్నాను "అని అడిగెను . అప్పుడా శబరి "మా గురువులు దివ్య గంగను ఆవాహన చేసినకారణముగా ఈ పంపా సరోవరం ఏర్పడినది . వారు పూజ చేసుకోను ప్రదేశము ఈ సరోవరమునకు పశ్చిమ దిశన వారు పూజచేసుకోను ప్రదేశము కలదు . ఈ దట్టమైన చెట్లతో ,మృగములతో కూడిన వనమును మాతంగవనము అని పిలిచెదరు , వారు ఉపవాసములచే కృశించి ,వార్ధక్యం చే వంగి న కారణముచే సప్త సముద్రముల చెంతకు వెళ్లలేక వాటిని  గూర్చి ఆలోచించుచుండగా అవే  వచ్చి ఇచట తీర్ధముగా ఏర్పడినవి . దీనిని సప్తసాగరతీర్ధము అని పిలిచెదరు . 
ఈ తీర్థమున వారు స్నానమాచరించి ,ఈ చెట్లపై వారి వస్త్రములను ఆరబెట్టుకునేవారు . వారి స్పర్శ కారణముగా అవి నేటికీ చెక్కుచెదరక ఉండెను . వారు కమలములు ,కలువలు మొదలగు పూలతో దేవతలను పూజించెడివారు . ఆ పూలు నేటికీ వాడక వున్నవి . ఓ రామా !ఈ వనశోభలను కన్నులారా గాంచితివి . దాని మహాత్యమును పూర్తిగా వింటివి . మీ అనుమతి అయినచో ఈ దేహమును పరిత్యజించాకోరుచున్నాను . నేను ఈ ఆశ్రమమున పరిచారికాని కనుక నేనునూ ఆ దివ్యపురుషుల కడకే చేరెదను "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు" శబరీ నీ అతిధి మర్యాదలకు ,నీవు చెప్పిన విషయములకు ఎంతో సంతోషించాను . నీకు నచ్చినచోటికి వెళ్లుము "అని అనుమతి ఇచ్చెను . శబరి అప్పటికప్పుడే తన శరీరమును అగ్నికి ఆహుతి చేసి దివ్య ఆభరణాలు ,వస్త్రములు ధరించి దివ్య తేజస్సుతో పరంధామమునకు చేరెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదినాల్గవసర్గసమాప్తము . 

                                    శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 11 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదిమూడవసర్గ

                                           రామాయణము 

                                          అరణ్యకాండ -డబ్బదిమూడవసర్గ 

కార్యసాధన గూర్చి బాగుగా ఎరిగిన కబంధుడు ఇంకనూ రామునితో "ఓ రామా !పశ్చిమ దిశగా వెళ్లుము దారిలో మీకు రసవంతమైన ఫలములతో కూడిన పెక్కు చెట్లు కలవు వాటి ఫలములు అమృతతుల్యములు . ఆ దిశగా వెళ్తూ దారిలోని పర్వతములు అన్ని దాటుతూ పంపాసరోవరము చేరుము . అచటి నీరు మిక్కిలి నిర్మలములు . రామా !అచటి కానుగ చెట్లు నిరంతరము పూలతో నిండి ఉండును . మాతంగమహర్షి శిష్యుల ప్రభావమున ఆ పూలను ఎవ్వరు త్రుంపలేరు . మాలలుగా ధరించలేరు ,అవి వాడవు ,తరగవు . 
పూర్వము మతంగ మహర్షి శిష్యులు అచట నివసించుచుండెడివారు . వారు ఎంతో భక్తి శ్రద్దలతో తమ గురువు కొరకు ఫలములు సమిధలు తెచ్చెడివారు . వాటి బరువుకు వారికి పట్టిన స్వేదములు గాలివశమున చెట్లపై పడి పూలుగా మారినవి కావున అవి వాడవు . శిష్యులందరూ అచటి నుండి వెళ్ళిపోయినప్పటికీ ఒక సన్యాసిని మాత్రము అచటనే వున్నది . ఆమె "శబరి "ఆమె దీర్గాయురాలు . నిన్ను దర్శించిన పిమ్మట ఆమె స్వర్గమునకు చేరును . 
క్రమముగా పంపాసరోవరము పశ్చిమము వైపుకు చేరినచో అచట ఒక దివ్య ఆశ్రమము కలదు . ఆ ఆశ్రమము చెంతకు చేరుట సామాన్యులకు దుర్లభము , ఆ ఆశ్రమమునకు సమీపముననే ఋశ్యమూకం అను పేరు కల పర్వతము కలదు . ఆ ఋష్యమూక పర్వతముపై నిదురించిన వారికి వారి కలలో లభించిన సంపదలు నిజముగా లభించును . దురాచారుడు నిదురించునపుడు అతడిని రాక్షసులు పట్టుకుని చంపుదురు . ఆ పర్వతముపై రకరకములైన గజములు మొదలగు జంతువులూ తిరుగుచుండెను . ఆ ఋష్యమూక పర్వతముపై ఒక గుహ కలదు . సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కలిసి ఆ గుహ నందే వసించుచున్నాడు . "అని పలికి రాము ఐ ఆజ్ఞకై ఆకాశమునే నిలిచి ఉండెను . రామలక్ష్మణులు "ఇకనీవు వేళ్ళు "అని కబంధునికి ఆజ్ఞ ఇచ్చిరి . పిమ్మట కబంధుడు స్వర్గమునకు చేరెను . 

రామాయణము అరణ్యకాండ దబ్బదిమూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











Saturday 9 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ

                                  రామాయణము 

                                అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ 

రామలక్ష్మణులు కబంధుని మాటలు విన్న తర్వాత ,గిరి సమీపమున గోతిని తవ్వి అందు కబంధుని పడవేసి అతడి దేహమును కట్టెలతో ఎండు ఆకులతో దహనమొనర్చిరి . అతడి దేహము పూర్తిగా దహనమయిన పిమ్మట ఒక దివ్య తేజస్సుతో కూడి దివ్యాభరణములు ,వస్త్రములు ధరించిన ఒక దివ్యపురుషుడు ఆ చితి మంటలనుండి వచ్చెను . అతడు "రామా !నాకు శాప విమోచనము కలిగించినందుకు కుతజ్ఞుడను . 
నీకు నీ భార్య సీతాదేవి లభించుటకు ఒక వీరుడితో స్నేహము చేయుట ఉత్తమము అని నా భావన . కిష్కింద అను వానర రాజ్యమునకు వాలి రాజు అతడు వానరుడు . అతడు ఇంద్రుని అంశతో జన్మించాడు . అతడి తమ్ముడు కారణాంతరముల వలన అతడి అన్న గారిచే రాజ్యము నుండి వెడలగొట్టబడి ఋశ్యమూకం అను పర్వతముపై నలుగురు వానరులతో కలిసి జీవించుచున్నాడు . అతడికి ఈ భూమి మీద తెలియని ప్రదేశము లేదు . సూర్యుడి కాంతి పడు యావత్ భూమి అతడికి తెలుసు . 
అతడు సీతాదేవిని అన్వేషించుటలో నీకు తప్పక తోడ్పడగలడు . అతడికి నీవు చేయవలసిన సహాయము ఒకటి కలదు ఆ పని నీ వలన అయినను అవకపోయినను అతడు నీకు సహాయపడగలడు . అతడు వానరుడని చులకనగా చూడకు . సీతను ఎత్తుకెళ్లిన రాక్షసుడు ఆమెను మీరు పర్వతముపై దాచినను ,పాతాళములో దాచినాను వాడిని చంపి ఆమెను నీకు అప్పగించగల సమర్థుడు . కావున నీవు అతడితో మైత్రి ఏర్పరుచుకొనుము . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదిరెండవసర్గసమాప్తము . 

                                      శశి ,

ఎం . ఏ, ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








  

Friday 8 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదియొకటవసర్గ

                                 రామాయణము 

                              అరణ్యకాండ -డబ్బదియొకటవసర్గ 

మహానుభావా !రామా !పూర్వము నేను మిక్కిలి సుందరమైన రూపము కలిగి స్ఫురద్రూపి (కావలిసిన రూపము లోకి మారగల శక్తి కలవాడి)నై అప్పుడప్పుడు భయంకరమైన రూపము ధరించి ,అరణ్యములలో తపము చేయుచున్న మునుల చెంతకు వెళ్లి వారిని భయపెట్టుచుండెడివాడను . ఒకరోజు స్థూలశిరుడు అను పేరుకల ఒక మహర్షిని నేను ఆ విధముగానే భయపెట్టితిని . అప్పుడా మహర్షి కోపముతో" లోకభయంకరమైన ఈ రూపమే నీకు శాశ్వతముగా ఉండిపోవును "అని శపించెను . 

అప్పుడు నేను నా అపరాధమును గ్రహించి కరుణించమని ఆ మునిని వేడుకొనగా ,ఆ ముని ఇక్ష్వాకువంశీయుడైన శ్రీరాముడు నీ చెంతకు వచ్చి ,నీ భుజములను ఖండించి ,నిన్ను అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు నీకు శాప విముక్తి కలుగునని ఆ ముని చెప్పెను . అప్పటి నుండి రాక్షసాకారములో నేను ఉండిపోయితిని . అప్పుడు నేను బ్రహ్మకై ఘోర తపమొనర్చి ఆయనను మెప్పించి వరములను పొందితిని . ఆ వర గర్వముచే నేను దేవేంద్రుడిపైకి యుద్ధమునకు వెళ్ళితిని . 
అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధముచే నా శిరస్సుపై కొట్టెను . అప్పుడు నా శిరస్సు ,కాళ్ళు పొట్టలోకి కూరుకుపోయేను . అప్పుడు నేను దేవేంద్రునితో ఇటుల వున్న నేను ఎలా బతకగలను అని ప్రార్ధించగా దేవేంద్రుడు దయతలిచి నాకు పొడవైన చేతులను ,పొట్టపై నోటిని ప్రసాదించెను . అప్పటి నుండి నేను ,నా దీర్ఘబాహువులతో దొరికిన మృగములను పట్టి తింటూ బ్రతుకుచున్నాను . ఎప్పటికైనను రాముడు వచ్చి నాకు ఈ రూపము నుండి విముక్తి కలిగించునని ఎదురుచూచుచున్నాను . ఓ రామా !నీవు తప్ప నన్ను ఎవరు చంపజాలరు . కావున నన్ను దహనమొనర్పి ముక్తిని కలిగించు "అని ప్రార్ధించెను 
అప్పుడు శ్రీరాముడు కబంధునితో "కబంధా !నేను నా తమ్ముడు లేకుండుట చూసి ,నా భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు . నాకు అతడి పేరు తప్ప వివరములు ఏమియు తెలియవు . ఒకవేళ నీకు తెలిసినచో చెప్పుము "అని అడిగెను . అప్పుడా కబంధుడు రామా ఈ రూపములో నాకు జ్ఞానము లేదు నీవు నన్ను దహనమొనర్చినచో నేను నీకు తెలిసినంతవరకూ చెప్పగలను . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం .ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday 7 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదియవసర్గ

                                           రామాయణము 

                                                అరణ్యకాండ -డబ్బదియవసర్గ 

తన చేతులలో చిక్కుకున్న రామలక్ష్మణులను చూసి కబంధుడు ఓ క్షత్రియ శ్రేష్ఠులారా !నా ఆకలి సమయములో బాగుగా దొరికినారు . నాకు మిమ్ములను ఆహారముగా ఆ దేవుడే పంపినాడు . "అని పలికెను . ఆ మాటలు విన్న రామలక్ష్మణులు ఆ రాక్షసుడి భుజములను నరికివేసిరి . శ్రీరాముడు కుడి చేతిని లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేసినారు . అప్పుడా రాక్షసుడు భూమ్యాకాశములు ,దశదిశలు పిక్కటిల్లేలా అరుస్తూ నేలపై పడిపోయెను . 

అపుడా రాక్షసుడు ఆ రఘువీరులను చూసి 'మీరెవరని ప్రశ్నించెను . అప్పుడు లక్ష్మణుడు "ఈయన రఘువంశతిలకుఁడైన శ్రీరాముడు నేను ఈయన తమ్ముడు లక్ష్మణుడను .ఈ రామచంద్రుని భార్య  ను  ఒక రక్కసుడు అపహరించుటచే ఆమెను వెతుకుచూ ఇలా వచ్చితిమి . నీవెవరు ? కంఠము ,ముఖము లేక ఇటుల వికృతముగా ఎందులకు ఉంటివి ?"అని ప్రశ్నించగా ఆ రాక్షసుడు తన గాధను జ్ఞప్తికి తెచ్చుకుని వారికి తన కథను చెప్పసాగెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియవసర్గ సర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Monday 4 September 2017

రామాయణము అరణ్యకాండ -అరువదితొమ్మిదవసర్గ

                                                      రామాయణము 

                                                        అరణ్యకాండ -అరువదితొమ్మిదవసర్గ 

రామలక్ష్మణులు జటాయువుకి జలతర్పణములు అర్పించినపిమ్మట నైరుతి దిశగా సీతాదేవిని వెతుకుతూ నడసాగెను . ఆ మార్గము దట్టమైన చెట్లతో పొదలతో ప్రవేశించుటకు వీలులేకుండా ఉండెను . ఆ అరణ్యమున రామలక్ష్మణులు నడుచుచు ముందుకు సాగుతుండెను . అచట వారికి ఒక గుహ కనిపించెను . ఆ గుహ వద్ద స్థూలకాయురాలైన ఒక రాక్షసి ఉండి వీరిని అడ్డగించెను . లక్ష్మణుడు ఆ రాక్షసి ముక్కు చెవులు కోసివేసెను . అప్పుడా రాక్షసి బిగ్గరగా అరుస్తూ అచటి నుండి పారిపోయెను . 
రామలక్ష్మణులు ఆ అరణ్యములో ముందుకు సాగుతుండగా లక్ష్మణునినికి అనేక దుశ్శకునములు ఎదురయ్యెను . అందువలన వారిరువురు ,ధనుర్భాణములను ధరించి సిద్ధముగా ఉండెను . అంత కొంత దూరము వెళ్లిన పిమ్మట పెద్ద ఆకారముకల ఒక రాక్షసుడు వారికి కనిపించెను .. అతడికి ముఖము ,మెడ లేకుండెను . పొట్టలో నోరు ఉండెను . అతడి చేతులు మిక్కిలి పొడుగుగా ఉండెను . మొండెము ఒక్కటే ఉండుటచే ఆ రక్కసుడు మిక్కిలి భయంకరముగా ఉండెను . 

ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చూసి తన చేతులతో వారిని చెరో చేతితో మిక్కిలి గట్టిగా పట్టుకొనెను . రాముడు ధైర్యము సడలక ఉండెను కానీ ,లక్ష్మణుడు ప్రాణ సమానుడైన తన అన్నగారు ఆ రాక్షసుడు చేతిలో చిక్కుకొనుట చూసి దిగులుపడెను . పిమ్మట అతడు రాముడితో "అన్నా !నా గురించి ఆలోచించకు ,నన్ను వీడికి ఆహారముగా వదిలి నీవు వెడలిపో నీకు వదిన తప్పక దొరుకును . నన్ను మాత్రము మరువకుము "అని పలికెను . 
తమ్ముడి మాటలకు రాముడి ధైర్యము కొద్దిగా సడలేను కానీ ,లక్ష్మణుని చూసి ధైర్యము తెచ్చుకొనెను . 

రామాయణము అరణ్యకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Tuesday 15 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియెనిమిదవసర్గ

                                            రామాయణము 

                                            అరణ్యకాండ -అరువదియెనిమిదవసర్గ 

శ్రీరాముడు నేలపై పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గృధ రాజుని చూసి లక్ష్మణునితో "లక్ష్మణా !ఈ జటాయువు నాకోసము ఆ రాక్షసుడితో పోరాడి ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు . అయ్యో ఈయనకు నావలన కదా ఇంతటి కష్టము వచ్చిపడినది . మా తండ్రిగారికి మిత్రుడు ,నా శ్రేయోభిలాషి ఐన ఈయన ప్రాణాపాయముతో కొట్టుమిట్టాడుతూ ,నోట మాట లేక పడివున్నాడు . "అని పలికెను . 

పిమ్మట శ్రీరాముడు జటాయువుతో "అయ్యో మీకు మా వలన ఎంత కష్టము వచ్చినది . అసలు సీతను అపహరించిన ఆ రక్కసుడు ఎవ్వడు ?అతడు ఎందులకు జానకిని ఎందులకు అపహరించాడు ?అతడిదే రాజ్యము . మిమ్ము ఎటుల జయించగలిగాడు ?"అని అడిగాడు . అప్పుడు జటాయువు "రామా !ఆ రాక్షసుడి పేరు రావణుడు అతడు సీతను అపహరించుకు పోవుచుండగా నేను నా శాయశక్తులా ఎదుర్కొంటిని . కానీ అతడు నేను అలసిన తరుణములో నా రెక్కలను కాళ్ళను కండించివేసెను . 

అతడు సీతను ఎత్తుకుని దక్షిణ దిశగా పోయెను . అతడి పేరు రావణుడు . అతడు మిశ్రవసుడి కుమారుడు . లంకాధిపతి . కుబేరుడి సోదరుడు ." అని పలికి ఆ జటాయువు మరణించెను . అప్పుడు శ్రీరాముడు జటాయువును పట్టుకుని మిక్కిలి ఆక్రోశించెను . అప్పుడు ఆ క్షణములో ఆయన బాధ వర్ణనాతీతము . కొంత తడవుకు రాముడు లక్ష్మణునితో కలిసి జటాయువుకి ఉత్తమ గతులు కల్పించుట కొరకు దహనసంస్కారాది కార్యము నిర్వహించి ,పిండము పెట్టెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                             శశి ,

                                   ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు . 





Monday 14 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువది ఏడవసర్గ

                            రామాయణము 

                       అరణ్యకాండ -అరువది ఏడవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విని కోపము తగ్గించుకుని లక్ష్మణుడు చెప్పినట్టు ఆ దండకారణ్యప్రాంతమంతా  వెతుకసాగెను . కొంత దూరము వెళ్లిన పిమ్మట పెద్ద ఆకారము రక్తమోడుతూ కనిపించెను . ఆ పర్వతాకారములో వున్న ప్రాణిని చూసిన శ్రీరాముడు అది రాక్షసుడేమో సీతను మింగేసాడేమో అని ఊహించి ఆ ప్రాణిని చంపుటకు ధనుస్సుని పట్టుకొనెను . అప్పుడా ప్రాణి "రామా !నేను జటాయువుని . సీతను రావణుడు అపహరించి తీసుకుపోవుచుండగా నేను అడ్డగించినాను . నా శాయశక్తులా యత్నించినాను . ఆ రావణుడి రధమును ,అతడి సారధిని నాశనము చేసితిని . పిమ్మట అతడు నా రెక్కలు కాళ్ళు నరికి జానకిని తీసుకుని వెళ్ళిపోయాడు . "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు తన తండ్రి మిత్రుడు తనకు అత్యంత ఆప్తుడు అయిన జటాయువు ఆ విధముగా ప్రాణాపాయ స్థితిలో ఉండుట చూసి మిక్కిలి బాధపడెను . పిమ్మట రాముడు ఆ గ్రద్ద ను తాకుతూ ఏడవసాగెను . తన పెన్నిధి దూరమయినట్లుగా బాధపడసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం. ఏ ,తెలుగు పండితులు . 






Sunday 13 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదిఆరవసర్గ

                                          రామాయణము 

                                            అరణ్యకాండ -అరువదిఆరవసర్గ 

సీతాదేవి కొఱకై ఏడ్చుచు రాముడు మిక్కిలి బాధా హృదయుడు అయ్యెను . లక్ష్మణుడు అన్న పక్కనే ఉండి అన్నకు ధైర్యము చెబుతూ అన్నకు కాళ్ళు నొక్కుతూ సపరిచర్యలు చేయసాగెను . ఎన్నో విధములుగా రాముని ఓదార్చుటకు యత్నించుచు ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరువదిఆరవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు .  


Saturday 12 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియైదవసర్గ

                                                 రామాయణము 

                                                     అరణ్యకాండ -అరువదియైదవసర్గ 

సీతాదేవి ఎడబాటు వలన మిక్కిలి కృశించి వున్న రాముడు లోకములను నాశనము చేయుటకై కోపముతో రగిలిపోసాగెను . అప్పుడు లక్ష్మణుడు "అన్నా !ఇచట ఉన్న ఆనవాళ్లను బట్టీ ఇక్కడ ఇద్దరు వీరులకు భీకర యుద్ధము జరిగినదని తెలుస్తున్నది . కానీ ఇచట ఆనవాళ్లు గమనించినట్లయితే ఇక్కడ నాశనమై పడిపోయిన వస్తువులన్నీ ఒకే వ్యక్తి కి సంబందించినవి . సైన్యము కూడా యుద్దములో పాల్గొనలేదని తెలియవచ్చుచున్నది . కావున ఒక్కడు చేసిన తప్పుకు లోకములను శిక్షించుట నీవంటి ఉత్తముడు చేయదగిన పనికాదు . 
నీవు ధనుర్భాణములు ధరించి సీతాన్వేషణకై కదులుము నేను నీకు తోడుగా ఉండెదను . మునులు మనకు సహాయము చేయుదురు . నీ ధర్మపత్నిని అపహరించి న దుష్టుడు దొరుకునంతవరకు ఈ సమస్త భూమండలమును ,పాతాళమును ,సముద్రమును వెతుకుదాము . నీవు న్యాయ బద్దముగా వెతికినను వదినగారు దొరకనిచో   నీవు కోరుకున్నట్టే లోకములను నాశనము చేద్దువుగాని "అని లక్ష్మణుడు పలికెను . 





 రామాయణము అరణ్యకాండ అరువదియైదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం.  ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు






 

Thursday 3 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదినాల్గవసర్గ

                                 రామాయణము 

                           అరణ్యకాండ -అరువదినాల్గవసర్గ 

శ్రీరాముడు అటుల రోధించుచు ,తాను శోదించినను ,మరల తిరిగి లక్ష్మణుని గోదావరి నదీ తీరమునకు వెళ్లి ,సీతను వెతకమని చెప్పెను . లక్ష్మణుడు అచటకు వెళ్లి వెతికి అచట సీతాదేవి కనపడక పోవుటచే అదే విషయమును రామునికి విన్నవించెను . పిమ్మట రాముడు సీతకొరకై శోకించుచు ,"సీత ఎచటకు వెళ్ళినదో ఓ మృగములారా  చెప్పుము . ఓ వృక్షములారా చెప్పుము "అని బిగ్గరగా అరువగా మృగములన్నీ ఒక్కసారిగా లేచి దక్షిణ దిశగా పరిగెడుతూ మాటిమాటికీ రామునివంక  సీతజాడ చెబుతున్నావా అన్నట్లు చూచుచుండెను . 
అది గమనించిన లక్ష్మణుడు అన్నతో "అన్నా !ఈ మృగముల కదలికలను బట్టీ వదినగారు జాడ ఈ దిశగా వెళ్ళినచో తెలియునను అనిపించుచున్నది "అని పలికి ఇరువురు దక్షిణ దిశగా నడవసాగిరి . పిమ్మట రాముడు నేలపై పది వున్న పూరేకులను చూచెను . వాటిని గుర్తించిన రాముడు "లక్ష్మణా !ఈ పూరేకులు మీ వదినగారు ధరించినవే . వీటిని నేనే తెచ్చి ఆమెకు ఇచ్చితిని . "అని పలికెను . కొంత దూరము వెళ్లిన పిమ్మట విరిగి పడిపోయిన ధనస్సు ,కవచము ,రధము ,చనిపోయిన అశ్వములు ,మొదలగున్నవి కనిపించునేయు . వాటిని చూసిన రాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !ఈ బంగారు ధనుస్సు ఎవరిదీ అయివుండును ? ఈ బంగారు కవచము ,విరిగిపోయిన రధము ,అశ్వములు ,మొదలగున్నవి చూచుచుంటే ,ఇద్దరు రాక్షసులు సీత కొరకై యుద్ధము చేసుకుని ఉండవచ్చునని అనిపించుచున్నది "అని పలికెను . 
పిమ్మట రాముడు ఎర్రబారిన కళ్ళతో మిక్కిలి క్రుద్ధుడై లక్ష్మనునితో "లక్ష్మణా !ఈ వృక్షములు కొండలు ,మృగములు నాకు సీతజాడ చెప్పుకున్నచో నేను ఈ సమస్త లోకమును నాశనము చేసెదను "అని పలుకసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదినాల్గవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






                                            రామాయణము 

                                              అరణ్యకాండ -అరవదిమూడవసర్గ 

 
   శ్రీరాముడు సీతాదేవిని తలుచుకుని ఆమెకు ఎట్టి ఆపద వచ్చినదో అని భయపడుతూ మిక్కిలి రోదించసాగెను . లక్ష్మణుని తో సీతని తలుచుకుని బాధపడసాగెను . లక్ష్మణుడు ఎంత ఓదార్చుటకు ప్రయత్నించినను ఫలితము లేకుండెను . ఆయన బాధ హృదయవిదారకంగా ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరవదిమూడవసర్గ సమాప్తము . 

                               శశి ,

              ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు .                            

Tuesday 25 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదిరెండవసర్గ

                                        రామాయణము 

                                       అరణ్యకాండ -అరువదిరెండవసర్గ 

శ్రీరాముడు సీతకొరకు అంతటా వెతికి వెతికి సీతా !సీతా !అని బిగ్గరగా అరుచుచు ఏడవసాగెను . పిమ్మట అతడు లక్ష్మణుని పట్టుకుని "లక్ష్మణా !సీతను రాక్షసులు చంపివేసి ఉండును . లేకుంటే ఆమె న ఎదుటికి రాకుండా ఇంతసేపు ఉండదు . లక్ష్మణా !సీత లేకుండా నేను బ్రతకజాలను .   నా మాట విని నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్లు . అచటికి వెళ్లిన పిదప భరతుని కౌగలించుకుని అయోధ్యను పరిపాలించమని నా ఆజ్ఞగా చెప్పు . తల్లులని జాగ్రత్తగా చూసుకో . ముఖ్యముగా కౌసల్యా మాత ను జాగ్రత్తగా చూసుకో "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం .  ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

Sunday 23 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియొకటవసర్గ

                                          రామాయణము 

                                          అరణ్యకాండ -అరువదియొకటవసర్గ 

శ్రీరాముడు చుట్టుపక్కల అంతయు వెతికి తిరిగి ఆశ్రమమునకు వచ్చెను . అచట చెల్లాచెదురుగా పది వున్నదర్భలు ,ఆసనములను చూసేను . అప్పుడు ఆ మాహానుభావుడు లక్ష్మణుని గట్టిగా పట్టుకుని "లక్ష్మణా !సీత ఏమయిపోయినది . రక్కసులెవరైనా ఆమెను భక్షించి ఉండునా ?లేక అపహరించివుండునా ?సుకుమారి ఆ రాకుమారి కి ఎట్టి కష్టము వచ్చినదో కదా !ఆమె ఎడబాటు నేను తట్టుకొనలేక మరణించుట తధ్యము . పిమ్మట నేను ఊర్ధ్వ లోకములకు వెళ్ళినచో అచట మన తండ్రి "నేను విధించిన 14 ఏండ్లు అరణ్యవాసము పూర్తిచేయకనే ఇలా వచ్చితివి " నన్ను ఛీ కొట్టుట తధ్యము . "అని పలికెను . 
అప్పుడు లక్ష్మణుడు అన్న ను ఓదార్చుచు "అన్నా !వదినగారికిఎత్తి అపకారము జరిగివుండదు . కంగారు పడకుము . మనిద్దరమూ కలసి వదినగారిని వెతుకుదాము .  అరణ్యములో పూలు కోయుటకో లేక స్నానము చేయుటకో ,విహారమునకో వదినగారు వెళ్ళివుండవచ్చు "అని చెప్పెను . అయినను రాముడు ఊరడిల్లక "లక్ష్మణా !మనము ఇప్పుడే అరణ్యమంతా వెతికినాము కదా !సీత జాడ లభించలేదు "అని దీనవధానుడై చుట్టుపక్కల కళ్ళతోనే వెతుకుచు నిస్సహాయుడై కంట నీరు ధారగా కారుచుండగా సీతా !సీతా !అని అరుచుచు ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








 

Friday 21 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -అరువదియవసర్గ 

శ్రీరాముడు సీతాదేవి కొఱకు ఆశ్రమము చుట్టపక్కలంతా బాగుగా వెదికినను ప్రయోజనము లేకుండెను . ఆ ఆశ్రమములో సీతాదేవి రావణుడి నుండి తప్పించుకొనుటకు పెనుగులాడినపుడు అచట ఉన్న దర్భలు .ఆసనములు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయెను . ఆ ప్రదేశము శోభావిహీనముగా ఉండెను . అచటి వృక్షములు ,పుష్పములు అన్నియు సీతాదేవి లేకపోవుటచే వాడినట్లుగా ఉండెను . అట్టి ప్రదేశమును చూసి రాముడు మిగుల సోకించెను . 
"సీతను ఎవరైనా అపహరించుకుపోయారా ?చంపివేసిరా ?లేక నన్ను ఆటపట్టించుచున్నదా ?ఎవ్వరితోడు లేకుండకపోవుటచే భయపడి వనములలో తిరిగుచున్నదా ?పూవులను ,పండ్లను సేకరించుకొనుటకు ఎచటికైనా వెళ్ళినదా ?స్నానార్ధమై సరస్సుకి వెళ్ళినదా ?జలములు తెచ్చుటకై నదికి వెళ్ళినదా ?"అని పరిపరి విధములుగా రాముడు ఆలోచించుచువుండెను . సీతాదేవి కనపడక పోవుటచే శోకముచే ఆయన కండ్లు ఎరుపెక్కేను . పిచ్చివాని వలె చెట్లు వెంట పరుగెట్టసాగెను . 
కనపడిన ప్రతి చెట్టును సీతజాడ చూసితిరా అని ప్రశ్నించసాగెను . కనపడిన ప్రతి మృగమును సీతాదేవి ఆచూకీకై అడుగసాగెను . కానీ ఫలితము శూన్యము . ఆయన సీతాదేవి వృక్షముల వెనక దాగుకుని ఆటపట్టించుననుకొని "వృక్షముల వెనక దాగుకొని నన్ను ఆటపట్టించినది చాలు ఇక బయటకు రా "అని పిలువసాగెను . కానీ సీతాదేవి రాకపోవుటచే "సీతాదేవిని రాక్షసులు భక్షించి ఉండును . కావునే ఆమె కనిపించుటలేదు "అని భావించెను . శ్రీరాముడు ఆవిధముగా విశాలమైన దట్టమైన అడవులలో పరిగెడుతూ మిక్కిలి అలసిపోయెను . అయినప్పటికీ సీతాదేవిని వెతుకుతూ పిచ్చివాని వలె తిరుగసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday 20 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                                                      రామాయణము 

                                                     అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణునితో పదేపదే సీతాదేవిని వదిలివచ్చినందుకు పరుషముగా మాట్లాడసాగెను . అప్పుడు లక్ష్మణుడు అరుపులు విని సీతాదేవి భయపడి లక్ష్మణుని సహాయముకై వెళ్ళమనుట ,లక్ష్మణుడు అంగీకరించకపోవడంతో సీతాదేవి పరుషముగా మాట్లాడుట ఆ మాటలు తట్టుకోలేక లక్ష్మణుడు రాముని వద్దకు బయలుదేరుట మొదలైన వృత్తాంతమును అంతయు శ్రీరామునికి తెలిపెను . అయినను శ్రీరాముడు లక్ష్మణుని "మీ వదినగారు తెలియక అటుల మాట్లాడినప్పటికీ నీవు ఆమెను విడిచి రాకుండా వుండవలసినది "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    

రామాయణము అరణ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ

                                              రామాయణము 

                                             అరణ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ 

రాముడు సీతాదేవికి ఏ ఆపద సంభవించిందో అని భయపడుతూ లక్ష్మణునితో కలిసి వడివడిగా ఆశ్రమమువైపు నడవసాగెను . ఆయన మిక్కిలి అలసిపోయినప్పటికీ సీతాదేవిపై కల అపారమైన ప్రేమ వలన ఆయన ఎచ్చటా విశ్రమించకుండా తన నడక సాగించెను . బడలిక చేత ఆయన ముఖము మిక్కిలి వాడి ఉండెను . 
ఆ విధముగా రామ్లష్మణులు ఇరువురూ పరుగులాంటి నడకతో ఆశ్రమము చేరి సీతాదేవి కొరకు ఆశ్రమము అంతా వెతికేను . ఆశ్రమము చుట్టుపక్కలా ,సీతాదేవి తానూ కలిసి తిరిగిన విహారప్రాంతములు అన్నియు వెతికేను . కానీ ఫలితం శూన్యం . పిమ్మట శ్రీరాముడు సీతాదేవి కనిపించక క్షణకాలం శ్రీరాముడు నిస్చేస్తుడయ్యెను . 

రామాయణము అరణ్యకాండ ఏబది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    

Tuesday 18 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదియేడవసర్గ

                                              రామాయణము 

                                                  అరణ్యకాండ -ఏబదియేడవసర్గ 

బంగారుజింక రూపములో వున్న మారీచుని చంపి శ్రీరాముడు వెనుతిరిగి ఆశ్రమము వైపు వడివడిగా నడవసాగెను . ఆ మహానుభావుడు తన మనసులో "నాకు దుశ్శకునము లు కనిపించుచున్నవి . సీతాదేవి ఆశ్రమములో క్షేమముగానే ఉండును కదా !ఆ రాక్షసుడు మరణిస్తూ సీతా !లక్ష్మణా !అని బిగ్గరగా అరిచాడు . ఆ అరుపులు విని సీత నాకేదో ఆపద సంభవించిందని బయపడి లక్ష్మణుని నా వద్దకు తప్పక పంపును . అక్కడ ఆమె ఒక్కటే ఉంటుంది . "అని ఆలోచిస్తూ నడవసాగెను . 
ఇంతలో దీనవధనుడైన   లక్ష్మణుడు రాయుడికి ఎదురుపడెను . లక్ష్మణుని చూసిన రాముడు కంగారుపడి ,"లక్ష్మణా !మీ వదిన సీతను ఒక్కదాన్నే వదిలి నువ్వు ఎందుకు వచ్చావు ?"అని మందలించెను . అసురులు తిరిగే ఈ అరణ్యప్రాంతములో ఆమెను ఇలా వదిలి వచ్చుట క్షేమము కాదు . మనము చంపుటచే పగ పూనిన రాక్షసులు ఆమెను చంపుట  తినివేయుట చేసివుండెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

Monday 17 July 2017

రామాయణము అరణ్యకాండ -ప్రక్షిప్తసర్గ

                                           రామాయణము 

                                               అరణ్యకాండ -ప్రక్షిప్తసర్గ 

సీతాదేవి లంకలో ప్రవేశించిన పిమ్మట బ్రహ్మదేవుడు ఇంద్రుని పిలిచి "ఓ దేవరాజా !దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకు పోయి లంకలో ఉంచాడు . దీనివలన రాక్షసుల వినాశనం కలిగి లోకములకు మేలు కలుగుతుంది . కానీ పతివ్రతా శిరోమణీ ,సాధ్వీ ,సుకుమారురాలు అయిన సీతాదేవి లంకలో అడుగుపెట్టింది మొదలు ఏమియు తినుటలేదు . ఆ పతివ్రతా శిరోమణి అటుల తినకుండా వున్నా యెడల ఆమె ప్రాణములకే ముప్పు వచ్చును . 
ఆమె అటుల మరణించుట లోకములకు మంచిది కాదు . కావున నీవు వెళ్లి ఆ సాధ్వికి దివ్యపాయసమును అందించుము . "అని ఆజ్ఞాపించేను . అప్పుడు ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి లంకా నగరమునకు బయలుదేరెను . నిద్రాదేవి ప్రభావంతో రాక్షసులందరూ నిద్రించెను .

 అప్పుడు ఇంద్రుడు సీతాదేవి వద్దకు వెళ్లి "సాధ్వీ !నేను సురారాజుని . మహాత్ముడైన శ్రీరామునికి కార్యసిద్ధికై తోడ్పడగలను . కనుక నీవు శోకింపవలదు . 
నా మాయా ప్రభావమున రక్కసులందరూ నిద్రలో మునిగి ఉండిరి . శ్రీరాముడు సముద్రము దాటి వచ్చుటకు నేను సహాయము చేసెదను . నీ భోజనమునకై నేను దివ్య పాయసమును తెచ్చితిని . ఓ పూజ్యురాలా !ఈ పాయసమును ఆరగింపుము .దీని ప్రభావమున ఆకలి దప్పులు నిన్ను ఎప్పటికి బాధించవు . "అని పలికెను . ఆ మాటలు విన్న సీతాదేవి "నీవు ఇంద్రుడివే అని నేను నమ్ముట ఎట్లు ?నేను ఇదివరకు శ్రీరాముడు తో కలసి వనవాసము చేసినప్పుడు దూరమునుండి నిన్ను చూసితిని . నేను ఆనాడు   చూసిన ఆ దేవా లక్షణములు చూపించిన యెడల నమ్మెదను "అని పలికెను . 

ఆ మాటలు విన్న ఇంద్రుడు సీతాదేవి ఆంతర్యము గ్రహించి ,తన దేవలక్షణములు ప్రదర్శించెను . ఆయన కాళ్ళు నెలకు తాకక ఉండెను . ఆయన కళ్ళు రెప్ప పడక ఉండెను . దివ్య వస్త్రములు దేదీప్యమానంగా వెలుగుచూవుండెను . ఆయన ధరించిన పూల మాల వాడక ఉండెను . ఆ లక్షణములు చూసిన సీతాదేవి ఆయన ఇంద్రుడని గ్రహించి ,తన భర్త పేరు వినుటచే మిక్కిలి సంతోషపడెను . ఇంద్రుడు అందించిన దివ్యపాయసమును భక్షించెను . పిమ్మట ఆవిడకు కల ఆకలిదప్పికలు తొలగిపోయెను . పిమ్మట ఇంద్రుడు సీతాదేవి వద్ద సెలవు తీసుకుని అచ్చటనుండి వెళ్లిపోయెను . 

రామాయణము అరణ్యకాండ ప్రక్షిప్తసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 16 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిఆరవసర్గ

                                        రామాయణము 

                                           అరణ్యకాండ -ఏబదిఆరవసర్గ 

రావణుడు ఆవిధముగా పలుకగా సీతాదేవి నిర్భయముగా ఒక గడ్డిపోచను అడ్డుపెట్టుకుని "రాక్షసుఁడా !నా భర్త రగువంశోత్తముడు ,శూరుడు ఆయనే తలుచుకున్నచో చంద్రుడిని సైతము పడవేయగలడు . సముద్రమును ఇంకిపోవునట్టు చేయగలడు . అతడు తనసోదరుడు లక్ష్మణుడితో సహా వచ్చి నిన్ను నీ పరివారమును సర్వనాశనం చేయుదుడు . దండకారణ్యము నుండి నీవు కపటోపాయముతో నన్ను చెట్టితివి . అప్పుడే నీవు రాముని కంట పడివుండిన యెడల నీ ఆయువు అప్పుడే తీరిపోయివుండేది . రాముడు తప్పక ఇచటకు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు . 
నేను జనకుని పుత్రికను ,దశరధుని కోడలిని ,శ్రీరాముని ఇల్లాలును . ఎట్టిపరిస్థితిలలో నేను ధర్మము తప్పి వర్తించను . కలలో కూడా నా భర్తను తప్ప అన్య పురుషులను తలవను . ఇది సత్యము "అని పలికెను . 
సీత మాటలకు క్రోధోదిక్తుడైన రావణుడు "సీతా !నీకు పండ్రెండు నెలల సమయము ఇచ్చుచున్నాను . ఈ లోపు నా దారికిరా . లేనియెడ నిన్ను మా వంటవాళ్లు ముక్కలుముక్కలుగా కోసి కూరగా చేసెదరు . "అని పలికి అక్కడ వున్న రాక్షస స్త్రీలతో ఈమెను అశోకవనంలో రహస్య ప్రదేశములో ఉంచి జాగరూపులై కాపాడుడు . నయానో భయానో నా దారికి తీసుకు రండు "అని పలికి 
భూమిని బద్దలు చేయుచున్నాడా అన్నట్లుగా పెద్దగా పెద్దగా చప్పుడు చేయుచు నడిచి వెళ్లిపోయెను . అంతట ఆ రాక్షస స్త్రీలందరూ అశోకవనమునకు సీతాదేవిని తీసుకెళ్లి అచట తమ మాటల్తో భయపెడుతూ ఉండెను . సీతాదేవి ఆ రాక్షస స్త్రీల మధ్యలో భయముతో బతుకుతూ శ్రీరామునే మనసులో తలుచుకుంటూ కాలము వెళ్లదీయసాగెను . 

రామాయణము అరణ్యకాండ ఏబది ఆరవసర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .