Sunday 19 June 2016

రామాయణము బాల కాండ -పదునైదవ సర్గ

                         రామాయణము 

                           బాల కాండ -పదునైదవ సర్గ 

ప్రజ్ఞా వంతుడు అధర్వనాది వేదములయందు పందితుడును అయిన ఋశ్యశృంగ మహర్షి దశరదునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యముల గురించి ఒక్క క్షణము ఆలోచించెను . పిదప కర్తవ్యము స్పురింప గా ఆయన మహారాజుతో ఇలా అనెను . "ఓ రాజా !నీకు పుత్రులు కలుగుటకై 'అధర్వ శిరస్సు 'అను వేద భాగము నందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా 'పుత్రకామేష్టి 'అను క్రతువును నిర్వహించెదను . "అప్పుడు ఆ ఋషి "పుత్రకామేష్టి "యాగమును ప్రారంభించెను . ఆ తేజశ్శాలి వేద మంత్రములను పతించుచుఅగ్నికి ఆహుతులు ఇచ్చెను . పిమ్మట బ్రహ్మాది దేవతలు ,గందర్వులు ,సిద్దులు ,మహర్షులు తమ తమ హవిర్భాగములు గ్రహించుటకై యదా క్రమము గా యజ్ఞ శాల అందు ప్రత్యక్షమయిరి . దేవతలు అందరూ క్రమముగా సదస్సునకు చేరి ,సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవునితో ఇలా విన్నవించుకున్నారు . 
"ఓ దేవా !నీవు అనుగ్రహించిన వర ప్రభావము వలన రావణుడు అను రాక్షసుడు తన పరాక్రము చే మమ్ములను చిత్ర హింసల పాలు చేయుచున్నాడు . అతనిని అదుపు చేయుటకు మేము ఆశక్తులము . హే భగవాన్ !పూర్వము అతని తపస్సుకు మెచ్చి ,నీవు ఆయనకు  వరము ప్రసాదించితివి . దానిని గౌరవించుచు అతడు ఒనరించు ఆగడములను అన్నిటిని ఒర్చుకోనుచున్నాము . ఆ దుర్మార్గుడు వర గర్వముతో ముల్లోకములను భాదించుచున్నాడు . వున్నతులైన దిక్పాలకురిని ద్వేషించుచున్నాడు . స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని సయితము రాజ్య బ్రష్టుడిని చేయ చూస్తున్నాడు . అతడు వర గర్వితుడై కన్ను మిన్ను కానక ఎదురులేనివాడై ఋషులను ,యక్షులను ,గంధర్వులను ,అసురులను ,అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించు చున్నాడు . రావణుడు తన క్రీడా పర్వతమున విహరించునపుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించు కొనుచున్నాడు . వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుట లేదు . వువ్వెత్తు తరంగములతో వుండు సముద్రుడు అతనికి భయపడి చలించుట లేదు . ఓ మహాత్మా భయంకరాకారుడు అయిన రాక్షసుడికి భయపడి మేము గడ గడలాడుచున్నాము . కావున వాడిని హతమార్చు ఉపాయము మేరె ఆలోచించండి ". 
దేవతలు తనను ఇట్లు ప్రార్ధింపగా బ్రహ్మ దేవుడు కొంత సేపు ఆలోచించి వారితో ఇట్లు అనెను . "భళా ఆ దుర్మార్గుడిని చంపు ఉపాయము తోచినది . గంధర్వుల చే కాని ,యక్షులచే కాని ,దానవుల చే కాని ,రాక్షసుల చే కాని తనకు చావు లేకుండా వరమిమ్మని రావణుడు నన్ను అర్ధించెను . నేను అలాగే అన్నాను . "ఆ రావణుడు వరము కోరు సమయములో మానవులంటే కల చులకన భావముతో వారి నుండి చావు లేకుండా వరం కోరలేదు . కావున మానవుని చేతిలోనే అతని మరణము "బ్రహ్మ దేవుడు పలికిన మాటలు విని దేవతలు ఋషులు అందరూ మిక్కిలి సంతోష పడిరి . ఇంతలో విష్ణు మూర్తి శంఖ ,చక్ర ధారియై ,దివ్య తేజస్సుతో విరాజిల్లుతూ యాగశాలకు వచ్చెను . అప్పుడు విష్ణు మూర్తి బ్రహ్మ దేవుడితో కలసి అక్కడ ఆసీనుడయ్యెను . ఆయనను చూసి దేవతలు అందరూ ఆయనను ఈ విధముగా ప్రార్ధించిరి . 
"ఓ మహా విష్ణూ అయోధ్యాదిపతి అయిన దశరద మహారాజు సర్వ సమర్ధుడు . ధర్మజ్ఞుడు ,ఉదార స్వభావము కలవాడు . అతని ముగ్గురు భార్యలు దక్ష కన్యలైన హ్రీ ,శ్రీ ,కీర్తి అను వారితో సమానులు . వారికి నాలుగు రూపములలో పుత్రుడవు కమ్ము . రావణుడు వర ప్రభావమున లోక కంటకుడు అయ్యెను . అతనిని దేవతలు ఎవ్వరూ చంపలేరు . నీవు మానవుడిగా అవతరించి అతడిని హతమార్చుము . రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరమ గర్వముతో దేవతలను ,గంధర్వులను ,సిద్దులను ,మునీశ్వరులను యుక్తా యుక్త విచక్షణ లేకుండా మిక్కిలి భాదించు చున్నాడు . ఆ క్రూరుడు ఋషులను అట్లే నందన వనమున విహరించు చున్న గంధర్వులను ,అప్సరసలను హింసించు చున్నాడు . ఓ శత్రు భయంకరా !మహా విష్ణూ !మా అందరికీ నీవే దిక్కు . కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకు మానవుడై అవతరించుటకు సంకల్పిమ్పుము . "
బ్రహ్మాది దేవతలు ఇలా ప్రార్ధింపగా సకల్ లోకారాధ్యుడు ,దేవదేవుడు అయిన ఆ శ్రీ మహా విష్ణువు తనను శరణు జొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలతో ఇలా పలికెను . "భయమును వీడండి . క్రూరుడు ,దుర్మార్గుడు ,దేవతలను భాదించువాడు అగు రావణుని అతని పుత్రులను ,పౌత్రులను ,అమాత్యులను భందువులను ,మిత్రులను జ్ఞాతులను అందరికి లోక హితార్ధమై యుద్దమున హతమార్చి తీరెదను . పిమ్మట పదునొకండు వేల సంత్సరముల కాలము ఈ మానవ లోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించెదను . "అని సకల ప్రానులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహా విష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవ లోకమున తను అవతరింప దగు  స్తానమును గూర్చి ఆలోచించెను . పిమ్మట ఆ రాజీవ లోచనుడు తాను దశరద మహారాజుకి నాలుగు రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను . 

రామాయణము బాలకాండ పదునైదవ సర్గ సమాప్తము . 


                     శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment