Monday 6 June 2016

రామాయణము బాలకాండ -మొదటి సర్గ

                                రామాయణము 

                             బాలకాండ -మొదటి సర్గ       

అనంతరం  ప్రభువు అయిన సుగ్రీవుడు వివిధ ప్రదేశములనందు వున్న వానరులన్దరిని రప్పించి ,సీతాన్వేషనకై వారిని నల్దిక్కులకు పంపెను . మహా బల సంపన్నుడైన హనుమానుడు గృధ రాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనములు విస్తీర్ణము కల సముద్రమును ఒక్క గంతులో దాటెను . 
అంతట ఆ రామ బంటు రావణుడి చే పాలింప బడుతున్న లంకకు చేరెను . సీతాదేవి కోసం వెతుకుచూ అశోక వనమునకు చేరెను . అక్కడ రామ ధ్యానము నందు  నిమగ్నమైన సీతాదేవిని చూసేను . అప్పుడు ఆంజనేయుడు రామ ,సుగ్రీవుల మైత్రిని తెలిపి ,రామ నామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా ఇచ్చెను . ఆమెకై శ్రీ రాముడు పరితపించు చున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను . పిమ్మట అశోక వనమును ద్వంసము చేసెను . 
వాయు సుతుడు 5 గురు సేనా పతులను 7 గురు మంత్రి పుత్రులను అంతమొందించెను . శూరుడైన అక్షకుమారుని హతమార్చెను . ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముకు బుద్ది  పూర్వకముగా కట్టుబడెను . బ్రహ్మాస్త్రమునకు తాను బంధుడను కాకున్నను ,అయినట్లు నటించుచు రామ కార్యము కొరకై రాక్షసులు పెట్టు భాదలు సహించెను . 
రావణుని ఆజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పు అంటించ గా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమును తప్ప లంకను దగ్ధము కావించెను . సీతా దేవికి తన కుశల వార్త తెలిపి ,శ్రీ రాముడికి సీతా దేవి జాడ చెప్పి సంతోష పెట్టుటకై అతి వేగముగా శ్రీ రాముడి చెంతకు చేరెను . కనుగొంటిని సీతమ్మను అని ఆ వృత్తాంత మంతా సవివరముగా రామునకు తెలిపెను . 
ఆ సమాచారమును విన్న శ్రీ రాముడు సుగ్రీవుడు మొదలగు వానర వీరులన్దరితో కలసి సముద్ర తీరమునకు చేరెను . అనంతరం సూర్య కిరణముల వంటి తీక్షణమైన భాణములతో దారి విడమని సముద్రమును అల్లకల్లోలము చేసెను . అప్పుడు సముద్రుడు తన నిజ రూపముతో రాముని ఎదురుగా నిలిచి రామునకు కొన్ని సూచనలు అందించెను . ఆ సూచనల మేరకు సముద్రముపై నలుని ద్వారా సేతువు (వారధి )నిర్మింప చేసెను . 


ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రణ రంగమున రావణుడిని హతమార్చెను . తదననంతరం సీతను సమీపించి పరుల పంచన ఉన్న ఆమెను స్వీకరించుటకు సందేహించెను . అందరి ఎదుట పరుషముగా మాట్లాడెను . సాధ్వి అయిన సీతా దేవి ఆ మాటలు భరించలేక అగ్నిలో ప్రవేశించెను . అప్పుడు అగ్ని దేవుడు ప్రత్యక్షమై "సీతాదేవి త్రికరణ సుద్దిగా పరమ సాద్వి ,దోష రహిత "అని ప్రకటించెను . అప్పుడు శ్రీ రాముడు పరమ సంతుష్ఠుడు అయ్యెను . శ్రీ రాముడి ధర్మ నిరతికి దేవతలు అందరు కొనియాడిరి . పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్టుడు అయిన విభీషణుని లంకా నగరానికి రాజుగా పట్టాభిషేకము చేసెను . 
తన విజయమును పొగడడానికి వచ్చిన దేవతల నుండి వరములను పొంది ,ఆ వర ప్రభావముతో రణరంగమున చనిపోయి పది ఉన్న వానరులను తిరిగి బతికించెను . పిమ్మట శ్రీరాముడు సీతా ,లక్ష్మణ ,సుగ్రీవ ,విభీషణ మొదలగు మిత్రులతో కలసి పుష్పక విమానమున అయోధ్యకు బయలుదేరెను . తమ రాకను తెలుపుటకు ముందుగా ఆంజనేయుని భరతుని వద్దకు పంపెను . చక్కగా పితృవాక్య పరిపాలన ఒనర్చిన శ్రీరాముడు నంది గ్రామమున తన సోదరుని కలిసి జటా దీక్షను పరిత్యజించెను . పిమ్మట సీతాదేవి కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను . 




                  శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 





No comments:

Post a Comment