రామాయణము
బాలకాండ -పదునెనిమదవ సర్గ
రఘు వంశజులలో మహా తేజశ్శాలీ అయిన శ్రీ రాముడు అమోఘమైన పరాక్రమము కలవాడు . సమస్త ప్రజలకు పూర్ణ చంద్రుడి వలె ఆహ్లాద కరుడు . రాముడు ఏనుగు ఎక్కి ,గుఱ్ఱమును అధిరోహించి ,రథమునందుండి యుద్ధము చేయుటలో కుశులుడు . ధనుర్విద్య నందు నిపుణుడు . సర్వదా తల్లి తండ్రుల సేవలో నిమగ్నుడై ఉండెడివాడు . ప్రజలను ఆనందింప చేయునట్టి అన్నయగు రాముని యందు లక్ష్మణుడు బాల్యము నుండి భక్తి తత్పరుడు నిత్యమూ ఆయనను సేవించుటే ఒక మహా భాగ్యముగా భావించేవాడు . రామ సేవల అందే నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏ మాత్రమూ పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావముతో అన్ని విధములుగా ప్రియమును గూర్చు వాడు . అతడు రామునకు బహి ప్రాణము పురుషోత్తముడైన రాముడు లక్ష్మణుడు తన దగ్గర లేకపోతే నిద్రపోయేవాడు కాదు . తల్లి కౌశల్య తీసుకువచ్చిన కమ్మని భోజన పదార్ధములను లక్ష్మణుడు తోడు లేనిచే భుజించెడివాడుకాదు . అనగా రాముడు లక్ష్మణుడిని విడిచి క్షణ కాలమైనా వుండేవాడుకాదు . రాముడు గుఱ్ఱమెక్కి వేటకు వెళ్లునప్పుడు లక్ష్మణుడు ధనస్సు చేబూని , అతడిని కాపాడుతూ వెంట నడిచి వెళ్ళేవాడు .
లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవా స్వభావము కలవాడు . అతడు భరతుడికి ప్రాణము ల కంటే ప్రియమైన వాడు . అట్లే శత్రుఘ్నుడు భరతునిపై ఎనలేని ప్రేమను కలిగి ఉండేవాడు . చక్కని శుభ లక్షణ సంపన్నులు అగు తన నలుగురు ప్రియ పుత్రులతో కూడిన దశరధుడు ఇంద్ర ,యమ ,వరుణ ,కుభేరులు అణు నలుగురు దిక్పాలకులతో కూడిన బ్రహ్మ దేవుని వలె పరమానంద భరితుడయ్యెను . ఆ నలుగురు రాజకుమారులు వివిధ శాస్త్ర జ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసి గాంచిరి . శ్రేష్ఠులైన ఆ రాజ కుమారులు వేద వేదాంగ ,స్మృతి ,పురాణేతిహాసములను శ్రద్దగా అధ్యయనము చేయుచుండిరి . ధర్మానుర్వేదము నందు నిష్ఠ కలిగి ఉండిరి .
మహాత్ముడైన దశరధుడు యుక్తవయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడు జోడైన కన్యలతో వివాహములు జరిపించుటకై గురువులతోను ,భందువులతోను బాగా ఆలోచిస్తూ ఉండెను . ఆ విధముగా ఆలోచిస్తుండగా మహా తేజశ్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి అక్కడకు వచ్చెను . రాజును దర్షింప కోరి ఆ ముని ద్వార పాలకులతో "నేను గాది రాజు కుమారుడును ,కుశకుని వంశము వాడను , నా పేరు విశ్వామిత్రుడు ,నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలపండి . "అని పలికెను .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment