Tuesday 7 June 2016

రామాయణము బాల కాండ -రెండవ సర్గ

                     రామాయణము 

                      బాల కాండ -రెండవ సర్గ 

                      రామాయణము యొక్క ఆవిర్భావము 


ధర్మాత్ముడు ,శాభ్దార్ధ విశేషములను బాగుగా ఎరిగి ,వివరించుట అందు నేర్పరి అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించి ,శిష్య సమేతుడై నారద మహర్షి ని విధి విదానముగా పూజించెను . దేవా ముని అయిన నారదుడు వాల్మీకి పూజలు అందుకుని ,ఆయన ఆజ్ఞను తీసుకొని ఆకాశ మార్గమున వెళ్ళిపోయెను . నారదుడు బ్రహ్మ లోకమునకు వెళ్ళిన తర్వాత వాల్మీకి మహా ముని గంగా తీరమునకు సమీపమున కల తామసా నదీ తీరమునకు వెళ్ళెను . 
ఆ మహర్షి తామసా నదీ తీరమునకు చేరి ,నిర్మలమైన ఆ జలమును చూసి పక్కనున్న శిష్యునితో ఇలా అనెను . "ఓ భరద్వాజా ఎ మాత్రము బురద లేని ఈ తీర్ధము నిష్కల్మషమైన సత్పురుషుని మనస్సు వలె స్వచ్చముగా ,రమణీయముగా వున్నది . నా స్నాన వస్త్రాన్ని ఇమ్ము . గంగా జలము వలె పవిత్రమైన ఈ తామసా తీర్ధమున స్నానము చేసెదను . నీవునూ ఇక్కడే స్నానము చేయుము ". మహా తపస్వి అయిన వాల్మీకి ఇలా ఆదేశించగా గురు సేవా నిరతుడైన భరద్వాజుడు ఆ మహర్షికి వల్కలము అందించెను . వాల్మీకి ఆ వనమును తిలకించుచు దివ్యమైన ఆ వన అందమునకు మిక్కిలి ఆశ్చర్య పడెను . 
అప్పుడు వాల్మీకి మహర్షి క్షణ కాలమైనను ఎడబాటు సహించలేని క్రౌంచ పక్షుల జంటను చూసెను . అన్యోన్య అనురాగముతో ఉన్న వాటి మధుర ద్వనులు వినెను . సమస్త ప్రాణులను నిష్కారణముగా హింసించు స్వబావము కల క్రూరుడు అయిన ఒక కిరాతకుడు వాల్మీకు చూస్తుండగానే క్రౌంచ పక్షుల జంట లోని మగ పక్షిని బాణముతో కొట్టెను . ఆ దెబ్బకు నేలపై పడి గిల గిల కొట్టుకుంటున్న మగ పక్షిని చూసి ఆడ పక్షి జాలి గొలుపు ద్వానితో ఎడవసాగెను . ఈ దృశ్యమును చూసిన వాల్మీకి మహర్షి హృదయము బాదతో నిండిపోగా ఇట్లు రతి క్రీడలో ఉన్న పక్షులను హింసించి విడదీయుట కసాయితనము అని భావించి "ఓ కిరాతుడా క్రౌంచ పక్షుల జంటలో కామ పరవశమై ఉన్న ఒక పక్షిని చంపితివి ఈ పాప కారణముగా నీవు ఎక్కువ కాలము జన్మించవు "అని శ్లోక రూపమున కిరాతుదితో పలికెను . 




తాను అప్రయత్నముగా  పలికిన శ్లోకము గురించే ఆలోచిస్తూ తన శిష్యులతో ఈ విధముగా అనెను . "నేను పలికిన మాటల సమూహము సమానాక్షరములు గల నాలుగు పాదములతో ఉన్నది . లయ బద్దమై వాద్య యుథముగా గానము చేయుటకు వీలుగా వున్నది . కనుక ఇది ఛందో బద్దమైన శ్లోకమే ". వాల్మీకి తాను పలికిన శ్లోకమునే తలుచు చు తన దైనందిక కార్యక్రమములు చేసుకొనెను . ఆయన శిష్యుడు భరద్వాజుడు ఆ శ్లోకమును కంటస్థముచేసెను . సృష్టి కర్త ,లోకములకు అధిపతి ,మహా తేజశ్శాలి అయిన బ్రహ్మ వాల్మీకి మహర్షిని చూచుటకై స్వయముగా వాల్మీకి ఆశ్రమమునకు వచ్చెను . 




           శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .  








No comments:

Post a Comment