రామాయణము
ఉత్తరకాండ ---------రెండవసర్గ
శ్రీ రాముడు ఆ విధముగా అడుగగా అగస్త్య మహాముని ఆ ప్రభువుతో" రామా ! తేజోభాల మహిహుడైన ఆ ఇంద్రజిత్తు యొక్క వృత్తాన్తమును గూర్చి వివరించెదను వినుము అతడు తన శక్తీ సామర్ధ్యముల చే అనే క మందిని శత్రువులను సంహరించెను . సాదారణముగా ఎంతటి శత్రువులైన అతన్ని వధింపలేరు రామా! ముందుగా రావణుని వంశ క్రమము అతని పుట్టు పూర్వోత్తరాలు , అతనికి వారములు లభించిన విధము వివరించెదను . శ్రద్దగా వినుము .
ఇది కృతయుగము నాటికథ పూర్వము పులస్త్యుడు అను ఒక బ్రహ్మర్షి కలదు . అతడు బ్రహ్మ దేవుడి మానస పుత్రుడు . సర్వ సమర్ధుడు తేజ్జస్సయాలి ధర్మ నిరతుడు . అతడు బ్రహ్మ దేవుని యొక్క కుమారుడగుట వలన సకల దేవతలకు ప్రీతీ పాత్రుడు . ఈ పులస్త్యుడు మీరు పర్వతము పక్కన గల కరుణ భిందు మహర్షి యొక్క ఆశ్రమునకు వెళ్లి అక్కడ తపస్సు చూస్సుకుంటూ జీవింప సాగెను . ఆ ప్రదేశము మిల్కీలి ఆహ్లాదకరంగా ఉండుటచే దేవకన్యలు నాగకన్యలు , ఋషితనాయాలు , అప్సరసలు , ఆ ప్రదేశమునకు వచ్చి ఆట పాటలతో , భాగ్యములతో నృత్యములతో , వినోదించుచుండిరి . వారి క్రీడల వలన పులస్త్యముని యొక్క తపస్సు విఘ్న్స్ములు కలుగస్హుండెను నదులకు కోపించిన ఆ మహర్షి 'న దృష్టి సోకినా కన్య గర్భవతి అగును . ' అని కఠోరంగా పలికెను .
ఆ మహాత్ముని కైనా వచనములు వినినంతనే వారందరు భయపడి ఆ ప్రదేశమునకు వచ్చుట మానివేసిరి . రాజర్షి అయిన కృంఅభింధుని కూతురునకు మాత్రము ఆ మాటలు వినబడలేదు . అందు వలన ఆమె నిర్భయముగా యధాప్రకారం ఆ అస్త్రము ప్రదేశమున సంచరింపసాగెను . కానీ ఆమెకు తన స్నేహితులెవ్వరు అక్కడ కనిపించలేదు . ఆ సమయములో పులస్త్యుడు తన తపస్సులో బాలగంగా వేదాధ్యయనము చేయుచుండెను . ఆ వేదం పఠనము విన్న ఆ కరుణ భిందు మహర్షి పుత్రిక పులస్త్యుని వద్దకు వెళ్లి ఆయనను దర్శించెను . అపుడు ఆమహర్షి దృష్టి సోకినా ఫలితముగా ఆమె దేహములో గర్భవతి లక్షణములు ఏర్పడెను . హఠాత్తుగా తంలో కల్పడిన ఆ లక్షణములను గమనించి ఆమె మిక్కిలి ఆందోళనకి గురిఅయ్యేను. ' నాలో ఈ మార్పు ఎట్లు ఏర్పడినది ? అని చింతించుచూ తడ్రివద్దకు వెళ్లి నిలిచెను . అపుడు తృణ భుందువు తన దివ్య ద్రిష్టియహో జరిగిన విషయములన్నిటినీ తెలుసుకొని తన కుమార్తెను వెంటబెట్టుకొని పులస్త్యుని వద్దకు వెళ్లెను .
అప్పుడు తృణ భిందువు పులస్త్యునితో " పూజ్య మహర్షి ఈమె నా కూతురు సద్గుణ సంపన్నురాలు , ఈమెను భార్యగా సవీకరింపుము ఈమె సర్వదా నీకు సుశ్రూషులొనర్చగలదు " అని పలికెను . అప్పుడు పులస్త్యుడు ఆమెను తన భార్యగా సవీకరించెను .
తృణభిందువు కుమార్తె థన్ భర్త అయినా పులస్త్యుని సర్వదా భక్తి ప్రభక్తులతో సేవించ సాగేను . అందులకు సంతుష్టులైన పులస్త్యుడు ఆమెతో దేవి నీ సత్ప్రవర్తనకు నేను ముగ్దుడ్ని అయినాను . కనుక ఓ సుభాఆంగి నేడు నీకు ఒక పుతృడిని ప్రసాదించెదను . అతడు నా అంతటి వాడు , మన ఉభయ వంశములకు వన్నె తెచ్చువేశాడు , నేను వేదపఠనం చేయునపుడు ఆ వేదమంత్రములను నీ గాభమునందునుండీ గ్రహించగలడు . కాబట్టి అతడికి విశ్రవసుడు అని పేరు ఏర్పడును . " అని పలికెను . ఆ మాటలు విని ఆమె పరమానంద భరితురాలాయెను . పిమ్మట కొద్దీ కాలముఅంకే విశ్రవసుడు జన్మించెను . అతడు ధర్మాత్ముడిగా ముల్లోకములు యందును ప్రసిద్ధి వహించెను . క్రమముగా అతడు తండ్రివలనే వేదం పండితుడు సమదృష్టి కలవాడు సదాచారముల యందు , వ్రతములను ఆచరించుట యందు నిరతికలవాడై తపశ్చర్యలతో మునీశ్వరుడుగా ప్రేఖ్యాతి లభించెను .
రామాయణము ---------ఉత్తరకాండ -------రెండవసర్గ ----------సమాప్తము
శశి,
ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment