Monday 18 May 2020

రామాయణము ఉత్తరకాండ -ముప్పదిఒకటవసర్గ

                                        రామాయణము 

                                                                                                                                                                                      ఉత్తరకాండ -ముప్పదిఒకటవసర్గ 

అప్పుడు శ్రీ రాముడు అగస్త్యమునితో  "  విప్రోత్తమా!  క్రూరుడైన  ఆ రావణాసురుడు  విజయగర్వంతో  భూమండలమున తిరుగుచున్నప్పుడు భల  పరాక్రమములు  గల  క్షత్రియులు  ఒక్కరుకూడా  ఇక్కడ లేకుండెనా ?
లేక పోతే  ఆ కాలములో రాజులందరూ శాస్త్రజ్ఞానం  లేనివార ? " అని ప్రశ్నించెను . అప్పుడు  అగస్త్యమహా ముని నవ్వుతూ  "రామా! రావణుడు  రాజులందరిని పరాజితులు చేస్తూ  మాహిష్మతీ  పురమునకు చేరెను . అప్పుడా నగరమును  కార్తవీర్యార్జునుడు  అను రాజు పరిపాలించుచున్నాడు .  రావణుడు  అక్కడికి చేరిన నాడు  కార్తవీర్యార్జునుడు  నర్మదా నాదీ  జలములలో  జలకములు ఆడుటకు  వెళ్ళను . అప్పుడు  రావణుడు ఆ విషయము తెలుసుకుని  వింధ్యగిరి వైపుగా వెళ్లెను . రావణుడు  వింధ్యాద్రి వైభవమును  దర్శించుచూ  నర్మదా నదికి చేరెను . పిమ్మట  తన  మంత్రులను  నర్మదా  నదిలో జలకములాడుటకు  అనుమతిని ఇచ్చి  తాను  నది ఒడ్డున ఇసుక తిన్నెలపై  కూర్చుండి శివారాధన చేయసాగెను . రావణుడి మంత్రులు  అనుచరులు  నర్మదా నదిలో  జలకములు ఆడి  పిమ్మట  వారు రావణుడి పూజ కొరకై  పూలని తెచ్చిరి .రావణుడు  ఆ పూలతో  తన  తో  పాటు తెచ్చుకున్న  బంగారు లింగానికి  పూజచేయసాగెను . 

రామాయణము - ఉత్తరకాండ  ముప్పదిఒకటవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 















  

No comments:

Post a Comment