రామాయణము
ఉత్తరకాండ -ముప్పదిఒకటవసర్గ
అప్పుడు శ్రీ రాముడు అగస్త్యమునితో " విప్రోత్తమా! క్రూరుడైన ఆ రావణాసురుడు విజయగర్వంతో భూమండలమున తిరుగుచున్నప్పుడు భల పరాక్రమములు గల క్షత్రియులు ఒక్కరుకూడా ఇక్కడ లేకుండెనా ?
లేక పోతే ఆ కాలములో రాజులందరూ శాస్త్రజ్ఞానం లేనివార ? " అని ప్రశ్నించెను . అప్పుడు అగస్త్యమహా ముని నవ్వుతూ "రామా! రావణుడు రాజులందరిని పరాజితులు చేస్తూ మాహిష్మతీ పురమునకు చేరెను . అప్పుడా నగరమును కార్తవీర్యార్జునుడు అను రాజు పరిపాలించుచున్నాడు . రావణుడు అక్కడికి చేరిన నాడు కార్తవీర్యార్జునుడు నర్మదా నాదీ జలములలో జలకములు ఆడుటకు వెళ్ళను . అప్పుడు రావణుడు ఆ విషయము తెలుసుకుని వింధ్యగిరి వైపుగా వెళ్లెను . రావణుడు వింధ్యాద్రి వైభవమును దర్శించుచూ నర్మదా నదికి చేరెను . పిమ్మట తన మంత్రులను నర్మదా నదిలో జలకములాడుటకు అనుమతిని ఇచ్చి తాను నది ఒడ్డున ఇసుక తిన్నెలపై కూర్చుండి శివారాధన చేయసాగెను . రావణుడి మంత్రులు అనుచరులు నర్మదా నదిలో జలకములు ఆడి పిమ్మట వారు రావణుడి పూజ కొరకై పూలని తెచ్చిరి .రావణుడు ఆ పూలతో తన తో పాటు తెచ్చుకున్న బంగారు లింగానికి పూజచేయసాగెను .
రామాయణము - ఉత్తరకాండ ముప్పదిఒకటవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment