రామాయణము
ఉత్తరకాండ -ముప్పదితొమ్మిదవసర్గ
శ్రీరాముని వీడ్కొని వెళ్లిన పిమ్మట ,రాజులందరూ రామునికి అనేకమైన అమూల్యమైన కానుకలు పంపిరి . భర్తలక్ష్మణులు ఆ కానుకలను స్వీకరించి అయోధ్యానగరమునకు తిరిగి వచ్చిరి . వారు ఆ బహుమతులన్నిటినీ శ్రీరాముడికి సమర్పించెను . శ్రీరాముడు వాటన్నిటిని సంతృప్తిగా గ్రహించి ,సుగ్రీవునికి ,వానరవీరులకు వాటిని సమర్పించెను . పిమ్మట శ్రీరాముడు అంగదుని తన వొడిలో కూర్చోండపెట్టుకుని ,సుగ్రీవునితో సుగ్రీవా! ఇక ఈ అంగదుకూడా నీ కుమారుడే మారుతి నీకు ఆంతరంగికుడైన మంత్రి నీకువలె వీరిరువురు నాకు కూడా పూజార్హులే " అని పలికి తన మెడలోపల అమూల్యమైన ఆభరణమును తీసి అంగదుడికి హనుమంతునికి తానే స్వయముగా అలంకరించెను . పిమ్మట శ్రీ రాముడు మిగిలిన వానర వీరులతో " కపివీరులారా ! మీరందరూ నాకు పరామమిత్రులు . ఆత్మీయులైన సోదరులు మీరందరు కష్టసమయములో నన్ను ఆదుకొంటిరి మీ వంటి ఆత్మీయులను పొందిన సుగ్రీవుడు ధన్యుడు . అనిపలికి వారందరికీ కూడా బహుమతులు ఇచ్చి గురవించెను . తదుపరి ఆ వానరులు ఆ రాజ్యములోకల మధువులను సేవించుచూ మహారాజుల స్థాయికి అనుగుణమైన ఆహారపదార్ధములను , రుచికరమైన ఫలమూలములను కడుపారా ఆరగించుచూ అచట నివసింపసాగిరి . ఇట్లువారు ఒక సంవత్సరకాలం అక్కడే గడిపిరి ఆ వనరులందరికి అక్కడ గడిపినకాలము అంతా ఒక క్షణముగా తోచెను .
రామాయణము ఉత్తరకాండ ముప్పదితొమ్మిదవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment