Tuesday 26 May 2020

రామాయణము ఉత్తరకాండ -ముప్పదితొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                   ఉత్తరకాండ -ముప్పదితొమ్మిదవసర్గ  

శ్రీరాముని వీడ్కొని వెళ్లిన పిమ్మట ,రాజులందరూ రామునికి అనేకమైన అమూల్యమైన కానుకలు పంపిరి . భర్తలక్ష్మణులు ఆ కానుకలను స్వీకరించి అయోధ్యానగరమునకు తిరిగి వచ్చిరి . వారు ఆ బహుమతులన్నిటినీ శ్రీరాముడికి సమర్పించెను . శ్రీరాముడు వాటన్నిటిని సంతృప్తిగా గ్రహించి ,సుగ్రీవునికి ,వానరవీరులకు వాటిని సమర్పించెను . పిమ్మట శ్రీరాముడు అంగదుని తన వొడిలో కూర్చోండపెట్టుకుని ,సుగ్రీవునితో సుగ్రీవా! ఇక ఈ అంగదుకూడా  నీ కుమారుడే మారుతి నీకు ఆంతరంగికుడైన మంత్రి నీకువలె  వీరిరువురు నాకు కూడా పూజార్హులే " అని పలికి తన  మెడలోపల  అమూల్యమైన ఆభరణమును తీసి అంగదుడికి హనుమంతునికి తానే స్వయముగా  అలంకరించెను . పిమ్మట  శ్రీ రాముడు మిగిలిన వానర వీరులతో " కపివీరులారా ! మీరందరూ నాకు పరామమిత్రులు . ఆత్మీయులైన సోదరులు మీరందరు కష్టసమయములో నన్ను ఆదుకొంటిరి మీ వంటి ఆత్మీయులను పొందిన సుగ్రీవుడు ధన్యుడు . అనిపలికి  వారందరికీ కూడా బహుమతులు ఇచ్చి  గురవించెను . తదుపరి ఆ వానరులు ఆ రాజ్యములోకల మధువులను సేవించుచూ మహారాజుల స్థాయికి  అనుగుణమైన ఆహారపదార్ధములను , రుచికరమైన  ఫలమూలములను కడుపారా ఆరగించుచూ అచట నివసింపసాగిరి . ఇట్లువారు  ఒక సంవత్సరకాలం అక్కడే  గడిపిరి ఆ వనరులందరికి  అక్కడ  గడిపినకాలము  అంతా ఒక క్షణముగా తోచెను . 

రామాయణము ఉత్తరకాండ ముప్పదితొమ్మిదవసర్గ  సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 


















No comments:

Post a Comment