రామాయణము
ఉత్తరకాండ -ముప్పదియేడవసర్గ
ఆ రోజు రాత్రి గడిచిన పిమ్మట ప్రాతః కాలము అగుచుండగా శ్రీరామచంద్రప్రభువును మేలుకొలుపుటకై ,సేవాతత్పరులైన స్తుతిపాఠకులు రాజమందిరమునకు విచ్చేసి ,మధురమైన కంఠములతో ,స్తుతిస్తూ మేలుకొలిపిరి . ఆ ప్రభువు తల్పమునుండి లేవగానే వేలకొలది సేవకులు వినయముతో అంజలిఘటించి నిలబడిరి .
ఆ రఘువరుడు స్నానాదికములు ముగించుకుని ,అగ్నికార్యములను పూర్తిచేసుకుని దేవపూజాగృహమున ప్రవేశించెను . అక్కడ యధావిధిగా దేవతలను ఆరాధించి ,పితృదేవతలకు తర్పణములు విడిచి ,బ్రాహ్మణులను పూజించేను . పిమ్మట శ్రీరాముడు సభలోకి ప్రవేశించి సింహాసనమును అధిష్టించెను . విశిష్టాది మహాఋషులు ,జానపదములపాలకులు ,సామంతరాజులు ఇంకా ఇతర ప్రముఖులతో ఆ సభాభవనములోని ఆసనములు నిండి ఉండెను . ఆసమయములో శ్రీరాముని వైభవము ఇంద్రుని మించి ఉండెను . . పురాణజ్ఞులైన మహాత్ములు సభలో ఆసీనులైనవారికి ,ధర్మసమ్మతములైన మధురగాధలను తెలుపుచుండిరి .
రామాయణము ఉత్తరకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment