రామాయణము
యుద్ధకాండ ---------నూటఏడవసర్గ
యుద్ధమును చూచుటకై దేవతలతో కలసి అక్కడికి వఛ్చిన అగస్త్య మహర్షి శ్రీ రాముని వద్దకు వచ్చి శ్రీ రాముడితో ఓ రామా! మహా బాహూ ! నాయనా! సనాతనము , మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమునుగూర్చి తెలిపెదను వినుము . దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులందరిపై విజయమును సాధింపగలవు . "ఆదిత్య హృదయము ' అను ఈ స్తోత్రము పరమపవిత్రమైనది . సమస్త శత్రువులను నశింపజేయునది . నిత్యమూ దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తధ్యము . ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది . పరమ పావనమైనది . అన్ని వ్యాధులను తొలగించునది . ఆయుస్సును వృద్ధి పరుచునది అన్ని రకాల జపములలో శ్రేష్టమైనది . కనుక దీన్ని జపించుట ఉత్తమము . లోకములకు వెలుగుప్రసాదించునట్టి . సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము . ఈ ఆదిత్య హృదయము మూడు సార్లు జపించినచో నీవు ఈ మహా సంగ్రామములో విజయము పొందగలవు" . అని పలికి అగస్త్యముని తన స్థానమునకు చేరెను . అగస్త్య మహామునిచే ఉపదేశం పొందిన ఆదిత్య హృదయం ను జపించి సూర్య భగవానునికి నమస్కరించి గట్టి పూనిక తో ధనస్సును చేతబూని రావణుడిని వధించుటకు కృతనిశ్చయుడుఅయ్యెను . సూర్యుడు శ్రీ రాముని చూచి 'రామ ! త్వరపడుము' అని పలికెను .
రామాయణము ----------యుద్ధకాండ ------------నూటఏడవసర్గ -------------సమాప్తము --------------------------
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment