రామాయణము
యుద్ధకాండ ----------నూటఇరువదిరెండవసర్గ
శ్రీ రాముడి మాటలను విన్న పిమ్మట పరమేశ్వరుడు శ్రీ రామునితో " కమలాక్షా ! రామా! సమస్త లోకముల యందు పెరిగిన దారుణమైన రావణుడి భయమని చీకట్లను రూపుమాపితివి ఇక దైన్యముతో ఉన్న భరతుడిని ఊరడించుము . యశస్వి ఐన కౌశలాయ మాతను ఓదార్చుము . కైకేయి దేవిని , సుముత్రాదేవిని భక్తితో దాసించుము ఆయుద్యా రాజ్యమునకు పట్టాభిషిక్తుడవై బంధుముత్రులను , సజ్జనులను , ఆనందింపచేయుము . మహా బలశాలి పుత్రపౌత్రాదులతో ఇక్ష్వాకు వంశమునకు వన్నెతెచ్చిపెట్టుము . అశ్వమేధాది యజ్ఞములను ఆచరించి , చక్కని కీర్తిప్రతిష్టలను గడియింపుము . బ్రాహ్మణాది సజ్జనులను దానధర్మముల ద్వారా సంతోషపరుచుము . ఇలా చక్కని పరిపాలన ద్వారా ధర్మసంస్థాపనము ఒనర్చి పిమ్మట పరంధామమునకు చేరుము . రామ అదిగో ఆకాశమున నిలబడిఉన్న మీ తండ్రిగారిని చూడుము ఆయనకి నీవును లక్ష్మణుడును నమస్కరించుము . " అనిపలికెను .
పరమశివుడి మాటలు విన్న శ్రీ రాముడు తలపైకెత్తి విమానంలో ఉన్న తండ్రిని చూసేను పిమ్మట శ్రీ రాముడు లక్ష్మణుడు మిక్కిలి సంతోషముతో కళ్ళవెంట నీళ్లు కారుచుండగా దశరధుని నమస్కరించెను . దశరధుడు ప్రాణాలకంటే మిన్న ఐన కుమారులను దర్శించి ,తన విమానముపై స్వర్గమునకు వెళ్లెను.
రామాయణము యుద్ధకాండ నూటఇరువదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment