రామాయణము
ఉత్తరకాండ - ఇరువదితొమ్మిదవసర్గ
ఆ విధముగా చీకట్లు కమ్ముకొని ఉన్నను దేవతలు రాక్షసులు పరస్పరము యుద్ధము కొనసాగించుచూ , ఒకరినొకరు చంపుకుంటిరి . ఆ మహాయుద్ధమున సుర సైనికుల దాటికి రాక్షస మహాబలము పదోవంతు వారు మాత్రమే మిగిలి ఉంటిరి . మిగిలిన వారు మృత్యు వాత పడిరి . అది చూసిన రావణుడు కోపోద్రిక్తుడై పెద్దగా గర్జించెను . అప్పుడు ఇంద్రుడు ససైన్యముగా వచ్చి రావణుడిని చుట్టుముట్టేను . అప్పుడు ఇంద్రజిత్తు పూర్వముతాను సంకరునినుండి వరంగా పొందిన మాయను ప్రయోగించి అతడు అదృశ్యమయ్యెను . ఆ అదృశ్యరూపములోనే సుర బలములపై విజృంభించెను . పిమ్మట అతడు ఇంద్రుడిపై కూడా తన బాణ పరంపరను ప్రయోగించెను . ఇంద్రుడు మాయా రూపములో ఉన్న మేఘనాధుని కనుగొనలేక పోయెను . అతడు తన మాయచే ఇంద్రుడిని బంధించి తన సైన్యము వద్దకు తీసుకు పోయెను .
ఆ సమయములో రావణుడు తనను ఎదిరించిన ఆదిత్యుని తో , వసువులతో పోరాడసాగెను . అప్పుడు మేఘనాధుడు " తండ్రీ ! రండి మనకు విజయము లభించినది . ఇంద్రుడిని బంధించి తీసుకు వచ్చాను . మనము ఇంటికి వెళ్ళెదము " అని పలికెను . అప్పుడు రావణుడు మేఘనాధుడు మిగిలిన తమ సైన్యముతో, ఇంద్రుడితోసహా లంకకు చేరెను .
రామాయణము ఉత్తరకాండ ఇరువదితొమ్మిదవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు .
No comments:
Post a Comment