Saturday 16 May 2020

రామాయణము ఉత్తరకాండ - ఇరువదితొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                  ఉత్తరకాండ - ఇరువదితొమ్మిదవసర్గ

ఆ విధముగా  చీకట్లు కమ్ముకొని ఉన్నను దేవతలు రాక్షసులు  పరస్పరము యుద్ధము కొనసాగించుచూ , ఒకరినొకరు  చంపుకుంటిరి .  ఆ మహాయుద్ధమున  సుర సైనికుల దాటికి  రాక్షస మహాబలము  పదోవంతు వారు మాత్రమే మిగిలి ఉంటిరి  . మిగిలిన వారు మృత్యు  వాత పడిరి .  అది చూసిన రావణుడు  కోపోద్రిక్తుడై  పెద్దగా గర్జించెను .  అప్పుడు ఇంద్రుడు  ససైన్యముగా  వచ్చి  రావణుడిని చుట్టుముట్టేను .  అప్పుడు  ఇంద్రజిత్తు  పూర్వముతాను  సంకరునినుండి  వరంగా పొందిన  మాయను ప్రయోగించి  అతడు అదృశ్యమయ్యెను .  ఆ అదృశ్యరూపములోనే  సుర బలములపై  విజృంభించెను .  పిమ్మట అతడు  ఇంద్రుడిపై కూడా  తన  బాణ పరంపరను  ప్రయోగించెను . ఇంద్రుడు మాయా రూపములో ఉన్న  మేఘనాధుని  కనుగొనలేక పోయెను . అతడు   తన మాయచే  ఇంద్రుడిని  బంధించి  తన సైన్యము వద్దకు తీసుకు పోయెను . 
ఆ సమయములో రావణుడు  తనను  ఎదిరించిన  ఆదిత్యుని తో , వసువులతో పోరాడసాగెను .  అప్పుడు మేఘనాధుడు " తండ్రీ ! రండి  మనకు  విజయము లభించినది . ఇంద్రుడిని  బంధించి తీసుకు వచ్చాను .  మనము  ఇంటికి  వెళ్ళెదము " అని పలికెను . అప్పుడు రావణుడు  మేఘనాధుడు  మిగిలిన తమ సైన్యముతో, ఇంద్రుడితోసహా లంకకు చేరెను . 

రామాయణము ఉత్తరకాండ  ఇరువదితొమ్మిదవసర్గ  సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు . 













No comments:

Post a Comment