రామాయణము
యుద్ధకాండ---------నూట పన్నెండవ సర్గ
రాముడి చేతిలో హతుడైన రావణాసురుడు భూమి మీద పడిఉండుట చూసిన విభీషణుడు అంతులేని శోకంతో కృంగిపోవుచూ " అన్నా ! మహా వీరుడవి, పరాక్రమ శాలివి , సుప్రసిద్ధుడవి , విద్యావంతుడవి , రాజనీతి కోవిదుడవి , హంస తూలికా తలములపై శయనించుచుండెడివాడివి. అట్టి నీవు అసువులు కోల్పోయి ఇట్లు భూమిపై పడివుంటివి . అయ్యో ఇదివరలో నీతో హితవచనములు పలికివుంటిని కానీ అప్పుడు కామ మోహపరుడవై ఉన్న నీకు ఆ మాటలు రుచింపలేదు , అయ్యో ఆ దుష్కార్యములు ఫలితంగా ఇప్పుడు ప్రాణములు కోల్పోయినావు కదా " అని విలపించ సాగెను .
శోకంతో ఇలా విలపిస్తున్న విభీషణుడి తో శ్రీ రాముడు " విభీషణ ! మీ అన్న అయిన రావణుడు పిరికిపందవలె యుద్ధము నుండి పారిపోలేదు . యుద్ధము నందు తీవ్రముగా పరాక్రమము చూపినాడు . ఇతని రణోత్సాహము మహోత్తరమైనది . వీరునికు విజయమో , వీరస్వర్గమో లభించుట తధ్యము . కావున నీవు శోకమును త్యజించుము . మీ సోదరుడికి చేయవలసిన అనంతరకార్యముల గురించి ఆలోచించుము ." అని పలికేను .
శ్రీ రాముడు ఇలా పలుకగా శోకసంతప్తుడైన విభీషణుడు . తన సోదరునకు చేయవలసిన ఉత్తర కర్మల గురించి శ్రీ రాముడితో ఇలా పలికెను . రామా ! " నిత్యము అగ్నికార్యములను ఆచరించిన వాడు మా సోదరుడు ఇతడు గొప్ప తపస్వి వేదాంత వేత్త యజ్ఞ యాగాదులను ఆచరించువారిలో ప్రముఖుడు . ఇతని పుత్రులందరు యుద్దములో మరణించారు విగత జీవుడైన ఇతడికి నీవు దయతలచినచో , ప్రేతకార్యములను నేనే నిర్వహించాలనుకుంటున్నాను . " అని పలికెను . విభీషణుడు పలికిన దైన్యవచనములు విని ఉదారచరితుడైన మహాత్ముడైన శ్రీ రాముడు రావణునకు స్వర్గాది ఉత్తమ లోకములు ప్రాప్తించుటకై అంత్యక్రియలను ఆచరించుటకు విభీషణునకు , ఆజ్ఞ ఇచ్చి ఇట్లు అనెను . విభీషణా ! వ్యక్తులు జీవించియున్నంతవరకే వైరములు ఉండవలెను . అనంతరము ఆ వైరములను త్యజింప వలెను . ఇప్పుడు మన కార్యము నెరవేరినది . కనుక ఇతనికి అంతిమ సంస్కారములను నెరపుము . యితడు నీకు వలే నాకును గౌరవార్హుడే . "అని పలికెను .
శ్రీ రాముడు ఇలా పలుకగా శోకసంతప్తుడైన విభీషణుడు . తన సోదరునకు చేయవలసిన ఉత్తర కర్మల గురించి శ్రీ రాముడితో ఇలా పలికెను . రామా ! " నిత్యము అగ్నికార్యములను ఆచరించిన వాడు మా సోదరుడు ఇతడు గొప్ప తపస్వి వేదాంత వేత్త యజ్ఞ యాగాదులను ఆచరించువారిలో ప్రముఖుడు . ఇతని పుత్రులందరు యుద్దములో మరణించారు విగత జీవుడైన ఇతడికి నీవు దయతలచినచో , ప్రేతకార్యములను నేనే నిర్వహించాలనుకుంటున్నాను . " అని పలికెను . విభీషణుడు పలికిన దైన్యవచనములు విని ఉదారచరితుడైన మహాత్ముడైన శ్రీ రాముడు రావణునకు స్వర్గాది ఉత్తమ లోకములు ప్రాప్తించుటకై అంత్యక్రియలను ఆచరించుటకు విభీషణునకు , ఆజ్ఞ ఇచ్చి ఇట్లు అనెను . విభీషణా ! వ్యక్తులు జీవించియున్నంతవరకే వైరములు ఉండవలెను . అనంతరము ఆ వైరములను త్యజింప వలెను . ఇప్పుడు మన కార్యము నెరవేరినది . కనుక ఇతనికి అంతిమ సంస్కారములను నెరపుము . యితడు నీకు వలే నాకును గౌరవార్హుడే . "అని పలికెను .
రామాయణము ---------యుద్ధకాండ -------- నూటపన్నెండవసర్గ ----------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు ) , తెలుగు పండితులు .
No comments:
Post a Comment