రామాయణము
యుద్ధకాండ ---------నూటపదిహేనవసర్గ
రామరావణ యుద్ధము చూడడానికి వచ్చిన దేవతలు, రాక్షసులు , గంధర్వులు , రావణుడి వధ చూసిన తర్వాత ఆ యుద్ధ గాధలను ముచ్చటించుకుంటూ తమ తమ విమానాలలో తమ స్థలములకు బయలుదేరిరి . వారు శ్రీ రాముడి పరాక్రమమును, సుగ్రీవుడి వ్యూహ రచనను, వానర వీరుల వీరోచితమైన యుద్ధ కౌశల్యమును , లక్ష్మణుడి భాతృ ప్రేమను , సీతా దేవియొక్క పాతివ్రత్యమును , హనుమంతుడి యుద్ధసామర్థ్యమును , పొగుడుకుంటూ తమతమ ఇళ్లకు పయనమయ్యిరి. మాతలి శ్రీ రాముడి అనుమతితో రధముని తీసుకొని ఇంద్రలోకమునకు వెళ్లెను . శ్రీ రాముడు ఎంతో సంతోషంతో సుగ్రీవుడిని కౌగలించుకొనెను . శ్రీ రాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు బంగారు కలశములను వానర ప్రముఖులకు ఇచ్చి సముద్రజలము తెప్పించెను . ఆ సముద్రజలంతో విభీషణుడిని లంక నగరమునకు రాజుగా పట్టాభిషేకము చేసెను . పిమ్మట అక్కడి వానర యోధులందరు లంక నగర ప్రభువు విభీషణునికి జై అని జయజయద్వానములు చేసిరి . అపుడు శ్రీ రాముడు హనుమంతునితో " హనుమా లంకా నగర ప్రభువు ఐన విభీషణుడి అనుమతి తీసుకొని లంకా నగరంలోని అశోకవనంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న సీతకు మన విజయ వార్తను తెలియ బరుచుము . రావణుని నేను సంహరించిన విషయము చెప్పు . నేను లక్ష్మణుడు విభీషణుడు , సుగ్రీవుడు , అందరం క్షేమంగా ఉన్నామని తెలిపి సీతా దేవి సందేశాన్ని తీసుకొని రా " అని పలికెను .
రామాయణము --------యుద్ధకాండ --------నూటపదిహేనవ సర్గ ---------సమాప్తము
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment