రామాయణము
ఉత్తరకాండ ----------మొదటిసర్గ
శ్రీ రాముడు పట్టాభిషిక్తుడైన పిమ్మట అగస్త్యుడు కణ్వుడు , కౌశికుడు , విస్వామిత్రుడు , అత్రి , మొదలగు మహాసృషులందరు రామలక్ష్మణులను అభినందించుటకై అయోధ్యకు విచేసిరి . వారు అయోధ్యకు వచ్చిన విషయము తెలుసుకున్న శ్రీ రాముడు వారిని సాదరంగా ఎదురెళ్లి ఆహ్వానించి తన భావనమునకు తీసుకొనివచ్చెను . అచటకాల శ్రేష్ఠములైన ఆసనములపై వారిని కూర్చుండబెట్టి . గోదానాది దానములను చేసెను . శ్రీ రాముడి ఆదరాభిమానములకు సంతుష్టులైన మహర్షులు శ్రీ రామునితో " రఘునన్దనా ! , రావణుని హతమార్చి అందరికి ఆనందము కూర్చితివి రాక్షసరాజైన రావణుని సపరివారాజంగా హతమార్చుట నీకు ఒక లెక్కలో గల విషయము కాదు . వాస్తవానికి నీవు ముల్లోకములనుం జయింప గల వీరుడవు రామా! ప్రహస్తుడు వికటుడు , విరూపాక్షుడు , మహోదరుడూ, అకంపనుడూ,దుర్ధర్షుసు , కుంభకర్ణుడు , త్రిశిరుడు , అతికాయుడు , కుంభుడు , నికుంభుడు , ధూమ్రాక్షుడు మొదలగు రాక్షులందాయిని యుద్ధమున హతులైరి . రాక్షస వీరులందరు గోరంగా పోరుజరిపి నీ బాణములకై హతులైరి ఇది మాకు ఎంతో సంతోష దాయకం . ఇంద్రజిత్తు వలన సమ్భసవించిన నాగబంధములన్న్నియూ నీవు లక్ష్మణుడు విముక్తులై మిక్కిలి మాయావి ఐన ఇంద్రజిత్తును వధించిన వార్త వినగానే మాకు కలిగిన ఆనంద ఆశ్చర్యములను , అవధులు లేనివి . ఇందులకు మేంమందారము నిన్ను అభినందించుచున్నాము . నీవు మాఅందరిని శాంతి సౌభారాగ్యములను ప్రసాదించితివి . నీవు కలకాలం వర్దిల్లెదవుకాక " అని పలికెను .
మహాత్ములైన ఆ ఋషీశ్వరుల యొక్క అభినందన వచనములు విన్న శ్రీ రాముడు మిక్కిలి ఆష్క్యార్యపడి వారితో " పూజ్యులైన మహాత్ములారా నిశాచరులైన రావణ కుంభకర్ణులు ఇరువురు మహా వీరులే వారివద్ద వున్న రాక్షసులందరు కూడా మహావీరులే కదా వారందని కాదని మీరు ఇంద్రజిత్తును మాత్రమే పొగుడుటకు కారణమేమి ? . అతని శక్తిసామర్ధ్యాలు ఎలాంటివి? . బలపరాక్రమాలు ఇటువంటివి? . అతడు ఇంద్రుయిని ఏవిధముగా జయించాడు ? అతడు ఏ ఏ వారములు పొందినాడు ? ఈ విషయములన్నీ రహస్యములు కానిచో నేను వినదగినవి అయినచో వాటిని నేను వినేకొరుచున్నాను . దయ తో తెలుపుము . ఇది నా ప్రార్ధన . " అని పలికెను .
రామాయణము ----------ఉత్తరకాండ ---------మొదటిసర్గ -----------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు) తెలుగు పండితులు .
No comments:
Post a Comment