Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ -------------పదునెనిమిదవ సర్గ

                                        రామాయణము 

                                  ఉత్తరకాండ -------------పదునెనిమిదవ సర్గ 

రావణుడు పుష్పకముపై   భూమండలమంతా  తిరుగుతూ మరుత్తుడు  అనే మహారాజు యజ్ఞము చేయుచుండగా  చూసేను . బృహస్పతికి సోదరుడైన  సంవత్తుడు  అను బ్రహ్మర్షి  సమస్త  దేవతలతో  కలిసి ఆ యజ్ఞము  చేయుచుండెను .  రావణుడి  రాకను గమనించి  దేవతలు భయపడి  పశుపక్షాదులుగా  మారిరి  ఇంద్రుడు  నెమలిగాను , యమధర్మరాజు  కాకిగాను  , కుబేరుడు  తొండగాను , వరుణుడు  హంసగాను  మారీరి  అప్పుడు రావణుడు  యజ్ఞ  శాలలో  ప్రవేశించి  మరుత్తు  రాజుతో  "  నాతో  యుద్ధముచేయుము  లేదా  పరాజితుడవైనట్లు  ఒప్పుకొనుము . " అని  పలికెను . అప్పుడా  మరుత్త  రాజు  రాక్షసరాజా ! అన్నతో యుద్ధముచేసి  ఆయనను  జయించిన  నీవు  ఎహ్తో దన్యుడివి కదా . కానీ  నీవు చేసిన  ఆ పని  లోక ధర్మములకు విరుద్ధము పైగా  నింద్యము . నేడే నా బాణములతో నిన్ను మృత్యుముఖమునకు  చేర్చెదను " అని పలికెను . 
అప్పుడు సంవర్తన  మహర్షి  ఆ  మహారాజుకు  అడ్డంవచ్చి " రాజా ! నీకు నా మాటలపై  గౌరవము ఉన్నచో  వినుము  నీవు ఇప్పుడు  యుద్ధమునకు దిగుట  యుక్తముకాదు  ఇది  పరమేశ్వరుడకు  సంబంధించిన  యాగము . దీనిని  పూర్తిచేయనిచో  నీ  వంశమే నాశన మగును . యజ్ఞ  దీక్షలో  ఉన్నవాడు  యుద్ధమునకు  పూనుకొనుట తగదు యజ్ఞ దీక్షలో ఉన్న వానికి కోపమే రారాదు . ఈ రాక్షసుడు  అజేయుడు . " అని  పలికెను . వెంటనే  మరుత్త రాజు  ధనుదానములను  పక్కనపెట్టి  ప్రశాంతముగా  యజ్ఞము  చేయుటకు  పూనుకొనెను . అప్పుడు  సుఖరాక్షసుడు  రావణుడే జయించాడు  అని బిగ్గరగా  సింహనాదం  చేసెను . పిదప  రావణుడు , అతని  అనుచరులు  యజ్ఞమునకు  విచ్చేసి  వేదిక పై  ఉన్న మహర్షులను భక్షించి వారి రక్తములను  తనివితీరా  త్రాగెను . 
రావణుడు  వెళ్లి పోయిన పిమ్మట  ఇంద్రుడు  మయూరమునకు వారము ప్రసాదించెను . అంతకు ముందు నెమళ్ళ పింఛములన్నియూ  కేవలము నీలముగా  మాత్రమే  ఉండేవి ఇంద్రుడి వార ప్రభావమున  ఆ పింఛములన్ని  కన్నులతో విరాజిల్లినవి . పిమ్మట  యమధర్మరాజు  కాకితో  " వాయసమా ! న అనుగ్రహ  ప్రభావమున  మీ జాతికి  ఏరోగములు అంటవు. మీకు మృత్యు భయము కూడా ఉండదు . నరులు  నిన్ను వధింపనంతవరుకూ  నీవు  జీవించే ఉండెదవు . నాలోకమునకు చేరిన అమానవులన్దరు  ఆకలి దప్పులతో  అలమటించెదరు . భూమిపైనున్న  వారి బంధువులు  నీకు ఆహారమిచ్చి  తృప్తిపరిచినచో  పితృదేవతలయొక్క  ఆకలి  దప్పులు   తీరును . " అని  వరమిచ్చెను . 
తదుపరి  వరుణుడు  హంసతో  " నీవు ఎల్లపుడూ  మనోజ్ఞమైన  కాంతులతో  విలసిల్లుతావు . నా  సంతోష చిహ్నముగా  నీవు  అపారమైన  సంతృప్తిని  కలిగివుంటావు " అని వరమిచ్చెను . పిమ్మట  కుబేరుడు తొడతో  " నీ  శిరస్సుపై  బంగారు ఱంగు  స్థిరముగా ఉందును . నీ  నీల  వర్ణము పోయి  సువర్ణాచాయను  పొందుతావు . " అని వరమిచ్చెను . ఈ  విధముగా  ఇంద్రాది దేవతలు అందరు ఆ  యజ్ఞోత్సవ  సమయములో  పశుపక్షాదులకు  వారములు ఇచ్చి తమతమ  భవనములకు  చేరిరి . 

రామాయణము ------------ఉత్తరకాండ ----------పదునెనిడవసర్గ -------------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు)తెలుగు పండితులు . 










 

No comments:

Post a Comment