రామాయణము
ఉత్తరకాండ -------------పదునెనిమిదవ సర్గ
రావణుడు పుష్పకముపై భూమండలమంతా తిరుగుతూ మరుత్తుడు అనే మహారాజు యజ్ఞము చేయుచుండగా చూసేను . బృహస్పతికి సోదరుడైన సంవత్తుడు అను బ్రహ్మర్షి సమస్త దేవతలతో కలిసి ఆ యజ్ఞము చేయుచుండెను . రావణుడి రాకను గమనించి దేవతలు భయపడి పశుపక్షాదులుగా మారిరి ఇంద్రుడు నెమలిగాను , యమధర్మరాజు కాకిగాను , కుబేరుడు తొండగాను , వరుణుడు హంసగాను మారీరి అప్పుడు రావణుడు యజ్ఞ శాలలో ప్రవేశించి మరుత్తు రాజుతో " నాతో యుద్ధముచేయుము లేదా పరాజితుడవైనట్లు ఒప్పుకొనుము . " అని పలికెను . అప్పుడా మరుత్త రాజు రాక్షసరాజా ! అన్నతో యుద్ధముచేసి ఆయనను జయించిన నీవు ఎహ్తో దన్యుడివి కదా . కానీ నీవు చేసిన ఆ పని లోక ధర్మములకు విరుద్ధము పైగా నింద్యము . నేడే నా బాణములతో నిన్ను మృత్యుముఖమునకు చేర్చెదను " అని పలికెను .
అప్పుడు సంవర్తన మహర్షి ఆ మహారాజుకు అడ్డంవచ్చి " రాజా ! నీకు నా మాటలపై గౌరవము ఉన్నచో వినుము నీవు ఇప్పుడు యుద్ధమునకు దిగుట యుక్తముకాదు ఇది పరమేశ్వరుడకు సంబంధించిన యాగము . దీనిని పూర్తిచేయనిచో నీ వంశమే నాశన మగును . యజ్ఞ దీక్షలో ఉన్నవాడు యుద్ధమునకు పూనుకొనుట తగదు యజ్ఞ దీక్షలో ఉన్న వానికి కోపమే రారాదు . ఈ రాక్షసుడు అజేయుడు . " అని పలికెను . వెంటనే మరుత్త రాజు ధనుదానములను పక్కనపెట్టి ప్రశాంతముగా యజ్ఞము చేయుటకు పూనుకొనెను . అప్పుడు సుఖరాక్షసుడు రావణుడే జయించాడు అని బిగ్గరగా సింహనాదం చేసెను . పిదప రావణుడు , అతని అనుచరులు యజ్ఞమునకు విచ్చేసి వేదిక పై ఉన్న మహర్షులను భక్షించి వారి రక్తములను తనివితీరా త్రాగెను .
రావణుడు వెళ్లి పోయిన పిమ్మట ఇంద్రుడు మయూరమునకు వారము ప్రసాదించెను . అంతకు ముందు నెమళ్ళ పింఛములన్నియూ కేవలము నీలముగా మాత్రమే ఉండేవి ఇంద్రుడి వార ప్రభావమున ఆ పింఛములన్ని కన్నులతో విరాజిల్లినవి . పిమ్మట యమధర్మరాజు కాకితో " వాయసమా ! న అనుగ్రహ ప్రభావమున మీ జాతికి ఏరోగములు అంటవు. మీకు మృత్యు భయము కూడా ఉండదు . నరులు నిన్ను వధింపనంతవరుకూ నీవు జీవించే ఉండెదవు . నాలోకమునకు చేరిన అమానవులన్దరు ఆకలి దప్పులతో అలమటించెదరు . భూమిపైనున్న వారి బంధువులు నీకు ఆహారమిచ్చి తృప్తిపరిచినచో పితృదేవతలయొక్క ఆకలి దప్పులు తీరును . " అని వరమిచ్చెను .
తదుపరి వరుణుడు హంసతో " నీవు ఎల్లపుడూ మనోజ్ఞమైన కాంతులతో విలసిల్లుతావు . నా సంతోష చిహ్నముగా నీవు అపారమైన సంతృప్తిని కలిగివుంటావు " అని వరమిచ్చెను . పిమ్మట కుబేరుడు తొడతో " నీ శిరస్సుపై బంగారు ఱంగు స్థిరముగా ఉందును . నీ నీల వర్ణము పోయి సువర్ణాచాయను పొందుతావు . " అని వరమిచ్చెను . ఈ విధముగా ఇంద్రాది దేవతలు అందరు ఆ యజ్ఞోత్సవ సమయములో పశుపక్షాదులకు వారములు ఇచ్చి తమతమ భవనములకు చేరిరి .
రామాయణము ------------ఉత్తరకాండ ----------పదునెనిడవసర్గ -------------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు)తెలుగు పండితులు .
No comments:
Post a Comment