రామాయణము
ఉత్తరకాండ----------పదిహేడవసర్గ
రామా! రావణుడు భూమండలమున తిరుగుతూ హిమవత్పర్వత ప్రదేశమునకు వెళ్లి అక్కడ సంచరింపసాగెను . అతడు అక్కడ కృష్ణాజినము , జటలను ధరించి తపస్సు చేయుచున్న ఒక సుందర స్త్రీ ని చూసేను . ఆమె ఒక దేవతవలె విరాజిల్లుచుండెను . అప్పుడు రావణుడు ఎంతో సుందరమైన కన్య దొరికినది కదా అని సంతోష పడుతూ ఆమెతో " శుభాoగి ! ఇది ఏమి ? అద్భుతమైన నీ యవ్వనముకు విరుద్ధముగా ఇట్టి కఠినతరమైన తపస్సుకు పూనుకుంటివి ? నీవు ఇట్లు తపస్సును నిమగ్నమగుట ఉచితము కాదు . నీవు ఎవరి కుమార్తెవు ? ఈ కఠోర తపస్సును ఆచరించుటకు గల కారణము ఏమి ? " అని ప్రశ్నించెను .
రావణుడి మాటలు విన్న ఆ సుందరాంగి " మహాత్మా ! మా తండ్రి కుశధ్వజుడు . ఆయన బృహస్పతి కుమారుడు . నా పేరు వేదవతి . క్రమముగా దేవతలు, గంధర్వులు, యక్షులు , రాక్షసులు , నాగులు , మొదలైనవారు మా తడ్రివద్దకు వచ్చి నన్ను వివాహమాడదల్చినట్లు ప్రకటించిరి . కానీ మా తండ్రి నన్ను విష్ణువుకిచ్చి వివాహము చేయవలెనని ఉద్దేశముతో ఆరందరిని తిరస్కరించిరి . ఈ వార్తలన్నీ విన్న దంభుడు అనే దైత్యుడు రాత్రివేళ రహస్యముగా మా ఇంటికి వచ్చి నిద్రించుచున్న మా తండ్రిని హతమార్చెను . మా తండ్రికి అగ్నిసంస్కారములు చేయునపుడు మా తల్లిగారు సహగమనము చేసెను . ఆ విధముగా ఒంటరినిఅయ్యిననెను మా తండ్రి ఆశ నెరవేచుటకై ఇచటకు వచ్చి విష్ణువుగూచి తపస్సు చేయుచున్నాను .
పులస్త్యా వంశజా ! నా తపఃప్రభావమున నీవెవరో నీ మనస్సులోని ఆంతర్యమేమిటో గ్రహించాను . ఇక నీవు వెళ్ళవచ్చు " అని పలికింది .
అప్పుడు రావణుడు ఓ సుందరాంగి నీవు గర్వితురాలుగా కనపడుచున్నావు . కనుకనే ఈ విధముగా మాట్లాడుచున్నావు . నేను లంకాధిపతిని నన్ను దశగ్రీవుడు అందిరి . నన్ను వివాహము చేసుకొని సమస్త భోగములను హాయిగా అనుభవింపుము . ఎవరా విష్ణువు ? భళా పరాక్రమములో తపశ్శక్తిలో వైభవములో అతడు నాకు సమానుడు కాడు ." అని ఆమెను ఒప్పించ ప్రయత్నించెను . అప్పుడు ఆమె " రాక్షసేన్ద్రా! నీవు ఈ విధముగా పలుకుట ఏమాత్రము తగదు . శ్రీ మహావిష్ణువు త్రిలోకాధిపతి . సకల లోకముల వారు ఆయనకు ప్రణమిల్లెదరు . " అని పలికెను . అప్పుడు రావణుడు మిక్కిలి కోపంతో వేదవతి జుట్టు పట్టుకొనెను . అందులకు కోపించిన ఆమె తన చేతినే ఖడ్గముగా చేసుకొని తన జుట్టును నరికివేసుకొనెను . పిమ్మట ఆమె ప్రాణత్యాగమునకు సన్నద్ధురాలై తన తపశ్శక్తిచే అగ్నిని ప్రజ్వలింపచేసి దహించి వేయునట్లుగా చూచుచూ " నీచుడా నన్ను నీవు తీవ్రముగా అవమానపరిచినందుకు ఇక నేను జీవించి ఉండను నీవు చూచు చుండగానే అగ్నికి ఆహుతి అయ్యెదను . నన్ను అవమానించిన కారణముగా నిన్ను హతమార్చుతద్వారా పగతీర్చుకొనుటకై మరల జన్మించెదను . పాపాత్ముడైన పురుషుడని ఒక స్త్రీ తన శరీర శక్తిచే చంపజాలదు . నా తపః ప్రభావముచే నిన్ను భస్మము చేయగలను కానీ అందులకు నా తపశ్శక్తిని వ్యర్థము చేయను . నా తపఃప్రభావమున అయోనిజ నయి సాద్విలక్షణములు కలిగి ఒక దారమాత్ముడికి కుమార్తెను అయ్యేదను " అని పలికి ఆమె అగ్నికి ఆహుతి అయ్యెను . ఆ సమయములో ఆకాశమునుండి పూలవాన కురిసేను .
ఆ వెధవతియే మరల బాలికగా ఒక పద్మమునందు ఆవిర్భవించెను . పిమ్మట ఆ బాలిక మునపటివలె రావణుడి చేతికి చిక్కెను . రావణుడు ఆమెను తీసుకొని లంకా నగరమునకు వెళ్లి జ్యోతిష్యము బాగుగా తెలిసిన తన మంత్రికి చూపించెను . సాముద్రికా లక్షణములను బాగుగా గమనించిన ఆ మంత్రి రావణుడితో రాక్షస రాజా ! అందచందాల ఈ బాలిక నీ ఇంట ఉన్నచో నీకు చావు తప్పదు " అని పలికెను . అప్పుడు రావణుడు ఆ బాలికను సముద్రములో పారవేసెను . అప్పుడు ఆమె భూమికిచేరి భూమిలో ఉండిపోయెను . జనక మహారాజు యజ్ఞమునకై భూమిని దున్నుచుండగా పవిత్రురాలైన ఆ బాలిక నాగలి చాలున దొరికెను . అప్పుడా మిథిలా నగర ప్రభువు ఆమెను తన కుమార్తెగా పెంచనారంభించెను . ఆమెయే నీ భార్య సీతా . అవతార పురుషుడవైన నీవు ఆ శ్రీ మహావిష్ణువువు ఆ విధముగా రావణుడు వేదవతి యొక్క ఆగ్రహముకు గురియై తన నాశనమును తానే కొనితెచ్చుకున్నాడు .
రామాయణము ---------ఉత్తరకాండ ----------పదిహేడవసర్గ ----------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment