Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ----------పదిహేడవసర్గ

                                         రామాయణము 

                                                                                                                                                                                                                                                                                                                                 ఉత్తరకాండ----------పదిహేడవసర్గ 

రామా! రావణుడు  భూమండలమున తిరుగుతూ  హిమవత్పర్వత ప్రదేశమునకు వెళ్లి  అక్కడ  సంచరింపసాగెను . అతడు  అక్కడ  కృష్ణాజినము , జటలను  ధరించి  తపస్సు చేయుచున్న ఒక  సుందర   స్త్రీ ని  చూసేను . ఆమె ఒక  దేవతవలె  విరాజిల్లుచుండెను . అప్పుడు రావణుడు  ఎంతో  సుందరమైన  కన్య  దొరికినది కదా  అని  సంతోష పడుతూ  ఆమెతో  "  శుభాoగి ! ఇది ఏమి ? అద్భుతమైన  నీ యవ్వనముకు  విరుద్ధముగా  ఇట్టి  కఠినతరమైన  తపస్సుకు  పూనుకుంటివి ? నీవు ఇట్లు  తపస్సును  నిమగ్నమగుట  ఉచితము కాదు . నీవు ఎవరి  కుమార్తెవు ? ఈ కఠోర తపస్సును  ఆచరించుటకు  గల కారణము ఏమి ? " అని ప్రశ్నించెను . 
రావణుడి  మాటలు విన్న  ఆ సుందరాంగి  " మహాత్మా ! మా తండ్రి  కుశధ్వజుడు . ఆయన  బృహస్పతి  కుమారుడు . నా పేరు  వేదవతి . క్రమముగా  దేవతలు, గంధర్వులు, యక్షులు , రాక్షసులు , నాగులు , మొదలైనవారు  మా తడ్రివద్దకు వచ్చి నన్ను  వివాహమాడదల్చినట్లు  ప్రకటించిరి . కానీ మా తండ్రి  నన్ను  విష్ణువుకిచ్చి  వివాహము చేయవలెనని  ఉద్దేశముతో  ఆరందరిని   తిరస్కరించిరి .  ఈ వార్తలన్నీ  విన్న దంభుడు అనే దైత్యుడు రాత్రివేళ  రహస్యముగా  మా ఇంటికి  వచ్చి  నిద్రించుచున్న  మా తండ్రిని  హతమార్చెను .  మా తండ్రికి  అగ్నిసంస్కారములు  చేయునపుడు  మా తల్లిగారు  సహగమనము  చేసెను . ఆ విధముగా  ఒంటరినిఅయ్యిననెను  మా తండ్రి  ఆశ  నెరవేచుటకై  ఇచటకు వచ్చి  విష్ణువుగూచి  తపస్సు చేయుచున్నాను . 
పులస్త్యా  వంశజా ! నా తపఃప్రభావమున  నీవెవరో  నీ మనస్సులోని  ఆంతర్యమేమిటో  గ్రహించాను  . ఇక  నీవు వెళ్ళవచ్చు  " అని పలికింది . 
అప్పుడు రావణుడు  ఓ సుందరాంగి  నీవు  గర్వితురాలుగా  కనపడుచున్నావు . కనుకనే  ఈ విధముగా  మాట్లాడుచున్నావు . నేను లంకాధిపతిని  నన్ను  దశగ్రీవుడు  అందిరి . నన్ను వివాహము చేసుకొని  సమస్త భోగములను  హాయిగా అనుభవింపుము . ఎవరా  విష్ణువు ? భళా పరాక్రమములో  తపశ్శక్తిలో  వైభవములో  అతడు  నాకు  సమానుడు  కాడు ." అని ఆమెను ఒప్పించ ప్రయత్నించెను . అప్పుడు ఆమె  " రాక్షసేన్ద్రా! నీవు ఈ  విధముగా  పలుకుట  ఏమాత్రము  తగదు . శ్రీ  మహావిష్ణువు  త్రిలోకాధిపతి . సకల  లోకముల  వారు  ఆయనకు  ప్రణమిల్లెదరు . " అని పలికెను . అప్పుడు రావణుడు  మిక్కిలి  కోపంతో వేదవతి  జుట్టు  పట్టుకొనెను . అందులకు కోపించిన  ఆమె  తన  చేతినే  ఖడ్గముగా  చేసుకొని  తన  జుట్టును  నరికివేసుకొనెను . పిమ్మట ఆమె  ప్రాణత్యాగమునకు  సన్నద్ధురాలై  తన  తపశ్శక్తిచే  అగ్నిని ప్రజ్వలింపచేసి దహించి వేయునట్లుగా  చూచుచూ " నీచుడా  నన్ను నీవు  తీవ్రముగా  అవమానపరిచినందుకు ఇక నేను  జీవించి  ఉండను  నీవు చూచు  చుండగానే  అగ్నికి ఆహుతి  అయ్యెదను . నన్ను అవమానించిన  కారణముగా  నిన్ను  హతమార్చుతద్వారా  పగతీర్చుకొనుటకై  మరల జన్మించెదను .  పాపాత్ముడైన పురుషుడని  ఒక స్త్రీ  తన శరీర  శక్తిచే  చంపజాలదు . నా తపః ప్రభావముచే   నిన్ను భస్మము  చేయగలను  కానీ  అందులకు నా తపశ్శక్తిని  వ్యర్థము  చేయను . నా  తపఃప్రభావమున  అయోనిజ నయి  సాద్విలక్షణములు కలిగి  ఒక దారమాత్ముడికి  కుమార్తెను అయ్యేదను " అని  పలికి  ఆమె  అగ్నికి  ఆహుతి అయ్యెను .  ఆ సమయములో  ఆకాశమునుండి  పూలవాన  కురిసేను . 
ఆ  వెధవతియే  మరల  బాలికగా  ఒక  పద్మమునందు  ఆవిర్భవించెను .  పిమ్మట  ఆ బాలిక  మునపటివలె  రావణుడి చేతికి  చిక్కెను . రావణుడు  ఆమెను తీసుకొని  లంకా నగరమునకు వెళ్లి  జ్యోతిష్యము బాగుగా  తెలిసిన  తన మంత్రికి  చూపించెను .  సాముద్రికా  లక్షణములను  బాగుగా  గమనించిన  ఆ  మంత్రి  రావణుడితో  రాక్షస రాజా ! అందచందాల  ఈ  బాలిక  నీ ఇంట ఉన్నచో  నీకు చావు తప్పదు  "  అని పలికెను  . అప్పుడు  రావణుడు  ఆ  బాలికను  సముద్రములో పారవేసెను . అప్పుడు ఆమె భూమికిచేరి  భూమిలో ఉండిపోయెను . జనక  మహారాజు  యజ్ఞమునకై  భూమిని  దున్నుచుండగా  పవిత్రురాలైన  ఆ బాలిక  నాగలి చాలున దొరికెను . అప్పుడా  మిథిలా  నగర ప్రభువు  ఆమెను  తన కుమార్తెగా  పెంచనారంభించెను . ఆమెయే  నీ భార్య  సీతా . అవతార పురుషుడవైన  నీవు ఆ శ్రీ  మహావిష్ణువువు  ఆ విధముగా  రావణుడు  వేదవతి  యొక్క  ఆగ్రహముకు  గురియై  తన  నాశనమును  తానే కొనితెచ్చుకున్నాడు . 

రామాయణము ---------ఉత్తరకాండ ----------పదిహేడవసర్గ ----------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 

















No comments:

Post a Comment