రామాయణము
ఉత్తరకండ -ఇరువదియెనిమిదవసర్గ
దేవతల దెబ్బలకు తట్టుకొనలేక పారిపోతున్న రాక్షస బలములను చూసి మేఘనాధుడు రాక్షస సైన్యమును తిరిగి యుద్ధరంగమునకు మరల్చి దేవతల మీదికి విజృంభించెను . మేఘనాధుడి దాటికి తట్టుకొనలేక దేవతలందరు నలుదిశల కు పారిపోయిరి . అది చూసిన జయంతుడు (ఇంద్రుడి కొడుకు) యుద్ధరంగములో ప్రవేశించి మేఘనాధునితో తలపడెను . జయంతుడు , ఇంద్రజిత్తు చేయుచున్న యుద్ధము మిక్కిలి తీవ్రముగా కొనసాగుచుండెను . మేఘనాధుడు తీవ్రమైన తన మాయను ప్రయోగించగా లోకములన్నియూ చీకటి ఆయెను . అంతటా చీకట్లు క్రమ్ముకున్నకారణముగా రాక్షసులు సురులు ఒకరికొకరు గుర్తుపట్టలేక తారుమారై కలిసి పోయి చెలాచెదురైరి . తమ పక్షమువారు ఎవరో పర పక్షమువారు ఎవరో తెలియక రాక్షసులతో రాక్షసులు దేవతలతో దేవతలు కొట్టుకొనుచుండిరి ఈ అయోమయ స్థితిలో కొందరు దిక్కు తోచక పారిపోయిరి .
అటువంటి సమయములో పులోముడు అనే దైత్య రాజు జయంతుడిని బంధించి తీసుకొని సముద్రగర్భమునకు చేరెను . జాయ్న్తుడు కనపడక పోవుటచే సకల సురయోధుల్లో ఉత్సాహము సన్నగిల్లెను . అప్పడు ఇంద్రుడు యుద్ధ రంగమునకు వచ్చి యుద్ధము చేయ సాగెను . అప్పుడు ఇరు పక్షముల మధ్య మిక్కిలి గోరంగా యుద్ధము జరింగింది . కుంభకర్ణుడు వివిధ మారణాయుధములను చేతబూని దొరికి వాళ్ళను దొరికి నాట్లు చితక బాదు చుండెను . ఇంద్రుడి అండ చూసుకొన్న దేవతలు తమ పరాక్రమము చూపిరి . దేవతల దాటికి తమ బలములు నశించి పోవుచుండగా రావణుడు మిక్కిలి క్రుద్ధుడై దేవతల సైన్యములోకి ప్రవేశించి ఇంద్రుడి ఎదుట నిలిచెను .
రావణ ఇంద్రుల యొక్క బాణా పరంపరకు ఆకాశమంత నిండిపోయి రణభూమి అంత అంధకారమయ్యెను .
రామాయణము ఉత్తరకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు .
No comments:
Post a Comment