Saturday 16 May 2020

రామాయణము ఉత్తరకండ -ఇరువదియెనిమిదవసర్గ

                                        రామాయణము 

                                       ఉత్తరకండ -ఇరువదియెనిమిదవసర్గ 

దేవతల  దెబ్బలకు తట్టుకొనలేక  పారిపోతున్న రాక్షస బలములను చూసి  మేఘనాధుడు  రాక్షస సైన్యమును తిరిగి  యుద్ధరంగమునకు మరల్చి  దేవతల మీదికి  విజృంభించెను . మేఘనాధుడి  దాటికి తట్టుకొనలేక   దేవతలందరు  నలుదిశల కు  పారిపోయిరి . అది చూసిన జయంతుడు  (ఇంద్రుడి కొడుకు) యుద్ధరంగములో  ప్రవేశించి  మేఘనాధునితో  తలపడెను . జయంతుడు , ఇంద్రజిత్తు  చేయుచున్న  యుద్ధము  మిక్కిలి  తీవ్రముగా  కొనసాగుచుండెను .  మేఘనాధుడు  తీవ్రమైన  తన  మాయను ప్రయోగించగా లోకములన్నియూ  చీకటి ఆయెను . అంతటా  చీకట్లు క్రమ్ముకున్నకారణముగా  రాక్షసులు సురులు  ఒకరికొకరు గుర్తుపట్టలేక  తారుమారై  కలిసి పోయి  చెలాచెదురైరి  . తమ పక్షమువారు ఎవరో  పర పక్షమువారు  ఎవరో తెలియక  రాక్షసులతో రాక్షసులు  దేవతలతో దేవతలు కొట్టుకొనుచుండిరి ఈ అయోమయ స్థితిలో కొందరు దిక్కు తోచక పారిపోయిరి . 
అటువంటి  సమయములో  పులోముడు అనే దైత్య రాజు  జయంతుడిని బంధించి  తీసుకొని  సముద్రగర్భమునకు చేరెను .  జాయ్న్తుడు కనపడక పోవుటచే  సకల సురయోధుల్లో  ఉత్సాహము  సన్నగిల్లెను . అప్పడు ఇంద్రుడు యుద్ధ రంగమునకు వచ్చి  యుద్ధము చేయ సాగెను . అప్పుడు  ఇరు పక్షముల మధ్య మిక్కిలి గోరంగా యుద్ధము జరింగింది . కుంభకర్ణుడు  వివిధ  మారణాయుధములను చేతబూని దొరికి వాళ్ళను  దొరికి నాట్లు చితక బాదు  చుండెను .  ఇంద్రుడి అండ చూసుకొన్న దేవతలు  తమ పరాక్రమము చూపిరి . దేవతల దాటికి  తమ  బలములు  నశించి పోవుచుండగా  రావణుడు  మిక్కిలి  క్రుద్ధుడై  దేవతల సైన్యములోకి  ప్రవేశించి ఇంద్రుడి ఎదుట నిలిచెను . 
రావణ  ఇంద్రుల యొక్క బాణా పరంపరకు ఆకాశమంత  నిండిపోయి రణభూమి  అంత  అంధకారమయ్యెను . 

రామాయణము ఉత్తరకాండ ఇరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు . 














No comments:

Post a Comment