రామాయణము
యుద్ధకాండ -------------------నూటఇరువదియవసర్గ
వానర రాక్షసుల హాహా కార ధ్వనులు విని శ్రీ రాముడు ఎంతో దుఃఖితుడై కన్నీరు కారుస్తూ క్షణ కాలము పాటు ఆలోచన లో మునిగెను . అప్పుడు యక్షరాజైన కుభేరుడు , యముడు , ఇంద్రుడు, వరుణుడు , శివుడు , బ్రహ్మ,తమ తమ విమానంలా పై అక్కడకు వచ్చి శ్రీయ రాముడి సమీపమున నిలబడిరి . వాగారిని చూసి శ్రీ రాముడు చేతులు జోడించి నమస్కరించెను . అపుడు బ్రహ్మ దేవుడు" రామ! నీవు సర్వశ్రేష్ఠుడవు , జ్ఞ్యానులలో అగ్రీశ్వరుడవు ,సీతా దేవి అగ్ని ప్రవేశము చేస్తుంటే ఎందుకు మాట్లాడ కుండా ఊరుకొన్నావు . నీయవు సర్వజ్ఞుడవు , సర్వ శక్తివంతుడవు , సర్వేశ్వరుడవు , స్వయంభువుడవు , శ్రేష్ఠుడైన శ్రీ మన్నారాయణుడవు అటు వంటి నీవు విదేహ రాజకుమారిని ఎందుకు ఉపేక్షించితివి . " అని పలికెను . అప్పుడు శ్రీ రాముడు వారితో " మహాత్ములారా ! నేను దశరత్సమహారాజు కొడుకుగా సామాన్య మానవుడిగానే అనుకొంటున్నాను . నేను ఎవ్వరినో ఎక్కడి వాడనో దయచేసినాకు తెల్పుడు " అని పలికెను .
అప్పుడు బ్రహ్మ దేవుడు " సత్య పరాక్రమ ! రామా ! ఎడారడము తెలిపెదను వినుము నీవు జగ్దకారుడవైన నారాయణుడవు , లక్ష్ముడేవి నీవక్షస్థలమున నివసించుచుండెను . సుదర్శన చక్రము నీఆయుధము . శార్జము నీ ధనుస్సు నందకము అనునది నీఖడ్గము , నీవు సర్వ వ్యాహుడవు , సర్వ కాలముల యందు లోక కంఠకులను తును మాడు వాడవు నాశనము లని వాడవు ఆది మధ్యతర రహితము . జగన్నాధుడవు , ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్ధములను అనుసరించువాడవు . నీవులేనిదే ఏదియో లేదు నీవు శ్రీ మహా విష్ణువి సేత్తా సాద్వియే లక్ష్మీదేవి రాబోవు ద్వాపర యుగములో దుష్టశిక్షణ శిష్టరక్షణకై అవతరించు శ్రీ కృష్ణుడవి కొద నీవే శ్రీ కృష్ణుడవు లోక కంటకుడైన రావణుదీని వధించుటకే ఈ భూలోకమున మానవ రూపమున అవతరించినావు .
No comments:
Post a Comment