రామాయణము
ఉత్తరకాండ ------------ఇరువదినాలుగవసర్గ
మిల్కీలి దుర్మార్గుడైన రావణుడు విజయోత్సాహముతో తిరిగివచుచూ రాజులా , రుషిలా, దేవా, గందర్వల,నాగ,రాక్షస,,యక్ష , కన్యలను పెక్కు మందిని అపహరించెను . చూడ ముచ్చటైన్ కన్య గాని పరసతిగాని కనబడినచో వారి బంధు జనులను చంపివేసి ఆ కన్యలను విమానమునందు నిర్బంధించెను . ఆ కన్యలు , స్త్రీలు విమానము నందు బోరున ఏడవసాగిరి వారందరు తమలోతాము తమగోడు వేళ్ళ బోసుకుంటూ శోక సాగరములో మునిగిరి . ఆ స్త్రీలలో పెక్కు మంది " ఈ రాక్షాదములు పరస్త్రీ లపై కోరిక కలిగి ఉన్నందున ఒక స్త్రీ మూలంగానే ఇతడికి మరణము ప్రాప్తించును . " అని శపించిరి
ఈ విధముగా స్త్రీ లచే శపించబడిన రావణుడు తేజోరహితుడయ్యెను . అతని మనస్సు కలత చెందెను . వారి విలాపం వచనములు వింటూ రావణుడు లంకా నగరంలోకి ప్రవేశించెను . అప్పుడు నిశాచరులు జైజైలు పలుకుతూ ఆయనకు స్వాగత సత్కారములు చేసిరి . ఇంతలో కామరూపిణి భయంకరమైన రాక్షసి అగు శూర్పణఖ తన అన్న రావణుడి ముందు భూమి పై సాగిలపడెను . అప్పుడు రావణుడు తన చెల్లిని లేవనెత్తి " ఇది ఏమి నీకు వచ్చిన ఆపదేమిటి వెంటనే చెప్పు " అని పలికెను . నేత్రములనుండి బాష్పములు స్రవించుచునుండగా ఆ శూర్పణఖ " నీవు పరాక్రమ సాలివే కావచ్చు నీ ప్రతాప కారణముగా నన్ను విదవను చేసితివి . నా సోదరుడివి అయ్యిఉండి నా భర్తను చంపితివి . ఇట్లుచేసినందుకు నీకు సిగ్గుగాలేదా !? " అని ప్రశ్నించెను.
అప్పుడు రావణుడు "అమ్మా !ఏడవకుము . శత్రువులను దెబ్బతీయుటలో నిమగ్నుడనై ఉన్ననేను నీ భర్తను గుర్తించలేకపోతిని . ఇప్పుడు నీ హితము కొరకై నేను చేయగలిగినది అంతా చేసెదను . నీవు మనకు సోదరుడైన ఖరుడి వద్ద నివసింపుము . అతడు నీ ఆజ్ఞప్రకారము నడుచుకుంటాడు . "అని పలికేను . పిమ్మట రావణుడు పరాక్రమశాలురైన పదునాలుగువేలమంది యోధులతో కూడిన సైన్యము ఖరుడి ఆధీనములో ఉండునట్లు ఆజ్ఞలను ఇచ్చెను . అప్పుడు ఖరుడు తన సైన్యముతో కలిసి దండకారణ్యములో ప్రవేశించి ,పరిపాలన చేయుచుండెను . శూర్పణఖ కూడా ఆ వనములోనే నివసించసాగెను .
అప్పుడు రావణుడు "అమ్మా !ఏడవకుము . శత్రువులను దెబ్బతీయుటలో నిమగ్నుడనై ఉన్ననేను నీ భర్తను గుర్తించలేకపోతిని . ఇప్పుడు నీ హితము కొరకై నేను చేయగలిగినది అంతా చేసెదను . నీవు మనకు సోదరుడైన ఖరుడి వద్ద నివసింపుము . అతడు నీ ఆజ్ఞప్రకారము నడుచుకుంటాడు . "అని పలికేను . పిమ్మట రావణుడు పరాక్రమశాలురైన పదునాలుగువేలమంది యోధులతో కూడిన సైన్యము ఖరుడి ఆధీనములో ఉండునట్లు ఆజ్ఞలను ఇచ్చెను . అప్పుడు ఖరుడు తన సైన్యముతో కలిసి దండకారణ్యములో ప్రవేశించి ,పరిపాలన చేయుచుండెను . శూర్పణఖ కూడా ఆ వనములోనే నివసించసాగెను .
రామాయణము ఉత్తరకాండ ఇరువదినాలుగవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment