Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ ------------ఇరువదినాలుగవసర్గ

                                      రామాయణము 

                                ఉత్తరకాండ ------------ఇరువదినాలుగవసర్గ 

మిల్కీలి దుర్మార్గుడైన  రావణుడు   విజయోత్సాహముతో  తిరిగివచుచూ  రాజులా , రుషిలా, దేవా, గందర్వల,నాగ,రాక్షస,,యక్ష ,  కన్యలను  పెక్కు మందిని  అపహరించెను . చూడ  ముచ్చటైన్ కన్య గాని  పరసతిగాని  కనబడినచో  వారి బంధు  జనులను చంపివేసి  ఆ కన్యలను  విమానమునందు  నిర్బంధించెను . ఆ కన్యలు , స్త్రీలు  విమానము నందు  బోరున ఏడవసాగిరి   వారందరు  తమలోతాము  తమగోడు వేళ్ళ బోసుకుంటూ  శోక సాగరములో  మునిగిరి .  ఆ స్త్రీలలో పెక్కు మంది "  ఈ రాక్షాదములు  పరస్త్రీ లపై  కోరిక కలిగి ఉన్నందున  ఒక స్త్రీ మూలంగానే  ఇతడికి మరణము ప్రాప్తించును . " అని శపించిరి 
ఈ విధముగా  స్త్రీ  లచే  శపించబడిన రావణుడు  తేజోరహితుడయ్యెను .  అతని మనస్సు కలత చెందెను .  వారి విలాపం వచనములు వింటూ  రావణుడు  లంకా నగరంలోకి  ప్రవేశించెను . అప్పుడు  నిశాచరులు  జైజైలు  పలుకుతూ  ఆయనకు స్వాగత సత్కారములు  చేసిరి .  ఇంతలో  కామరూపిణి  భయంకరమైన  రాక్షసి అగు  శూర్పణఖ  తన అన్న రావణుడి  ముందు  భూమి పై సాగిలపడెను .  అప్పుడు  రావణుడు తన చెల్లిని  లేవనెత్తి "  ఇది  ఏమి  నీకు వచ్చిన  ఆపదేమిటి  వెంటనే చెప్పు  " అని పలికెను .  నేత్రములనుండి  బాష్పములు  స్రవించుచునుండగా   ఆ శూర్పణఖ  " నీవు పరాక్రమ  సాలివే కావచ్చు  నీ ప్రతాప  కారణముగా నన్ను  విదవను  చేసితివి .  నా సోదరుడివి  అయ్యిఉండి  నా భర్తను చంపితివి . ఇట్లుచేసినందుకు  నీకు సిగ్గుగాలేదా !? " అని ప్రశ్నించెను. 
అప్పుడు రావణుడు "అమ్మా !ఏడవకుము . శత్రువులను దెబ్బతీయుటలో నిమగ్నుడనై ఉన్ననేను నీ భర్తను గుర్తించలేకపోతిని . ఇప్పుడు నీ హితము కొరకై నేను చేయగలిగినది అంతా చేసెదను . నీవు మనకు సోదరుడైన ఖరుడి వద్ద నివసింపుము . అతడు నీ ఆజ్ఞప్రకారము నడుచుకుంటాడు . "అని పలికేను . పిమ్మట రావణుడు పరాక్రమశాలురైన పదునాలుగువేలమంది యోధులతో కూడిన సైన్యము ఖరుడి ఆధీనములో ఉండునట్లు ఆజ్ఞలను ఇచ్చెను . అప్పుడు ఖరుడు తన సైన్యముతో కలిసి దండకారణ్యములో ప్రవేశించి ,పరిపాలన చేయుచుండెను . శూర్పణఖ కూడా ఆ వనములోనే నివసించసాగెను . 

    రామాయణము ఉత్తరకాండ ఇరువదినాలుగవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment