రామాయణము
ఉత్తరకాండ - ఇరువదియేడవసర్గ
రావణాసురుడు కైలాస పర్వతము దాటి స్వర్గమునకు బయలుదేరెను . రావణుడు వచ్చుచున్నట్లు తెలుసుకున్న ఇంద్రుడు కలవరపడి యుద్ధసన్నద్ధుడయ్యెను . పిమ్మట ఇంద్రుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ఆ స్వామికి దైన్యముతో ఇట్లు విన్నవించెను . " శ్రీ హరీ ! ఆ రావణాసురుడు గొప్ప బలపరాక్రమములు కలవాడు . అతడు సుర లోకముపై దండెత్తి వచ్చుచున్నాడు . బ్రహ్మదేవుని వచనములను వ్యర్ధము కానీయరాదు కదా ! కనుక బాగుగా ఆలోచించి నాకొక ఉపాయమును చెప్పుము . నీవే నాకుదిక్కు " అని పలికెను . అప్పుడు శ్రీమన్నారాయణుడు " ఆ దుష్టుడు బ్రహ్మదేవుని నుండి వరములు పొందినందువలన అజేయుడు . దేవాసురులు అందరూ కలిసినా కూడా ఇతడిని చంపలేరు . సరికదా జయింపలేరుకూడా బాల గర్వితుడైన ఈ రాక్షసుడు కుమారునితో కలిసి అనేక విధాలుగా దుష్కార్యాలను చేస్తాడు . దేవేంద్రా ! నీ ముందే ప్రమాణము చేయుచున్నాను . రావణుయి చావు దగ్గర పడిన పిమ్మట ఇతడిని , ఇతడి పరివారమును నేనే హతమార్చెదను . ప్రస్తుతము నీవు వెళ్లి అతనితో యుద్ధము చేయుము . " అని పలికెను . పిమ్మట ఇంద్రుడు యుద్ధమునకు సిద్దపడెను . దేవతలకు రాక్షస యోధులకు మద్య తీవ్రమైన యుద్ధము ప్రారంభమైనది . సుపరిసిద్దుడు సూరుడు అష్టవసువులో ఎనిమిదవవాడు ఐన సావిత్రుడు కదన రంగములో రాక్షసులను చీల్చి చెండాడు చుండెను . సుమాలి అతడిని ఎదిరించి యుద్ధము చేసి ,అతని దాటికి తట్టుకొనలేక యుద్ధరంగములో ప్రాణములను కోల్పోయెను . వసువు యొక్క దాటికి తట్టుకొనలేక రాక్షసులు తమ పిక్కబలము చూపి పారిపోయిరి .
రామాయణము -ఉత్తరకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగు పండితులు .
No comments:
Post a Comment