Saturday 16 May 2020

రామాయణము ఉత్తరకాండ - ఇరువదియేడవసర్గ

                                       రామాయణము 

                                        ఉత్తరకాండ - ఇరువదియేడవసర్గ 

రావణాసురుడు కైలాస పర్వతము దాటి  స్వర్గమునకు బయలుదేరెను . రావణుడు  వచ్చుచున్నట్లు తెలుసుకున్న ఇంద్రుడు కలవరపడి  యుద్ధసన్నద్ధుడయ్యెను .  పిమ్మట  ఇంద్రుడు  విష్ణుమూర్తి  వద్దకు  వెళ్లి ఆ  స్వామికి  దైన్యముతో  ఇట్లు విన్నవించెను . " శ్రీ  హరీ ! ఆ  రావణాసురుడు  గొప్ప బలపరాక్రమములు  కలవాడు . అతడు  సుర లోకముపై  దండెత్తి   వచ్చుచున్నాడు . బ్రహ్మదేవుని  వచనములను  వ్యర్ధము  కానీయరాదు  కదా ! కనుక  బాగుగా  ఆలోచించి నాకొక  ఉపాయమును చెప్పుము . నీవే  నాకుదిక్కు " అని పలికెను . అప్పుడు  శ్రీమన్నారాయణుడు  "  ఆ దుష్టుడు  బ్రహ్మదేవుని  నుండి  వరములు పొందినందువలన అజేయుడు . దేవాసురులు  అందరూ  కలిసినా కూడా  ఇతడిని చంపలేరు . సరికదా జయింపలేరుకూడా  బాల గర్వితుడైన  ఈ  రాక్షసుడు కుమారునితో కలిసి అనేక విధాలుగా దుష్కార్యాలను చేస్తాడు . దేవేంద్రా ! నీ ముందే ప్రమాణము  చేయుచున్నాను . రావణుయి చావు దగ్గర  పడిన పిమ్మట ఇతడిని , ఇతడి పరివారమును  నేనే  హతమార్చెదను  . ప్రస్తుతము  నీవు వెళ్లి అతనితో యుద్ధము చేయుము . " అని పలికెను . పిమ్మట ఇంద్రుడు యుద్ధమునకు సిద్దపడెను . దేవతలకు  రాక్షస యోధులకు మద్య  తీవ్రమైన యుద్ధము  ప్రారంభమైనది . సుపరిసిద్దుడు  సూరుడు  అష్టవసువులో  ఎనిమిదవవాడు ఐన సావిత్రుడు కదన  రంగములో  రాక్షసులను  చీల్చి చెండాడు  చుండెను . సుమాలి  అతడిని  ఎదిరించి యుద్ధము చేసి  ,అతని  దాటికి తట్టుకొనలేక  యుద్ధరంగములో  ప్రాణములను కోల్పోయెను . వసువు  యొక్క దాటికి  తట్టుకొనలేక  రాక్షసులు  తమ పిక్కబలము  చూపి పారిపోయిరి . 

రామాయణము -ఉత్తరకాండ  ఇరువదియేడవసర్గ  సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగు పండితులు . 

















No comments:

Post a Comment