రామాయణము
ఉత్తరకాండ -ముప్పదిఆరవసర్గ
దేవతలను చూసిన వాయుదేవుడు తన కుమారునితో సహా బ్రహ్మదేవునికి ప్రదక్షిణ నమస్కారము చేసి ఆయన పాదములపై వాలెను . బ్రహ్మదేవుడు వాయుదేవుడను లేవనెత్తి , హనుమను తనచేతులతో నిమిరేను . బ్రహ్మదేవుని స్పర్శతగిలినంతనే శిశువుతేరుకోని హాయిగా ఉండెను . అదిచూసినవాయుదేవుడు తాను నిరోదించిన ప్రాణవాయువును ప్రసరింపచేసెను . అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో " ఈ శిశువు మున్ముందు చేయవలసిన ఘనకార్యములు పెక్కుకలవు కనుక వాయుదేవుని తృప్తికై మీరందరు ఈ బాలునికి వరములు ఇవ్వుము " అని ఆజ్ఞాపించెను . అప్పుడు దేవేంద్రుడు సంతోషముతో బంగారు పద్మములు కల హారమును బాలకుని మెడలో అలంకరించి ' ఇక మీదట నా వజ్రాయుధము వలన ఇతనికి ఏ హాని కలుగదు . ఇకపై ఇతడు హనుమంతునిగా ఖ్యాతివహించును ' . అని వరమిచ్చెను .
పిమ్మట సూర్యభగవానుడు " నా తేజస్సులోని నూరోవభాగమును ఇతడికి ప్రసాదించుచున్నాను . ఇతడు శాస్త్రములను అభ్యసింపదగిన వయస్సు కలవాడయినపుడు నేను ఇతనికి సకల శాస్త్రజ్ఞానమును కలిగిస్తాను . శాస్త్రజ్ఞానములో ఇతడికి సరితూగగలవాడు ఎవ్వరు ఉండరు . " అని వరమిచ్చెను . పిమ్మట వరుణదేవుడు తన పాశమువలన కానీ జలమువలన కానీ మృత్యుభయము లేకుండునట్లు వారము ప్రసాదించెను . తదుపరి యముడు తన దండము వలన మృత్యువుకలగదని ,, ఈ బాలకుడు ఎల్లప్పుడూ ఆరోగ్య భాగ్యములతో ఉంటాడని వరమిచ్చెను . అనంతరము కుభేరుడు తన గదవలన బాలాకునికి ఆపద కలుగదని పలికెను . పిమ్మట సంఖరుడు ' నావలన కానీ నా శూల , పాశుపతాస్త్ర ఆయుధములవలన కానీ ఇతడు వధ్యుడు కాడు " అని గొప్ప వరమును ఇచ్చెను . పిమ్మట బ్రహ్మదేవుడు తన బ్రహ్మాస్త్రముసైతము ఇతడికి హానికలిగించలేదని ఇతడు దీర్గాయువు పండుతాడని ఆశీర్వదించెను . పిమ్మట విశ్వకర్మ నేను నిర్మించిన దివ్యాస్త్రములలో ఏవియూ ఇతడిని వధించలేవు . ఇతడు చిరంజీవి అవుతాడు . " అని కావరము ప్రసాదించెను .
అప్పుడు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు వాయుదేవునితో " మహాబల నీకుమారుడైన మారుతి శత్రువులను గడగడా లాడించగలడు . ఇతడు తాను కోరుకున్న రూపమును పొందగలడు . ఇతడు తనఇష్టాను రీతిలో సంచరించగలడు . ఇతడు చిర స్థిరకీర్తితో వర్ధిల్లును ఇతఁడు చేసే సాహస కార్యములన్నియూ రావణునివద్దకు కారణములు అగును . ఇతడు లోకములకు సంతోషము కలిగించును . " అని పలికెను . పిమ్మట దేవతలందరు తమ తమ స్థానములకు వెళ్లి పోయిరి . పిమ్మట ఆ వాయుదేవుడు కూడా హనుమను తీసుకుని అంజనీ దేవి వద్దకు వెళ్లి మారుతికి దేవతలు అనుగ్రహించిన వరములు గురించి వివరించి వెళ్లిపోయెను .
బలసామర్ధ్యములు పెరిగిన హనుమ తమ రాజ్యములోని ఋషీశ్వరుల ఆశ్రమములో ఉపద్రవమును సృష్టించసాగెను . యజ్ఞవేదికల యందలి సాధనములను భగ్నముచేయుచుండెను . అగ్నిహోత్రమును ఆర్పివేయుచుండెను . వారి యొక్క వల్కలములను , అజినములను చింపివేయుచుండెను . తన తల్లితండ్రులు ఎంతగా నివారించుచుంటినప్పటికీ మారుతి తన చిలిపి చేష్టలను మానివేయుటలేదు . ఇతడి అల్లరిని తట్టుకోలేక భృగు అంగీరస వంశజులైన మహర్షులు మారుతి బలములను మరిచిపోవునట్లు శపించెను . ఇతరులు ఎవ్వరైనను అతని బలపరాక్రమములను పేరుప్రతిష్టలను ప్రస్తావించినచో అతనికి తన బలములు జ్ఞప్తికి వచ్చును ఆ విధముగా మారుతి తన శక్తీ సామర్ధ్యములను మరచిపోయినాడు . ఆ కారణము చేతనే ఇతడు వాలి సుగ్రీవులమధ్య వైరము ఏర్పడినపుడు వాలిని మట్టుపెట్టలేకపోయెను . సుగ్రీవుడికి మారుతికి గల వరభలములు తెలియదు . హనుమంతుడు సూర్యునికి అభిముఖముగా ఉండి సమయోచితముగా ప్రశ్నించుచూ వ్యాకరణ శాస్త్రమును నేర్చుకొండెడివారు . ఇతడా శాస్త్రమును పాతించుచూ దారణచేయుచూ ఉదయాద్రినుండి అస్త్రాద్రివరకు సూర్యభగవానుడిని అనుసరించుచుండెడివాడు . సంగీత , ఇతరశాస్త్రములయందు ఇతడు విసారధుడు అట్లే ఛందస్సాస్త్రమునందు పారాయణుడు . సమస్త విద్యలయందు ,తపోవిధానముల యందు ఇతడు దేవతలకు గురువైన బృహస్పతివంటివాడు . నవవ్యాకరణ సిద్ధాంతములను పుక్కిట పట్టినవాడు. రామా! నీ అనుగ్రహము వలన రాబోవు కల్పము నందు ఇతడు బ్రహ్మకాగలడు" . అగసస్త్యుడి పలుకులు విని రామలక్ష్మణులు వానరులు రాక్షసులు మిక్కిలి ఆశ్చర్యపడిరి . పిమ్మట అగస్త్యుడు మొదలైన మహర్షులందరు " నిన్ను చూచుట నీతో సంభాషించుట మా అదృష్టము . ఇక మేము వెళ్లివచ్చేదను . " అని పలికెను . అప్పుడు శ్రీ రాముడు " మహర్షి మిమ్ము దర్శించుటచే మేము కృతార్థులమైనాము . నేను యజ్ఞములను చేయదల్చితిని . మహా తపశ్శక్తి సంపన్నులైన మీరు సదా మాయజ్ఞములను పర్యవేక్షించుచూ మమ్మల్ని అనుగ్రహించవలెను . నేను ఆచరింపనున్న యజ్ఞములకు ఎల్లప్పుడూ ప్రారంభసమ్యమునందే మీరందరు విచేయవలసినదిగా నా ప్రార్ధన " అని పలుకగా మహర్షులందరూ సంతోషముతో తధాస్తు అనిపలికి శ్రీ రాముని వీడ్కని తమ స్థానములకు వెళ్లిరి .
రామాయణము ఉత్తరకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment