రామాయణము
ఉత్తరకాండ --------------- పదమూడవసర్గ
అగస్త్యుడు శ్రీ రాముడితో ఇంకా ఇలా చెపుతున్నాడు "రామా! కొంతకాలము పిమ్మట బ్రహ్మదేవుడు నిద్రాదేవతను లంకకు పంపెను . ఆ దేవి ఖుమభకర్ణుణ్ణి ఆవహించెను . అప్పుడు కుంభకర్ణుడు నిద్రబాధను తట్టుకొనలేక తనకొక భావనమును ఏర్పాటుచేయమని రావణుని అడిగెను . రావణుడు ఒక భావనమును ఏర్పాటు చేయగా కుంభకర్ణుడు అందులోనే అనేక వేళా సంవత్సరములు ఈమాత్రము మెలుకువలేక నిద్రలో మునిగెను .
రావణుడు నిరంకుశుడై దేవతలను, ఋషులను , యక్షులను , గంధర్వులను, పీడింపసాగెను అతడు ఇంద్రుడి నందన వనమును మొదలగు చిత్రవిచిత్రములైన ఉద్యానవనములు అన్నింటినీ ధ్వంసము చేసెను . అతడు నీటిలో ఉండే జంతువులను బాధించెను . మహా వృక్షములను పెకలించివేయుచుండెను . పర్వతములను బ్రద్ధలుకావించుచుండెను . ధనాధిపతి ఐన కుభేరునికి రావణుని ఆగడములు తెలిసెను . అప్పుడతడు తనవంస కీర్తి ప్రతిష్టలను గుర్తుకు తెచ్చుకొని సోదరప్రేమతో చొరవతీసుకుని దశగ్రీవుని హితము కోరి ఒక దూతను లంకా నగరమునకు పంపెను .
వెంటనే ఆ దూత లంకానగరమునకు వెళ్లి మొదట విభీషణుడిని కలిసెను . విభీషణుడు దూతకు అతిధి సత్కారములు చేసి అతని రాకకు కారణమడిగెను . పిదప కుభేరునియొక్క , అతని బంధువులయొక్క క్షేమ సమాచారములు అడిగి తెలుసుకొనెను . పిమ్మట విభీషణుడు సభలో ఆసీనుడై ఉన్న రావణుడి వద్దకు అతడిని తీసుకువెళ్ళేను . ఆ దూత రావణుడిని దర్శించి, అతడికి నమస్కారముచేసి , అతడితో " మహారాజా ! మీ సోదరుడు కుబేరుడు పంపిన సందేశమును యధాతదంగా వినిపించెదను దయతో ఆలకింపుడు ' సోదరా ! నీవు ఇంత వరుకు చేసిన ఘనకార్యములు ఇక చాలును నీకు సాధ్యమైనచో నీ బుద్ధిని ఉత్తమ ధర్మమార్గమునకు , మరల్చుము . అది నీకు ఎంతో శ్రేయస్కరము నీవు ధ్వంసము చేసిన నందనవనమును చూసితిని . నీవు ఋషులను భాధించినట్లు వింటిని . దేవతలు ప్రతీకారము తీర్చుకొనుటకై పూనుకున్నట్లు తెలిసినది . తమ్ముడా నీవు నేను చెప్పిన మాటల్ని అనేక సార్లు పెడచెవిన పెట్టినావు . నేను జితేంద్రుడనై నియమ నిష్టలతో కేదారవ్రహమును ఆచరించుటకై హిమవత్ పర్వతము చేరితిని అక్కడ నేను పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడిని దర్శించితిని . అప్రయతంముగా నా ఎడమ కంటి దృష్టి ఆ దేవిపై పడినది ఎవరీమె అని మాత్రమే చూచితిని కానీ అప్పుడు నాలో ఈ దురుద్దేశము లేదు ఆ దేవియొక్క దివ్యతేజ ప్రభావముచే నా ఎడమకన్ను దగ్ద మై పోయి పింగళి వర్ణమును పొందినది . పిమ్మట నేను ఎనిమిదివందల సంవత్సరకాలం మౌనముగా ఆ మహావ్రతము చేసాను . అప్పుడు పరమేశ్వరుడు నాకు ప్రత్యక్షమై ' కుబేర ! నీవు తపస్సుచే నన్ను మెప్పించితివి కావున ఇప్పడి నుండి నీవు నాకు స్నేహితుడవి అని పలికెను . ఈ విధముగా సంఖరునికి మిత్రుడనై ఆ ప్రభువు అనుజ్ఞతో అలకాపూరికి చేరితిని . పిమ్మట నీ పాపా కృత్యములు గురించి విన్నాను . వాటివలన మన వంశమునకు తీరని కళంకము ఏర్పడును . కావున ఆ పాపా కార్యములను మానుకో ఇప్పుడు దేవతలు మహర్షులు నిన్ను వధించు ఉపాయములు గూర్చి ఆలోచనలు చేయుచున్నారు . " అని దూత కుబేరుని పలుకులను వినిపించెను .
దూత పలికిన కుబేలుని వచనములు విని రావణుడు క్రుద్ధుడై కన్నులెర్రజేసి పండ్లుపటపటా కొరుకుతూ , చేతులను బిగించుచూ " దూతా ! నీవు పలికిన అతని ప్రలాపముల అంతరార్ధము గ్రహించితిని . దుర్భాషలు వినిపించినందుకు నీవు ఇప్పుడే మృత్యుముఖమునకు చేరెదవు . అంతేకాదు నిన్ను పంపిన నా సోదరుడు కూడా మిగలదు . అతనికి మహేశ్వరునితో మైత్రి ఏర్పడినట్లు బహుశా నన్ను భయపెట్టుటకై నీవు చెప్పుచున్నావేమో?' ఈ రావణునకు నేను అన్నను కనుక ఇతడు నన్ను చంపడు' అని భావించుచున్నాడేమో .?నా భాహు బలముచే ముల్లోకములను కూడా జయింప గలను . అపరాధము చేసినవాడు కుబేరుడి ఒక్కడే అయినను అతని మూలంగా నలుగురు దిక్పాలకులను మృత్యువు పాలు చేసెదను . ఇలా పలికిన పిమ్మట ఆ రావణుడు దూతను తన ఖడ్గమునకు భలి ఇచ్చెను . అతని కళేబరమును రాక్షసులకు ఆహారముగా ఇచ్చివేసి ను . అనంతరము అతని అనుచరులు జయజయములు పలుకుచుండగా రావణుడు రధమును అధిరోహించి కుబేరుడివద్దకు బయలుదేరెను .
No comments:
Post a Comment