రామాయణము
యుద్ధకాండ -----------నూటతొమ్మిదవసర్గ
రాముడు , రావణుడు , ఇరువురు తమతమ రథముల పై నుండి చేయుచున్న గోరయుద్ధము సర్వలోకములను భీతిల్లచేయుచుండెను . ఉభయపక్షముల సైనికులు వివిధ ఆయుధములను ధరించి యుద్ధమునకు సిద్ధముగా ఉండిరి . అయినను వారు ఆ మహావీరులమధ్య జరుగుతున్న యుద్ధమును ఆశ్చర్య చికితులై చూస్తూ ప్రతిపక్ష యోధులతో యుద్ధం చేయక నిలబడివుండిరి . రాక్షస సైనికులు రావణుడిని , వానరయోధులు శ్రీ రాముడిని ఆశ్చర్యముతో కళ్లప్పగించి చూస్తూఉండిరి . దశగ్రీవుడు మిక్కిలి కోపంతో రాముడి రథముపై ఉన్న ధ్వజమును లక్ష్యముగా చేసుకొని బాణములు ప్రయోగించెను . కానీ ఆ బాణములు ఇంద్ర రధము యొక్క ప్రభావముచే ధ్వజమును తాకకుండానే నేలపై పడిపోయింది .
పిమ్మట రాముడు తన బాణముతో రావణుడి ధ్వజమును విరగగొట్టెను . రావణుడు రోషంతో రాముడి రధాశ్వములపై బాణములను ప్రయోగించెను . కానీ ఆ బాణములు ఇంద్రుడి రధాశ్వములను ఏమాత్రము భాదించలేకపోయినవి మిక్కిలి కోపంతో రావణుడు అనేక శస్త్రములను ప్రయోగించెను . శ్రీ రాముడు తన బాణములతో ఆ శస్త్రములన్నిటినీ నిర్వీర్యము చేసెను . వారిరువురు ప్రయోగించుచున్న , బాణములు పరస్పరము ఢీకొని భూమిపై పడిపోవుచున్నవి . ఇలా జరిగిన సంకుల సమరం చూచువారికి రోమములు నిక్కబొడుచుకొనెను . శ్రీ రాముడు తన రధ ధ్వజమును విరగగొట్టుటచే రావణుడు మిక్కిలి కోపోద్రిక్తుడై ఉండెను .
రామాయణము -------యుద్ధకాండ----------నూటతొమ్మిదవసర్గ -------సమాప్తము ---------------
శశి,
ఎం.ఏ , ఎం.ఏ,(తెలుగు), తెలుగు పండితులు .
No comments:
Post a Comment