రామాయణము
ఉత్తరకాండ ----------అయిదవసర్గ
గంధర్వుడైన గ్రామాని సుఖేసుడుని చూసి తన కుమార్తె ఐన దేవవతిని ఇచ్చి వివాహము చేసెను . వారికి మాల్యవంతుడు , మాలి , సుమాలి అను ముగ్గురు సంతానము . వారు మిక్కిలి బలశాలులు ఆ ముగ్గురు సోదరులు తన తండ్రి ఐన సుఖేసుడు పరేమేస్వరుడి వలన వరములు పొందినట్లు తెలుసుకొని మేరు పర్వతమునకు చేరి ఘోర మైన తపస్సుని ఆచరించ సాగిరి . ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరములను కోరమనెను . అప్పుడు వారు " దేవా ! మేము చిరకాలము జీవించునట్లు యుద్దములో ఎంతటి శత్రువునైనా జయించి అజేయులుగా నిలుచునట్లు అనుగ్రహింపుము . అంతే కాక మేము సర్వసమర్థులమై పరస్పర ప్రేమానురాగములతో ఉండునట్లు వరములు ప్రసాధింపుము . " అని కోరెను . అప్పుడు బ్రహ్మదేవుడు సుఖేశ తనయులు కోరినట్లుగా వరములను ప్రసాదించి సత్యలోకమునకు వెళ్లెను .
రామా! ఇట్లు వరములు పొందిన పిమ్మట ఆ ముగ్గురు సోదరులు నిర్భయులై దేవతలను, రాక్షసులను సకల ప్రాణులను భాదింప సాగిరి . ఆ రాక్షులు పెట్టె బాధలకు తాళ లేక దేవతలు , మహర్షులు , మున్నగువారు విలవిల లాడసాగిరి . రఘువరా! ఇది ఇట్లు ఉండగా ఎక్కడనూ తమకు ఎదురులేక పోవుటచే ఆ రాక్షసులు హర్షోత్సాహములతో పొంగిపోవుచుండిరి . ఒక రోజు వారు శిల్పులలో అగ్ర గణ్యుడైయిన విశ్వకర్మ వద్దకు వెళ్లి ఆయనతో " మహాత్మా ! నీవు గృహ నిర్మాణము న అత్యంత ప్రతిభాశాలివి . కనుక వెంటనే హిమవత్పర్వతముపై కానీ , మేరుపర్వతముపై కానియూ , ఒక విశాలమైన భవనమును మాకు నిర్మించి ఇవ్వుము . అది పరమేశ్వరుడి భవనమువలె వైభవముగా ఉండవలెను ." అని అభ్యర్ధించిరి . అప్పుడు విశ్వకర్మ వారితో " సజ్జనులారా ! దక్షిణ సముద్ర తీరమున త్రికూటము అనుపర్వతము కలదు . ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారము . నేను ఆ పరవతముపై లంకా నగరమును నిర్మించితిరి . అది ముప్పది యోజనముల వెడల్పు పది యోజనముల పొడవు కలిగినది . దాని చుట్టూ బంగారు ప్రాకారములతో బంగారపు ద్వారములతో ఉన్నది . " అని తెలిపెను . అప్పుడా రాక్షసులు విశ్వకర్మ సూచనలను అనుసరించి వేళా కొలది అనుచరులతో ఆ పురమున నివసింప సాగిరి . ఆ లంకా నగరము దృఢమైన ప్రాకారములతో అగడ్తలతో ఉన్నది . దానిలో వందల కొలది బంగారు గృహములు కలవు . అట్టి లంక యందు మాల్యవంతాది రాక్షసులు సంతోషముగా నివసింపసాగిరి .
ఆ కాలములోనే నర్మద అనే ఒక గాంధర్వ స్త్రీ ఉండెడిది . ఆమె తన ముగ్గురు కుమార్తెలైన సుందరి, కేతుమతి, వసుధ లను వరుసగా మాల్యవంతుడు , సుమాలి , మాలి , లకు ఇచ్చి వివాహము చేసెను . మాల్యవంతుడికి వజ్రముష్టి , విరూపాక్షుడు , దుర్ముఖుడు , సుఖఃతజ్ఞుడు , యజ్ఞ కోపుడు , మత్తుడు, ఉన్మత్తుడు అనే ఏడుగురు కుమారులు కలిగిరి . సుమ్మలికి ప్రహస్తుడు , అకంపనుడు , వికటుడు, కాలాకార్ముఖుడు, ధూమ్రాక్షుడు , దండుడు, సుపార్శ్వుడు , మహాబలుడు , సంఖ్యత్రి , ప్రఘసుడు , బాసకర్ణుడు , అను పదకొండుమంది కుమారులు కలిగిరి . మాలికి అనిలుడు , నలుడు , హరుడు , సంపాతి, అను నలుగురు కుమారులు కలిగిరి . మిక్కిలి బలపరాక్రమములు కలిగి ఉండుడుట చే అనేక పుత్రులచే గావితులైన ఆ ముగ్గురు రాక్షసులు ఇంద్రాది దేవతలను ఋషులను , నాగులను , యక్షులను , మిక్కిలి బాధింప సాగిరి . ఆ రాక్షసులు రానా అంగముయందు . తిరుగు లేని వారై స్వామిరా విహారం ఒనర్చుచుండిరి . ఆ రాక్షసులు అన్ని లోకములు తిరుగుతూ యజ్ఞ యాగాదులను ధ్వంసము చేయు చుండిరి .
No comments:
Post a Comment