రామాయణము
ఉత్తరకాండ-----------ఎనిమిదవసర్గ
అగస్త్య మహర్షి శ్రీ రాముడు తో " రామా ! పారిపోవుచున్న రాక్షసభలములను విష్ణు మూర్తి వెంటాడి చంపుతుండగా మాల్యవంతుడు కోపంతో వెనుతిరిగి " దేవా! యుద్ధవిముఖులై ఉన్నవారిని చంపుట మహా పాపము క్షత్రియ ధర్మమును ఎరుగవా ఏమి ? అంతగా నీకు యుద్ధము చేయవలెనని ఉన్నచొ నాతో యుద్ధము చేయుము " అని పలికెను . అప్పుడు విష్ణువు " రాక్షసులను రూపుమాపెదను అని నేను అభయమిచ్చెను . అందువలన నేను నా వాగ్దానమును పాటించుచున్నాను . మీరు పాతాళములో దాగిన నేను ముమ్మలను మాటు పెట్టక మానను . " అని పలికెను . అప్పుడు మిక్కిలి కోపంతో మాల్యవంతుడు తన ముష్టిఘాతం తో శ్రీహరి ని గరుత్మంతుణ్ణి బలముగా కొట్టి నాలుగు మొరల దూరము వెనక్కి తగ్గెను . అప్పుడు గరుత్మంతుడు కోపంతో తన రెక్కల గాలితో మాల్యవంతుడిని ఎగర గొట్టెను . ఎగిరి పోయిన తన అన్నను చూసి వెంటనే సుమాలి తన బలములతో కూడి లంకకు పారిపోయెను . గరుత్మంతుని రెక్కల దాటికి ఎగిరి పోయిన మాల్యవంతుడు సిగ్గు తో తల వంచుకొని లంకకు పోయెను . రామా! ఆ శ్రీ హరిచే అనేక మంది రాక్షసులు మరణించిరి . విష్ణువును యుద్దములో ఎదిరింపలేక శక్తిహీనులై మిగిలిన రాక్షసులు భయముతో లంకను వదిలి ,తలదాచుకొనుటకై పత్నులతో సహా పాతాళలోకమునకు వెళ్లిరి . ఇంతవరకు రాక్షసులయొక్క పుట్టుపూర్వోత్తరముల గురించి నీకు వివరముగా చెప్పితిని . ఇప్పుడు రావణుని యొక్క అతని కుమారుల యొక్క జన్మ వృత్తాంతములను తెలిపెదను వినుము . విష్ణువుకు బయపడి కలత చెందిన సుమాలి తన వారైన రాక్షసులతో ,పుత్ర పౌత్రులతో కలిసి చిరకాలము పాలాలోకములోనే ఉండసాగెను . అప్పుడు బలశాలి ఐన కుబేరుడు లంకను తన ఆవాసముగా చేసుకొనెను .
No comments:
Post a Comment