రామాయణము
యుద్ధకాండ ------నూటపదకొండవ సర్గ
అప్పుడు మాతలి శ్రీ రాముడితో " ప్రభూ! ఇతడిని చంపుటకు బ్రహ్మాస్త్రమును ప్రయోగింపుము " అని పలికెను . మాతలి పలుకులు విన్నవెంటనే శ్రీ రాముడికి బ్రహ్మాస్త్రము జ్ఞప్తికి వచ్చెను ఈ అస్త్రమును అగస్త్య మహాముని శ్రీ రాముడికి ఉపదేశించెను . శ్రీ రాముడు వేద మంత్రములతో విద్యుక్తముగా అభిమంత్రించి ఆ బ్రహ్మాస్త్రమును రావణుని పై ప్రయోగించెను . అది రావణుని వక్షస్థలములో గుచ్చుకొని రావణుని ప్రాణములను హరించెను . రావణుని హతమార్చిన పిమ్మట రక్తముతో తడిసిఉన్న ఆ శరము పని ముగించుకొనిన వినమ్ర సేవకునివలె తిరిగి శ్రీ రాముని తూణీరమునకు చేరెను . రణ రంగములో చావగా మిగిలిన రాక్షస యోధులు దిక్కులేనివారై మిక్కిలి భయపడుతూ ఏటువారటు పారిపోయిరి . వానరులు శ్రీ రామునికి జైజైలు పలికిరి దేవతల దుందుభులు మ్రోగినవి . సువాసనలతో కూడిన గాలి హాయిగా వీచింది . శ్రీ రాముడిపై పుష్ప వర్షము కురిసినది దేవతలు మహాత్ములు , శ్రీ రాముని పొగిడిన ప్రశంసలు వినబడినవి సుగ్రీవుడు విభీషణుడు మున్నగు వారు శ్రీ రాముని ప్రశంసించి , పూజించిరి . వానర యోధులందరు సంతోషంతో పెద్దపెద్ద ధ్వనులు చేస్తూ గంతులేయుచూ నృత్యములు చేసిరి .
రామాయణము --------యుద్ధకాండ -------------నోటపదకొండవ సర్గ ------------సమాప్తము.
శశి,
ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు ) , తెలుగు పండితులు .
No comments:
Post a Comment