రామాయణము
ఉత్తరకాండ --ముప్పదవసర్గ
మిక్కిలి బలశాలి ఐన ఇంద్రుడు రావణుడి సుతుడైన ఇంద్రజిత్తు చేతిలో పరాజితుడై లంకలో బంహితుడైన పిమ్మట దేవతలు బ్రహ్మదేవుడిని ముందుఉంచుకొని లంకకు వెళ్లిరి . ఆకాశమునందుండియే బ్రహ్మదేవుడు "నాయనా! రావాణా ! నీ కుమారుడి యొక్క బలపరాక్రమములకు నేనెంతో ముగ్దుడనైతిని . నలుగురు దిక్పాలకులను జయించి తీరెదను అనే నీ ప్రతిజ్ఞ నెరవేరింది . మిక్కిలి బలశాలి ఐన నీ పుత్రుడు ఇక పై ఇంద్రజిత్తు గా ప్రసిద్దుడగును . ఇంద్రుడిని విడిచి పెట్టుము ప్రతిఫలంగా దేవతలు నీకు ఇవ్వగలరో తెలుపుము ". అని పలికెను . అప్పుడు ఇంద్రజిత్తు " దేవా ! ఇంద్రునికి బంధవిముక్తి కలిగించుటకై ప్రతిఫలంగా నేను అమరత్వము కోరుచున్నాను " అని అడిగెను . దానికి బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఏ ప్రాణికి అమరత్వము ఉండదని తెలిపి మరేదైనా కోరుకొమ్మని పలికెను . అప్పుడు ఇంద్రజిత్తు " పితామహా!ఒక వేళా పూర్తిగా అమరత్వము సాధ్యము కానిచో నేను యుద్ధరంగములోకి ప్రవేశించుటకు ముందుగా హోమంచేసి మంత్రపూర్వకములుగా హవ్యములు సమర్పించినచో ఆ హోమం నుండి ఒక దివ్య రధము ఆవిర్భవింపవలెను . ఆ రథముపై నేను ఉన్నంతసేపు నన్ను ఎవరు చంపలేనట్లుగా చేయుము ఒక వేళ మంత్రపూర్వకముగా హోమరూపములో అగ్నిదేవుని పూజించుట పూర్తికాకముందే నేను యుద్ధమునకు వెళ్ళినచో నాకు మరణము కలుగునట్లు చేయుము " అని ప్రాదించెను . అప్పుడు బ్రహ్మదేవుడుతధాస్తు అని పలికి దేవతలతో సహా ఇంద్రుడుని వెంటపెట్టుకొని సురలోకమునకు వెళ్లిపోయెను .
పిమ్మట ఇంద్రుడు తన తేజస్సు తగ్గిపోయి తాను పరాజితుడగుటకు కారణము గురించి ఆలోచింపసాగెను . అప్పుడు బ్రహ్మదేవుడు " ఇంద్రా ! ఇదువరుకు నీవు చేసిన తప్పిదమునకు ఫలితమే ఇది . పూర్వము నేను మిక్కిలి సౌందర్యవతి ఐన అహల్యను సృష్టించి ఈమెకు భర్త ఎవరా అని ఆలోచింప సాగేను . నీవు న ప్రమేయము లేకుండానే ఈమె నాకు భార్య కాగలు అని ఆలోచన చేసితివి . నేను గౌతమునికి ఇచ్చి వివాహము చేసితిని . ఇంద్రా ! నీవు అన్ని ధర్మాలనుఎరిగినవాడివి అయినా ఆమె నీకు భార్య కాలేదని కోపంతో గౌహాటముని ఆశ్రముముకు వెళ్లి అన్యధా ప్రవర్తించితివి . అప్పుడు గౌతముడు ఈ ఇంద్రపదవి నీకు స్థిరముగా ఉండదని శపించెను . ఆ శాప కారణముగానే నేడు నీకీ దుర్దశ కలిగినది .
పిమ్మట గౌతముడు తన భార్యను గట్టిగా మందలించి ఆమెనుకూడా శపించెను . అప్పుడు అహల్యాదేవి గౌతమునితో తన తప్పేమి లేదని అది ఇంద్రామాయ అని ప్రార్ధించెను . అప్పుడు గౌతముడు " సతీ ఇక్ష్వాకురాజ వంశమున శ్రీ మహావిష్ణువే శ్రీరాముడి రూపములో అవతరించును . అతడు రాక్షసులను సంహరించుటకు ఇటువచును ఆయన్ని దర్శించినంత మాత్రమునే నీవు పవిత్రురాలివి కాగలవు పిమ్మట నన్ను చెర గలవు " అని పలికి ఆయన తపస్సుకై వెడలిపోయెను . పిమ్మట అహల్యా దేవికూడా తీవ్రమైన తపస్సులో మునిగిపోయెను . ఆ దుష్కర్మ ఫలితమునే ఇప్పుడు నీవు అనుభవించుచుంటివి . దేవేంద్రా! వైష్ణవము అనే యజ్ఞమును చేయుము . దానివలన నీకు శుభము కలుగును . నీ కుమారుడైన జయంతుడు మరణించలేదు . మీ మామగారైన పులోముడు తన మనవడిని తీసుకు వెళ్లి సముద్రగర్భమున భద్రముగా ఉంచెను " అని పలికి బ్రహ్మ దేవుడు తన లోకమునకు వెళ్లిపోయెను .
రామాయణము ఉత్తరకాండ ముప్పదవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగుపండితులు .
No comments:
Post a Comment