రామాయణము
ఉత్తరకాండ -పదునాలుగవసర్గ
పిమ్మట రాక్షస రాజు మహోదరుడు , ప్రహస్తుడు , మారీచుడు, శుఖుడు , సారణుడు , ధూమ్రాక్షుడు , అనే ఆరుగురు మంత్రులతో కలిసి కైలాసగిరి చేరెను . మంత్రులతో గూడి కైలాసమునకు చేరినట్లు విని , యక్షులు ఆ రావణుని ఎదుట నిలువలేకపోయిరి . కుబేరుడు ఆ యక్షవీరులను యుద్ధమునకు అనుమతింపగా వారు సంతోషముతో సమరసన్నద్దులై బయలుదేరిరి . యక్షులకు, రాక్షసులకు మధ్య సంకులసమరము ప్రారంభమయ్యెను . రాక్షసరాజు యొక్క సచీవులు అందరును భీకర పరాక్రమశాలులు . వారిలో ఒక్కొక్కడే వేయి మంది యక్ష సైనికులతో పోరాడసాగెను . రావణుడు ఆ యక్ష సైన్యమును దగ్దమొనర్చుచుండెను . ఆ రావణ సచీవులు యక్షులను చావు దెబ్బ తీసిరి . యుద్దభూమి యందు కొందరు యక్షులు తీవ్రముగా గాయపడగా శరీరములు భగ్నములగుటచే నేలపై పడిపోతిరి .
యక్ష సైనికులు యుద్ధరంగమున శాస్త్రములు కోల్పోయిరి . మిక్కిలి అలిసిపోయి ఒకరినిఒకరు కౌగలించుకొని కూలిపోయిరి . యుద్దఱంగములో యక్షసైనికులు భంగపడుట చూసిన కుబేరుడు మిక్కిలి బలాఢ్యులైన మరికొంతమంది యక్షప్రముఖులను యుద్ధరంగమునకు పంపెను . మారీచుడు దాటికి తట్టుకొనలేక కొందరు యక్షులు రణ రంగమునుండి పారిపోయిరి . పిమ్మట దశగ్రీవుడు అలకాపురి ముఖద్వారం వద్దకు చేరెను .
ఆ ద్వారము బంగారముచే నిర్మింపబడి చిత్రవిచిత్రముగా ఉండెను . దానిపై వైడూర్య మణుల పొడి చల్లబడి ఉండెను . అప్పుడు సూర్యభానుడు అనే పేరు గల ద్వారపాలకుడు రావణుణ్ణి అడగించెను . అయినాను ఆగక ద్వారంలోకి ప్రవేశించే రావణుడిని ఆ యక్షుడు ద్వారస్తంభము పెకలించి దానితో కొట్టెను . వెంటనే ఆ రాక్షస రాజు అదే ద్వార స్తంభము లాక్కుని ఆ యక్షుడిని తీవ్రముగా కొట్టెను . ఆ రాక్షస రాజు పరాక్రమము చూసి మిక్కిలి అలిసిపోయిన యక్షులు భయముతో గడగడ ఒణుకుచూ ఆయుధములు పారవేసి పారిపోయిరి .
రామాయణము ----------ఉత్తరకాండ ---------పదునాలుగవసర్గ -----------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు ), తెలుగు పండితులు .
No comments:
Post a Comment