రామాయణము
యుద్ధకాండ ------- నూటరెండవసర్గ
శ్రీ రాముడు రావణునితో యుద్ధం చేయుచునే సుషేణునితో ఇలా పలికెను "వీరుడైన లక్ష్మణుని దురావస్తమును చూసి శోకము ఇనుమడించుచున్నది ఇతడు నాకు ప్రాణముల కంటే ఎంతో ఇష్టమైన వాడు . ఇట్టి స్థితిలో నేను యుద్ధము ఎలా చేయగలను శుభ లక్షణ సంపన్నుడైన నా తమ్ముడు యుద్ధము చేయుటలో వాసికి ఎక్కినవాడు . ఒక వేళ అట్టి ఈ వీరుడు ప్రాణములను కోల్పోయిన చొ నాకు సుఖములతో పనియేమి . అంతేగాదు ఇప్పుడు యుద్ధము తో గాని, సీతతో కానీ కడకు ప్రాణములతో గాని ఏ దేశము నందైనను భార్య లభించవచ్చు , బంధువులు లభించవచ్చు , కానీ లక్ష్మణుని వంటి సోదరుడు లభించడు . "అని పలికెను .
అపుడు కపి వీరుడైన సుషేణుడు శ్రీ రామా !ముద్దులొలికేడి ఈ లక్స్మనుడు అసువులు వీడలేదు . ఇతని ముఖము వికృతము కాలేదు . కాంతి తగ్గలేదు , ఈయన ముఖము జీవ కళతో ప్రసన్నముగా ఉన్నది . ప్రాణములు కోల్పోఎడి వారి రూపము ఇలా ఉండదు . కొంచంకూడా విషాదానికి లోనుకావద్దు ఇతడు కేవలం క్షతగాత్రుడై భూమి పై పది ఉన్నాడు . శ్వాస ఆడు చున్నది . ఇతని గుండె బాగుగా కొట్టుకొనుచున్నది . ఇతడు సజీవుడై వున్నాడనుటకు ఇవన్నీ లక్షణములు . "అని పలికి పక్కనే ఉన్న హనుమంతునితో "బుద్ది శాలి వెంటనే బయలు దేరి ఓషధి పర్వతము వద్దకు వెళ్ళు ఆ పర్వతము యొక్క దక్షిణ శిఖర బాగాన ఉన్న విశల్యకరని (శరీరమునందు నాటుకొనిన బాణములను తొలగించి గాయములను మానేలా చేసేది . ) సవర్ణకరని (శరీర కాంతిని సహజ స్థితికి తెచ్చునది ). సంజీవని స్పృహ లోకి తెచ్చి చైతన్యము కూర్చునది . సంధాన కరణి (విరిగిన ఎముకులను జోడించునది) . అను ప్రసిద్ధములైన పరమౌషధములను తీసుకొని త్వరగా రమ్ము మహాత్ముడైన వీరుడు , లక్ష్మణుడు చైతన్య వంతుడగుటకు ఈ ఔషదాలేంతో సహాయ పడతాయి అని పలికెను . "
సుషేణుడు ఈ విధముగా పలికిన వెంటనే హనుమంతుడు వాయు వేగంతో ఓషదిపర్వతమును చేరెను . కానీ హనుమ అచ్చడి దివ్య ఔషదములను గుర్తించ లేక కొంత సేపు చింతా గ్రాంతుడయ్యెను . వెంటనే మారుతికి ఆ గిరి శిఖరముని పూర్తిగా పెల్లగించి తీసుకు వెళ్ళవలననే చక్కని ఆలోచన తట్టెను . వెంటనే హనుమ బాగుగా వికసించిన పువ్వులు గల వృక్షములతో నిండిన ఆ గిరి శిఖరమును పెల్లగించి తన చేతి పై నిలుపుకొనెను . పిమ్మట హనుమ మహా వేగముతో యుద్ధ భూమికి చేరి ఆ గిరి శిఖరంను తన సేనల మధ్య ఉంచెను . పిదప ఆ మారుతి కొంత విశ్రమించి సుషేణునితో "వానరోత్తమా మీరు చెప్పిన ఓషధులను నేను గుర్తించలేక పోయితిని , కనుక పూర్తిగా ఆ శిఖరమునే తీసుకువచ్చితిని అని పలికెను . "
సుషేణుడు హనుమను పొగిడి పర్వతము నుండి ఓషధములను తీసుకుండెను . హనుమంతుడు చేసిన ఈ కార్యము దేవతలకు కూడా అసాధ్యమైనది . అట్టి అద్భుత కార్యమును చూసి యుద్దభూమి యందున్న వానరులు రాక్షసులు మిక్కిలి ఆశ్చర్య పడిరి . పిమ్మట సుషేణుడు ఆ ఓషదములను చక్కగా నూరి లక్ష్మణుని ముక్కు దగ్గర ఉంచెను . స్పృహ లేకుండా పడి ఉన్న లక్ష్మణుడు ఆ వాసన పీల్చిన వెంటనే గాయములు మాని పూర్తి ఆరోగ్యవంతుడై నిద్రనుండి లేచినట్లుగా లేచి కూర్చుండెను . అది చూసిన వానరులు బాగు బాగు అని సుషేణుడిని పొగిడిరి .
శ్రీ రాముడు ఆనంద బాష్పములు రాల్చుతూ లక్ష్మణుడిని కౌగిలించుకొనెను . అపుడు శ్రీ రాముడు లక్ష్మణునితో "తమ్ముడా ! నా అదృష్టము కొద్దీ పునర్జన్మ ఎట్టి వచ్చిన నిన్ను చూస్తున్నాను నీవు మరణించిన చొ నా విజయమునకు అర్ధమే ఉండదు . అంటే కాదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణములతో కానీ ఏమి ప్రయోజనము ఉండదు . అని పలికెను అపుడు లక్ష్మణుడు అన్నా !సత్పురుషులు ప్రతిగ్యా భంగములకు పాల్పడరు. ప్రతిజ్ఞ పాలన మహా పురుషుల లక్షణము కదా నా కారణముగా నీవు నిరాశకు లోను కావద్దు . రావణుని వధించుట ద్వారా సీతాదేవికి చేరనుంది విముక్తి కలిగించెదను . అను నీ ప్రతిజ్ఞను పాలించుము . ఆ దుర్మార్గుడిని అతి శీఘ్రముగా వధించవలనని నా ఆకాంక్ష . రావణుడిని వధించి విభీషణుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి , సీతా దేవికి విముక్తిని కలిగించెదను అనే నీ ప్రతిజ్ఞను నిలబెట్టు కొనుటకై వెంటనే రావణుడిని పరిమార్చుము అని పలికెను .
రామాయణము ------యుద్ధకాండ -------నూటరెండవ సర్గ ----------- సమాప్తము
శశి ,
ఎం.ఏ ఎం.ఏ (తెలుగు ), తెలుగు పండితులు .
No comments:
Post a Comment