Friday 1 May 2020

రామాయణము యుద్ధకాండ ------- నూటరెండవసర్గ

                                 రామాయణము 

                             యుద్ధకాండ ------- నూటరెండవసర్గ 

శ్రీ రాముడు  రావణునితో యుద్ధం చేయుచునే సుషేణునితో ఇలా పలికెను "వీరుడైన లక్ష్మణుని దురావస్తమును చూసి శోకము ఇనుమడించుచున్నది ఇతడు నాకు ప్రాణముల కంటే ఎంతో ఇష్టమైన వాడు . ఇట్టి స్థితిలో నేను యుద్ధము ఎలా చేయగలను శుభ లక్షణ సంపన్నుడైన నా తమ్ముడు యుద్ధము చేయుటలో వాసికి ఎక్కినవాడు . ఒక వేళ అట్టి ఈ వీరుడు ప్రాణములను కోల్పోయిన చొ  నాకు సుఖములతో పనియేమి . అంతేగాదు ఇప్పుడు యుద్ధము తో గాని, సీతతో కానీ  కడకు ప్రాణములతో గాని ఏ దేశము నందైనను  భార్య లభించవచ్చు , బంధువులు లభించవచ్చు , కానీ లక్ష్మణుని వంటి సోదరుడు లభించడు . "అని పలికెను . 
అపుడు  కపి వీరుడైన సుషేణుడు శ్రీ రామా !ముద్దులొలికేడి  ఈ లక్స్మనుడు అసువులు వీడలేదు . ఇతని ముఖము వికృతము కాలేదు . కాంతి తగ్గలేదు , ఈయన ముఖము జీవ కళతో ప్రసన్నముగా ఉన్నది . ప్రాణములు కోల్పోఎడి  వారి రూపము ఇలా ఉండదు . కొంచంకూడా విషాదానికి లోనుకావద్దు ఇతడు కేవలం క్షతగాత్రుడై భూమి పై పది ఉన్నాడు . శ్వాస ఆడు చున్నది . ఇతని గుండె బాగుగా కొట్టుకొనుచున్నది . ఇతడు  సజీవుడై వున్నాడనుటకు ఇవన్నీ లక్షణములు . "అని పలికి పక్కనే ఉన్న హనుమంతునితో  "బుద్ది  శాలి  వెంటనే బయలు దేరి ఓషధి పర్వతము వద్దకు  వెళ్ళు  ఆ పర్వతము యొక్క  దక్షిణ శిఖర బాగాన ఉన్న  విశల్యకరని (శరీరమునందు నాటుకొనిన  బాణములను తొలగించి గాయములను మానేలా చేసేది . )  సవర్ణకరని (శరీర కాంతిని సహజ స్థితికి తెచ్చునది ). సంజీవని  స్పృహ లోకి తెచ్చి చైతన్యము కూర్చునది . సంధాన కరణి  (విరిగిన ఎముకులను జోడించునది) . అను ప్రసిద్ధములైన  పరమౌషధములను తీసుకొని త్వరగా రమ్ము  మహాత్ముడైన వీరుడు  , లక్ష్మణుడు చైతన్య వంతుడగుటకు  ఈ ఔషదాలేంతో సహాయ పడతాయి అని పలికెను . " 
సుషేణుడు ఈ విధముగా పలికిన వెంటనే  హనుమంతుడు వాయు వేగంతో ఓషదిపర్వతమును చేరెను . కానీ హనుమ అచ్చడి దివ్య ఔషదములను గుర్తించ లేక  కొంత సేపు చింతా గ్రాంతుడయ్యెను . వెంటనే మారుతికి ఆ గిరి శిఖరముని పూర్తిగా పెల్లగించి  తీసుకు వెళ్ళవలననే చక్కని ఆలోచన తట్టెను . వెంటనే హనుమ బాగుగా వికసించిన పువ్వులు గల వృక్షములతో నిండిన  ఆ గిరి శిఖరమును పెల్లగించి తన చేతి పై నిలుపుకొనెను . పిమ్మట హనుమ మహా వేగముతో యుద్ధ భూమికి చేరి ఆ గిరి శిఖరంను తన సేనల మధ్య ఉంచెను . పిదప ఆ మారుతి కొంత విశ్రమించి సుషేణునితో "వానరోత్తమా మీరు చెప్పిన ఓషధులను నేను గుర్తించలేక పోయితిని , కనుక పూర్తిగా ఆ శిఖరమునే తీసుకువచ్చితిని అని పలికెను . "
సుషేణుడు  హనుమను పొగిడి పర్వతము నుండి  ఓషధములను  తీసుకుండెను . హనుమంతుడు చేసిన ఈ కార్యము దేవతలకు కూడా అసాధ్యమైనది . అట్టి అద్భుత కార్యమును చూసి యుద్దభూమి యందున్న  వానరులు రాక్షసులు మిక్కిలి ఆశ్చర్య పడిరి .  పిమ్మట సుషేణుడు ఆ ఓషదములను చక్కగా నూరి  లక్ష్మణుని ముక్కు దగ్గర ఉంచెను . స్పృహ లేకుండా పడి  ఉన్న లక్ష్మణుడు ఆ వాసన పీల్చిన వెంటనే  గాయములు మాని పూర్తి ఆరోగ్యవంతుడై  నిద్రనుండి లేచినట్లుగా లేచి కూర్చుండెను . అది చూసిన వానరులు బాగు బాగు అని సుషేణుడిని పొగిడిరి . 
శ్రీ రాముడు ఆనంద  బాష్పములు రాల్చుతూ లక్ష్మణుడిని కౌగిలించుకొనెను . అపుడు శ్రీ రాముడు లక్ష్మణునితో "తమ్ముడా ! నా అదృష్టము కొద్దీ పునర్జన్మ ఎట్టి వచ్చిన నిన్ను చూస్తున్నాను నీవు మరణించిన చొ నా విజయమునకు అర్ధమే ఉండదు . అంటే కాదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణములతో కానీ ఏమి ప్రయోజనము ఉండదు . అని పలికెను అపుడు లక్ష్మణుడు అన్నా !సత్పురుషులు ప్రతిగ్యా భంగములకు పాల్పడరు. ప్రతిజ్ఞ పాలన మహా పురుషుల లక్షణము కదా నా కారణముగా నీవు నిరాశకు లోను కావద్దు . రావణుని వధించుట ద్వారా సీతాదేవికి చేరనుంది విముక్తి కలిగించెదను . అను నీ ప్రతిజ్ఞను పాలించుము . ఆ దుర్మార్గుడిని అతి శీఘ్రముగా వధించవలనని నా ఆకాంక్ష . రావణుడిని వధించి  విభీషణుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి , సీతా దేవికి  విముక్తిని కలిగించెదను అనే నీ ప్రతిజ్ఞను నిలబెట్టు కొనుటకై  వెంటనే రావణుడిని పరిమార్చుము అని పలికెను . 

రామాయణము ------యుద్ధకాండ -------నూటరెండవ సర్గ ----------- సమాప్తము 






        శశి , 
ఎం.ఏ ఎం.ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 

        

































No comments:

Post a Comment