రామాయణము
ఉత్తరకాండ ----------ఆరవసర్గ
ఆ మాల్యవంతాది రాక్షసులచే చావు దెబ్బలు తిన్న దేవతలు, తపఃసంపన్నులు, ఋషులు , గడగడా ఒనికిపోవుచూ పరమేశ్వరుని శరణువేడిరి . అప్పుడు పరమేశ్వరుడు సుఖేసుని పై అభిమానము ఉన్నందున తనను శరణువేడిన వారితో" దేవతలారా నేను ఆ అసురులను చంపను కానీ ఆ అసురులను అంతమొందించే మార్గము చెబుతాను వినుము . మీరందరు శ్రీ మహావిష్ణువద్దకు వెళ్లి ఆయనను సరను వేడుము . ఆయనే ఆ రాక్షుసులను చంపుటకు సర్వసమర్దుడు . " అని పలికెను .
పిమ్మట ఆ దేవతలు, ఋషీశ్వరులు , అందరూ విష్ణు మూర్తి వద్దకువెళ్లి ఆయనను శరణుజొచ్చిరి . జగద్పా పాలకుడైన ఆ ప్రభువు ఆ రాక్షసులను పరిమార్చుతానని వారికి భయము ఇచ్చెను . నిశాచరుడైన మాల్యవంతుడు దేవతల ప్రయత్నములు అన్ని తెలుసుకొని తన సోదరులతో" సోదరులారా! దేవతలు, ఋషులూ కలిసి మనల్ని పరిమార్చమని పరమేశ్వరుణ్ణి అభ్యర్ధించారు . పిమ్మట వారు ఆ పరమేశ్వరుడి సలహా తో శ్రీ మహా విష్ణువుని శరణు వేడిరి . ఆ ప్రభువు మనల్ని హతమారుస్తానని అభయము ఇచ్చినాడట తమ్ములారా ! ఆ శ్రీ హరి చేతిలో హిరణ్యకశిపుడు , నముచి , కాలనేమి , సంహారాధుడు , రాధేయుడు , యమలార్జునులు , హార్ధిక్యుడు , శంభుడు , నిశింభుకుడు , మొదలగువారందరు మరణించిరి . ఆయనతో తలపడిన వారెవ్వరు విజయులు అయ్యినట్లుగా మనము విని ఉండలేదు . కావున ఈ విషయములన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మనందరికీ శ్రేయస్కరమైన ఉపాయము గూర్చి ఆలోచింపుము . " అని పలుకగా అప్పుడు సుమాలి, మాలులు , " అన్నా ! మనము వేదములను అధ్యయనము చేసితిమి . దానధర్మములు చేసితిమి . యజ్ఞయాగాదులను చేసితిమి . ఐశ్వర్యమును అనుభవించితిమి రాజ్యమును పరిపాలించుచున్నాము . అనారోగ్యమునకు తావు లేని ఆయుర్దాయము పొందితిమి . కనుక మనకు మృత్యుభయము ఏమాత్రము లేదు . యముడు , ఇంద్రుడు , రుద్రుడు , చివరికి నారాయణుడు కూడా మన ముందు నిలబడుటకే భయపడుదురు . మనపై శ్రీ హరికి ద్వేషముండుటకు కారణమేమియూ లేదు . దేవతల వలనే ఇప్పుడాయనకు మన మీద కోపము కాజాలింది . కాబట్టి మనమందరమూ సైన్యముతో సహా దండెత్తి దేవతలని చంపి వేద్దాము . " అని పలికిరి .
వెణు వెంటనే రాక్షసులు అందరు తమ తమ సైన్యములతో సహా దేవతల పై దండెత్తిరి . అప్పుడు దేవతలు బ్రతుకు జీవుడా అని పారిపోయిరి . ఇది తెలుసుకొన్న శ్రీ మన్నారాయణుడు వారితో యుద్దముకై సిద్దపడి గరుత్మంతుని పైకి ఎక్కి అక్కడికి వచ్చెను. ఆలా వచ్చుచున్నపుడు గరుత్మంతుని రెక్కల గాలిదాటికి వారి రాధములపై గల ధ్వజ పటములు ఎగిరి పోసాగెను . అస్త్రములు అన్ని చెల్లాచెదురై పోయెను .
వెణు వెంటనే రాక్షసులు అందరు తమ తమ సైన్యములతో సహా దేవతల పై దండెత్తిరి . అప్పుడు దేవతలు బ్రతుకు జీవుడా అని పారిపోయిరి . ఇది తెలుసుకొన్న శ్రీ మన్నారాయణుడు వారితో యుద్దముకై సిద్దపడి గరుత్మంతుని పైకి ఎక్కి అక్కడికి వచ్చెను. ఆలా వచ్చుచున్నపుడు గరుత్మంతుని రెక్కల గాలిదాటికి వారి రాధములపై గల ధ్వజ పటములు ఎగిరి పోసాగెను . అస్త్రములు అన్ని చెల్లాచెదురై పోయెను .
No comments:
Post a Comment