రామాయణము
ఉత్తరాకాండ --------ఇరువదిఒకటవసర్గ
ఎక్కడికైనా త్వర త్వరగా వెళ్లే శక్తిగల విప్రోత్తముడైన నారదుడు వెనువెంటనే యమలోకమునకు వెళ్లి రావణుడు దండెత్తి వస్తున్న విషయము తెలిపెను . ఇంతలోనే దూరముగా రావణుడి విమానము కనబడెను.
విమానంపై వచ్చుచున్న రావణుడు నరకలోకములో ప్రాణులు పడుతున్న మిక్కిలి భయానకరమైన నరక యాతనలను కళ్లారా చూసేను . అవి వెన్నులో వొణుకు పుట్టించునట్లుగా ఉండెను . ఆ భాదలు తట్టుకోలేక జీవులు కర్ణ కఠోరంగా కేకలు పెట్టుచుండిరి . పిమ్మట దశగ్రీవుడు మరొకవైపు చూడగా అక్కడ పుణ్యాత్ములేన జీవులు తమ మంచికర్మల ప్రభావంగా శ్రేష్టమైన గృహములలో జీవించుచూ గీతములతో , వాద్యగోష్టులతో , మనోహర నాదములతో ఆనందించుచుండిరి . వారిలో గృహదానములు చేసినవారు చక్కని భావనములలో ఉండెను . గోదానములు చేసిన వారు గోక్షీరమును ఆస్వాధించుచుండెను . అన్న దానము చేసిన వారు రుచికరమైన ఆహార పదార్ధములను భుజించుచుండెను .
తాము చేసిన దుష్కర్మల ఫలితముగా రంపపుకోతలు మొదలగుయాతనలు అనుభవించుచున్న ప్రాణులకు రావణుడు తన భళా పరాక్రమముల ద్వారా విముక్త్తి కలిగించెను . అప్పుడు యమా దూతలు మిక్కిలి క్రుద్ధులై రావణునిపై విరుచుకుపడిరి . యమభటులు పుష్పక విమానంపై ఈటలను , శూలములను బల్లెములను వందల వేలకొలదిగా విసిరిరి కానీ బ్రహ్మ యొక్క ప్రభావమున అది చెక్కు చెదరక ఉండేను . రావణుడు , అతని అనుచరులు యముని పక్షముకు చెందిన యోధులపై దాడికి దిగి అక్కడ ఉన్న వృక్షములను , కొండలను , మహాప్రాసాదములను పెకలించి యుద్ధము చేయసాగిరి . యమభటులు రావణుడి అస్త్రములను నివారించుచూ రావణుడిని ఒంటరిగా చేసి అతనిని దెబ్బ తీసిరి అప్పుడు రావణుడు పాశుపతాదాస్త్రమును ప్రయోగించెను . ఆ అస్త్రము నిప్పులు చిమ్ముచు పొదలను వృక్షములను , బస్మం చేస్తూ దూసుకొని పోవుచుండెను . ఆ అస్త్రము యెక్క తేజ ప్రభావంగా యముని సైనయము నెల కూలెను .
రామాయణము ------------ఉత్తరకాండ ----------ఇరువదిఒకటవసర్గ -----------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు
No comments:
Post a Comment