రామాయణము
ఉత్తరకాండ ---------ఏడవసర్గ
రాక్షసులు వెణు వెంటనే విష్ణు మూర్తిపై శరముల వర్షము కురిపించే సాగెను . రాక్షసుల ధనస్సుల నుండి బయటకు వచ్చిన శరములు ప్రళయకాలంలో లోకముల వలే ఆ స్వామిలో లీన మగుచున్నవి . విష్ణు మూర్తి రాక్షసులపై సరములను ప్రయోగించి ఆ రాక్షసులను చెండాడసాగెను . అప్పుడు సుమాలి యుద్ధరంగములో శ్రీ హరికి ఎదురుగా నిలబడి తన బాణ వర్షము చే ఆయనను కప్పివేసెను . అది చూసి ధైర్యము తెచ్చుకున్న మిగిలిన రాక్షసులు కూడా తమతమ అస్త్ర సస్త్ర ములను శ్రీ హరిపై ప్రయోగించసాగిరి . అప్పుడు శ్రీ హరి సుమాలి యొక్క సారధి శిరస్సును చేధించెను . అప్పుడు సుమాలి యొక్క రధాశ్వములు దారి తప్పి సుమాలి రధమును లాగుకొని దూరముగా పోయెను . అప్పుడు మాలి శ్రీ హరికి ఎదురుగా నిలబడి యుద్ధము చేయనారంభించెను . అది చూసిన విష్ణు మూర్తి అతని పై బాణ వర్షము కురిపించెను . పిమ్మట విష్ణువు అతని ధనస్సును, రధాశ్వములను, ధ్వజపతాకములను, చివరికి కిరీటమును తన బాణములచే నేల పాలు చేసెను . అప్పుడు రధము ను కోల్పోయిన మాలి గధను తీసుకొని విష్ణువు పైకి దూకి గరుత్మంతుని నుదుటి బాగముపై బలముగా కొట్టెను . అప్పుడు రాక్షసులంతా కోలహాల ధ్వనులు చేసిరి . దానితో కోపించిన విష్ణువు సుదర్శనచక్రమంతో మాలి శిరస్సును కండించెను . శ్రీ హరి చేతిలో మాలి హతుడగుట చూసి వంటనే పెక్కుమంది రాక్షసులు ,ఇంకా సుమాలి, మాల్యవంతుడు తమ బలములతో సహా లంకకు పరుగులు తీసిరి . విష్ణు చక్రము యెక్కదాటికి కొంత మంది రాక్షసుల ముఖములు ఛేదించబడెను . గదాయుధమునకు మరికొంతమంది వక్షస్థలములు నుగ్గునుగ్గుఅయ్యెను . నాగలి దెబ్బలకు కొంతమంది కంఠములు తెగిపడెను . రోకలి పోటులకు కొందరి తలలు పగిలిపోయెను . ఖడ్గమునకు కొందరు బలిఅయ్యిరి . మిగిలిన వారు సరాగధములచే మిక్కిలి గాయపడిరి . ఆస్తితిలో బతికి ఉన్న రాక్షసులు తమ ప్రాణములను కాపాడుకొనుటకై శక్తి కొలది పరుగులు తీసిరి .
రామాయణము --------ఉత్తరకాండ ----------ఏడవసర్గ -------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment