రామాయణము
యుద్ధకాండ ----------నూటఇరువదియేడవసర్గ
చైత్రశుద్ద పంచమి నాటికి శ్రీరాముని వనవాస దీక్ష ముగియబోవుచుండగా ఆనాడు శ్రీ రాముడు తనువెళుతున్న పుష్పకవిమానమును భరద్వాజముని ఆశ్రమువద్ద దింపి ఆశ్రమములోకి వెళ్లి ఆ మహామునికి నమస్కరించెను . అప్పుడు శ్రీ రాముడు భారద్వాజ మునితో " మహాముని మీరుక్షేమమే కదా మీతపస్సు చక్కగా సాగుచున్నది కదా , అయోధ్యా నగరము నందలి ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నట్లుగా వార్తలు మీరు ఏమైనా విన్నారా? భరతుడు రాజ్యమును చక్కగా పరిపాలించుచున్నాడు కదా తల్లులందరును సుఖసంతోషములతో ఉన్నారుకదా " అని అడుగగా భరద్వాజ ముని శ్రీ రామునితో చిరునవ్వు చిందించుచూ "రామా ! భరతుడు జటాధారి అయి దీక్షతో నీరాక కోసము ఎదురుచూచుచున్నాడు అతడు నీ పడుకులను ముందుంచుకొని రాజ్యపరిపాలన కావించుచుండెను . అంతఃపుర వాసులే కాకా పరజలందరూ కూడా సంతోషముగా ఉన్నారు . నేను నా దివ్య దృష్టితో నీవు వనవాస సమయములో మునులను దర్శించుట తాపసులనును దర్శించుట సీతాదేవిని రావణుడు అపహరించుట, సుగ్రీవుడితోస్నేహము, వాలివధ , సీతాన్వేషణ , మహాసాగరముపైవారధిని నిర్మించుట, రవాణా సంహారము వీటన్నిటిని నేను ఎరుగుదును . ఓ రామా! ఇప్పుడు నేను సంతోషముతో వారము ఇవ్వకోరుచున్నాను ఏంకావాలాకోరుకో " అని పలికెను .
అప్పుడు శ్రీరాముడు " మహాముని అన్నికాలాలలోను ఇక్కడ కల వృక్షములు మధురములైన ఫలములను ఇచ్చుగాక నేను అయోధ్యకు పయనించునపుడు నా వెంట ఉన్న వారాధివీరులందరికి ఫలములు కోకొల్లలుగా లభించుగాక " అని అడిగెను అప్పుడు భరద్వాజ ముని ఆ వరమును ఇచ్చెను ఆ వార ప్రభావముచే పూలులేని చెట్లన్నీ, పూలతో కళకళలాడెను, ఫలములు లేని చెట్లన్నీ ఫలములతో నిండెను , మోడువోయిన చెట్లన్నీ పచ్చటి ఆకులతో కళకళ లాడెను . అక్కడి నుండి అయోధ్యకువెళ్ళు మార్గము వరుకు కూడా దారిలో ఉన్న చెట్లన్నీ కూడా ఇట్లే ఫల , పుష్ప, తేనెలతో నిండిపోయెను . అవి చూసిన వానరులు ఎంతో సంతోషించి ఆ దివ్య ఫలములను తనివి తీరా భక్షించిరి .
No comments:
Post a Comment