రామాయణము
ఉత్తరకాండ -ముప్పదిరెండవసర్గ
మిక్కిలి భయంకరుడైన రావణుడు నర్మదా నదీ తీరమునందలే ఇసుక తిన్నలపై శివలింగార్చన చేయుచున్న సమయములో నర్మదా నదీ జలములు సముద్రజలములవలె కెరటములతో ఉప్పొంగి రావణుడి పూజకు తెచ్చిన పూలన్నిటినీ నాదీ గర్భములో కలిపేసినవి . అది చూసిన రావణుడు ఇలా జరుగుటకు గల తెలుసుకొని రమ్మని శుఖసారణులను పంపెను . వారు తిరిగి వచ్చి రావణుడితో " మహారాజా ! ఇచటికి సమీపానే ఒక మహాపురుషుడు జలక్రీడలు ఆడుచున్నాడు . అతడు మద్దిచెట్టువలె మహాకాయుడు , అతడు ఒక ఆనకట్ట వలే
నదీ ప్రవాహమును అడ్డుకునెను ". అని పలికెను .
వెంటనే రావణుడు కార్తవీర్యార్జునుడు అని పలుకుతూ ఆ మహా రాజు ఉన్న దిశగా వెళ్లసాగెను . రావణుని మంత్రులు కార్తవీర్యార్జుని మంత్రులను యుద్దములో హతమార్చి భక్షించివేసిరి . ఇంతలో ద్వార పాలకులు ఆ విషయమును కార్తవీర్యార్జునికి తెలిపిరి . వెంటనే కార్తవీర్యార్జునుడు ఆ నదీ జలములనుండి బయటకు వచ్చి గధను పైకెత్తి గిరగిరా తిప్పుతూ శత్రువులపై విరుచుకుపడెను . వేయి చేతులుగల కార్తవీర్యార్జునుడికి ఇరువైచేతులు గల రావణుడికి మధ్య గ్రాయుద్దము జరిగెను . వారిరువురు పరస్పరముగదలతో తీవ్రముగా మోదుకొన సాగిరి . ఆ గదా గాథ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లు నట్లుగా మారుమ్రోగినవి . కార్తవీర్యార్జునుడు పైకెగిరి తన గదదెబ్బకు కిందపడి విలవిలా లాడుతున్న రావణుణ్ణి గరుత్మంతుడు సర్పమును పాటలుకున్నట్టుగా పట్టుకొని బంధించెను . అప్పుడు సిద్దులు , దేవతలు కార్తవీర్యార్జునుడిపై పుష్పవర్షము కురిపించిరి .
రావణుడిని బంధించి తన తో తీసుకుపోతున్న కార్తవీర్యార్జునిడిని చూసిన రావణుని మంత్రులు " ఆగుము అగుము మా ప్రభువును విడువుము విడువుము అని అరుస్తూ కార్తవీర్యార్జునిడిపై అనేక ఆయుధములు ప్రయోగించిరి . తన మీదకు వచ్చుచున్న ఆయుధములన్నిటినీ కార్తవీర్యార్జునుడు పట్టుకొని రాక్షసులపైనే విసిరివేసెను . ఆ విధముగా కార్తవీర్యార్జునుడు రావణుడిని తీసుకొని , మాహిష్మతీ నగరమునకుచేరి అక్కడ అతడిని బంధించెను .
వెంటనే రావణుడు కార్తవీర్యార్జునుడు అని పలుకుతూ ఆ మహా రాజు ఉన్న దిశగా వెళ్లసాగెను . రావణుని మంత్రులు కార్తవీర్యార్జుని మంత్రులను యుద్దములో హతమార్చి భక్షించివేసిరి . ఇంతలో ద్వార పాలకులు ఆ విషయమును కార్తవీర్యార్జునికి తెలిపిరి . వెంటనే కార్తవీర్యార్జునుడు ఆ నదీ జలములనుండి బయటకు వచ్చి గధను పైకెత్తి గిరగిరా తిప్పుతూ శత్రువులపై విరుచుకుపడెను . వేయి చేతులుగల కార్తవీర్యార్జునుడికి ఇరువైచేతులు గల రావణుడికి మధ్య గ్రాయుద్దము జరిగెను . వారిరువురు పరస్పరముగదలతో తీవ్రముగా మోదుకొన సాగిరి . ఆ గదా గాథ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లు నట్లుగా మారుమ్రోగినవి . కార్తవీర్యార్జునుడు పైకెగిరి తన గదదెబ్బకు కిందపడి విలవిలా లాడుతున్న రావణుణ్ణి గరుత్మంతుడు సర్పమును పాటలుకున్నట్టుగా పట్టుకొని బంధించెను . అప్పుడు సిద్దులు , దేవతలు కార్తవీర్యార్జునుడిపై పుష్పవర్షము కురిపించిరి .
రావణుడిని బంధించి తన తో తీసుకుపోతున్న కార్తవీర్యార్జునిడిని చూసిన రావణుని మంత్రులు " ఆగుము అగుము మా ప్రభువును విడువుము విడువుము అని అరుస్తూ కార్తవీర్యార్జునిడిపై అనేక ఆయుధములు ప్రయోగించిరి . తన మీదకు వచ్చుచున్న ఆయుధములన్నిటినీ కార్తవీర్యార్జునుడు పట్టుకొని రాక్షసులపైనే విసిరివేసెను . ఆ విధముగా కార్తవీర్యార్జునుడు రావణుడిని తీసుకొని , మాహిష్మతీ నగరమునకుచేరి అక్కడ అతడిని బంధించెను .
రామాయణము ఉత్తరకాండ ముప్పదిరెండవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment