రామాయణము
యుద్ధకాండ ------------ నూటఇరువదిఒకటవసర్గ
బ్రహ్మ దేవుడు సుభవచనములు పలికిన పిమ్మట అగ్నిదేవుడు తండ్రి వేలే సీతా దేవిని తీసుకొని అగ్ని గుండము నుండి పైకి వచ్చెను . సీతాదేవి ధరించిన పూలహారములు నూతనముగా చెక్కుచెదరకుండా ఉండెను . ఆ మహా సాద్వి యొక్క రూప వైభవములు అద్వితీయము . అటువంటి సీతాదేవిని అగ్ను దేవుడు శ్రీ రాముడికి అప్పగించి ఆయనతో " రామా ! నీ ధర్మపత్ని అయాన్ ఈ వైదేహియందు ఎట్టి దోషము లేదు ఈ పుణ్యాత్మురాలు నిన్ను తప్ప్ అన్యుల గురించి ఆలోచించి ఎరుగదు బల గర్వితుడైన రావణుడు నిర్జనవనములో
నీవులేని సమయమున ఈమెను అపహరించెను . రావణుడు ఈమెను తన అంతఃపురమునందలి అశోకవనములో రహస్యముగా ఉంచెను . వికృతాకారులియాన్ రాక్షస స్త్రీలను ఈమెను కాపలాపెట్టెను . అప్పుడు కూడా ఈమె నియందే మనసు ఇలిపి నీవే దిక్కని నమ్ముకొనుచూ దుఃకించుచుండెడిది . ఆ రాక్షసుడు ఈమెను అనేక విధములుగా ప్రలోభపెట్టిచూచెను . తీవ్రముగా భయపెట్టుచుండెను . అయినాను ఈ సాద్వి అతనిని గురించి ఏమాత్రము తలంపలేదు . రఘురామా ఈమె హృదయము పవిత్రమైనది . ఎట్టిదోషము ఎరుగనిది . నామాటలకు మారు పల్కగ ఈమెను సవీకరింపుము .
అగ్నిదేవుడి పలుకు విన్న పిమ్మట శ్రీ రాముడు అయ్యో ఇట్టి ఉత్తమురాలిని అన్యాయముగా పరుష వాక్యములతో బాధపెట్టితిని కదా అని కనీరు కార్చెను అపుడు శ్రీ రా,ముడు అగ్ని దేవునితో " దేవా సేఈతా దేవి యందు ఎట్టి దోషము లేదు ఈమె పవిత్రురాలు కానీ రావణుని అంతఃపురమునందలి అశోకవనమున చాలా కాలము ఉన్నందువలన ముల్లోకముల వారికి ఈమె పాతివ్రత్యహమును నిరూపించుటకై ఈ పరీక్ష పెట్ట వలసి వచ్చినది. ఈమెను నేను పరిత్యజించుట అసంభవం . " అని పలికెను. రాముడు చేసిన పనియొక్క అంతరార్ధమును గ్రహుంచునా మహాత్ములు శ్రీ రాముని ప్రశంసించిరి . అప్పుడు శ్రీ రాముడు సీతాదేవి ఓదార్చెను .
No comments:
Post a Comment