రామాయణము
యుద్ధకాండ -----------పదునెనిమిదవసర్గ
శ్రీ రాముడు తన పక్కనే సిగ్గు పడుతూ నిల్చున్న సీతాదేవితో " సీతా యుద్ధమును రాక్షసుడి చార నుండి నీకు విముక్తిని కలిగించితిని . చేయవలసిన పనిని చేసితిని కానీ నిన్ను పొందుటకైకాదు నాపై వచ్చిన కళంకము తొలగినది . ఇప్పుడు నేను స్వతంత్రుడను . దేవి చేపలల చితుడైనా రావణుడు నిన్ను అపహరించుకుపోయి మన ఇద్దరికి ఎడబాటు కలిగించాడు . ఈ అవమానము విధివిలాసము వాయుసుతుడు సముద్రమును లంఘించుట లంకను ధ్వంసము చేయుట అనే ఘన కార్యములు పొగడదగినవి . సుగ్రీవుడు నాహితము కోరి సమయాను కూలంగా అనేకసలహాలు చెప్పినాడు అంతే కాకా సైన్యముతోసహా యుద్దములో పరాక్రమము చూపినాడు అతని కృషి నేడు ఫ్లించింది . నా భక్తుడైన విభీషణుడు దుష్టుడైన అన్నాను విడిచి నన్ను ఆశ్రయించాడు . అతడు పడినాశ్రమ నిశ్ఫలము కాలేదు . శత్రువులను జయించి వారి బారినుండి నిన్ను రక్షించితిని . ఓ సీతా సుగ్రీవాది మిత్రుల భళా పరాక్రమము వలన యుద్ధమున నేను పడిన శ్రమ అంతా సఫలమైనది . కానీ ఈ కృషిత నీ కోసము మాత్రము కాదు . సదాచారములను పరిరక్షించుటకు అపవాదములు తొలగించుకొనుటకు , లోక ప్రసిద్ధిచెందిన ఇక్ష్వాకు వంశమునకు అపకీర్తి లేకుండా చేయుటకు నేను ఈ యుద్ధము చేసాను . నీవు పరుల ఇంట ఇంత కాలము ఉన్నందున నీ ప్రవర్తనవిషయములో నాకు సందేహము కలుగుచున్నది . కనుక జానకి ఈ భూమిమీద నీకు ఇష్టమైనచోటుకు వెళ్ళుటకు నేను అనుమహతించుచున్నాను అని పలికెను.
సీతాదేవి ఇంతకు ముందు ఎప్పుడు శ్రీ రాముని నోటా ప్రియవచనములు మాత్రమే విన్నది . చాలా కాలము తర్వాత తాను చోసిన పతిదేవుని నోటినుండి ఇటు వాణి కట్న కఠోరమైన వచనములువినుట చే ఏనుగు చెకదలింప బడిన లతా వలే చెలించిపోవుచూ సంతత ధారగా కనీరు కార్చెను ..
No comments:
Post a Comment