రామాయణము
యుద్ధకాండ ----------------నూటఇరువదిమూడవసర్గ
దశరథమహారాజు తెరిగివెళ్లిపోయిన పిమ్మట దేవేంద్రుడు శ్రీరాముడితో " రామా ! నీ దర్శనంతో మేమెంతో సంతోషించితిమి . మేము ఇప్పుడు మీకు చేయగలిగిన సహాయము ఏదైనా ఉంటె చెప్పుము . " అని పలికెను . అప్పుడు శ్రీ రాముడు " దేవేంద్ర మా యందు నీకు ప్రీతియున్నచో నా మనస్సులోని మాటలను చెప్పెదను వినుము . నాకొరకై సాహసముతో యుద్దములో పోరాడి హాసువులువీడిన వానరవీరులందరిని పునర్జీవితులను గావింపుము ప్రానములు సైతం లెక్క చేయక నా కోసం ఈ వానరవీరులంతా తమ భార్యాపిల్లలను , బంధువులను వీడివచ్చిరి . ఇంద్రా వానరయోధులు భల్లూఒకవీరులగాయములు మాన్పి వారిని ఆరోగ్యవంతులను గావింపుము . వారు ఎప్పటివలె బలపరాక్రమ సంపన్నులై సంతోసగముగా ఉండగా చూడవలెనని నాకోరిక వనరులు ఉండెడిచోట సర్వకాలములయందును మధురములగు కందమూలఫలములు నిర్మలమైన నాదీ జలములు వారికి అందుబాటులో ఉండునట్టు చూడుము " అని పలికెను .
మహాత్ముడైయాన్ శ్రీరాముడీమాటలు విన్నపిమ్మట మహేంద్రుడు " నాయనా రామ వానరాదులను బఠింకపమని నీవు కోరుటవలన వారి పట్ల నీకు గల వాత్సల్యమేగాక నీ ఔన్నత్యము కూడా తెలియచున్నది . నీవుకోరుకున్నట్లే తప్పక జరుగును . అని పలికి ఆవానరాదియోధులలందరిని వారి శరీరములకు గల గాయములను మాన్పి పునర్జీవితుల్స్ను చేసెను అప్పుడు వారందరు గాఢ నిద్రనుండి మేల్కొనిన రీతిగా లేచి శ్రీ రాముయాన్కు ప్రణమిల్లిరి .
పిమ్మట దేవతలందరు రామలక్ష్మణులను వీడ్కొని తామంతా విమానములపై తమతమ స్థానములకు వెళ్లిరి . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణసమేతుడై సకల దేవతలకు నమస్కరించి వానరవీరులందరిని శిభిరాములలోకి వెళ్లి విస్రఅంతి తీసుకొనమని ఆదేశించెను .
రామాయణము ------------యుద్ధకాండ -----------నూటఇరువదిమూడవసర్గ ------సమాప్తము
శశి,
ఎం.ఏ,ఎం.ఏ, (తెలుగు) తెలుగుపండితులు .
No comments:
Post a Comment