రామాయణము
ఉత్తరకాండ -నలుబదియవసర్గ
పిమ్మట శ్రీ రాముడు సుగ్రీవునికి అనేక జాగ్రత్త చెప్పి పదేపదే ఆయన్ని అక్కునచేర్చుకొనుచూ సుగ్రీవుడు వెళ్లుటకు అనుమతి ఇచ్చెను . పిమ్మట శ్రీ రాముడు విభీషణుడితో మధురముగా మాట్లాడుతూ ఆయనకు కూడా తిరిగి వెళ్ళుటకు అనుమతి ఇచ్చెను . పిమ్మట హనుమంతుడు శ్రీ రాముడితో " మహారాజా! నీయందు నాకు గల అనన్యభక్తి విస్వాసము ఏమాత్రము సడలికుండునట్లు నన్ను అనుగ్రహింపుము " అని పలికెను . అప్పుడు శ్రీ రాముడు " కపివరా ! నీవు కోరుకున్నట్లే జరుగును . మారుతి నీవు నాకు అనేక ఉపకారములు చేసినావు . నా ప్రాణములను ధారపోసిన వాటిలో ఏఒక్క ఉపకారము తీరదు " అని పలికి వైడూర్యమణులతో మిరుమిట్లు గొలిపే హారమును తన కంఠమునుండి తీసి హనుమంతుని మేడలో వేసెను . పిమ్మట వానరులందరూ శ్రీ రామునికి శిరసా ప్రణమిల్లి కంట తడిపెడుతూ తమతమ నివాసములకు మరలి వెళ్లేను .
రామాయణము ఉత్తరకాండ నలుబదియవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment