రామాయణము
యుద్దకాండ ---------నూటనాల్గవసర్గ
శ్రీ రాముడు కోపంతో ఉండగా అయన భీకర ముఖమును చూసి ప్రాణులన్నియూ గడగడా వణికిపోయెను . భూమి కంపించెను . త్రికూట పర్వతము చలించెను . సముద్రుడు క్షోభకు గురి అయ్యెను . ఆకాశమునందు అశుభ సూచకంగా పక్షులు , మిగుల భీతితో తీవ్రముగా అరుచుచు అటు ఇటు తీరుగసాగేను . దారుణ మైన ఆ అపశకునములను చూసి ప్రాణులన్నియూ భయముతో వణికి పోయెను . రావణుడి గుండెలో దడపుట్టెను . యుద్ధము చూచుటకు వఛ్చిన సకల సురాసురులు ఆ మహారణమును కుతూహలంతో శ్రద్ధతో చూస్తుండిరి . అక్కడ ఉన్న అసురులు రావణునకు జయజయము అనెను . దేవతలు శ్రీ రామచంద్రప్రభువుకు జయముజయము అని పదేపదే పలుకుచుండిరి .
రావణుడు ఒక శూలముని రామునిపై ప్రయోగించెను . రాముడు మాతలి ద్వారా ఇంద్రుడు పంపిన శక్తితో తన వైపు దూసుకు వస్తున్న శూలమును భగ్నముచేసెను . పిమ్మట శ్రీరాముడు వాడిఐన శరములతో రావణుని రధాశ్వములను కూల్చి వేసెను . పిమ్మట మూడు బాణములచే రావణుని వక్షస్థలమందు లలాటమునందు కొట్టెను . రాముని బాణపరంపరకు రావణుని అవయవములన్ని గాయపడి అతని శరీరము నుండి రక్తము కారసాగెను . ఆ రక్తముతో అతడు తడిసిపోయెను అప్పుడు రావణుడు మిక్కిలి ఖిన్నుడై పట్టరాని అసహనంతో ఊగిపోయెను .
రామాయణము ----------యుద్ధకాండ -----------నూటనాల్గవసర్గ ------------సమాప్తము -------------------------
శశి ,
ఎం.ఏ , ఎం.ఏ,(తెలుగు ) , తెలుగుపండితులు .
No comments:
Post a Comment