రామాయణము
ఉత్తరకాండ -----నాలుగవసర్గ
అగస్త్యుడి మాటలు వినినంతనే శ్రీ రాముడు ' రాక్షుసులకు లంకా నగరము నివాసస్థలము ఎలా అయ్యినది ? ' అని ప్రశ్నించెను . అప్పుడు అగస్త్య మహాముని రామునితో " రామా! సృష్టి కర్త ఐన బ్రహ్మ దేవుడు మొదట జలములను సృష్టించెను . ఆ నీటిని రక్షించుటకై ప్రాణులను సృష్టించెను . అప్పుడే ప్రాణులతో బ్రహ్మ జలములను రక్షించుము అని పలికెను . అప్పుడు ఆ ప్రాణులలో అధికముగా ఆకలి ఉన్న వారు ' మేము జలములను రక్షింతుము అని పలికిరి ' అంతగా ఆకలిలేనివారు ' మేము జలములను పూజింతుము' అని పలికెను . అప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీలో రక్షింతుము అని పలికిన వారు రాక్షసులగుదురు . పూజింతుము అని పలికినవారు యక్షులగుదురు . అని పలికెను .
అటుల ఏర్పడిన రాక్షుసులో కెతి , ప్రహేతి, అను సోదరులు కలరు . వారు రాక్షులకు అధిపతులు . ఆయిరువురిలో ప్రహేతి అను వాడు ధార్మికుడు . అతడు విరక్తితో తపోవనములకు వెళ్లెను. రెండోవాడైన హేతి యముడిని అభ్యర్ధించి అతని సోదరి అగు భయ అను ఆమెను వివాహము చేసుకొనెను . ఆమె మిక్కిలి భయంకరురాలు . పిమ్మట ఆమెకు విద్యుద్కేశుడు అనే పుత్రుడు కలడు . హేతి సంధ్యాదేవి పుత్రిక అయిన , సాలకటంకట ను తన కుమ్మారునికి ఇచ్చి వివాహము జరిపించెను . పిమ్మట కొంత కాలమునకు సాలకటంకట తన భర్తతో కలిసి మంధర గిరికి చేరెను . ఆమెకు అక్కడ ఒక పుత్రుడుకలిగెను . ఒక రోజు ఆమె పనిలోపడి పుత్రుణ్ణి విస్మరించి దూరముగా వెళ్లెను . అప్పుడా బాలుడు తన పిడికిలిని నోటియందు ఉంచుకొని బిగ్గరగా ఏడవసాగెను ఆ సమయములో పార్వతి పరమేశ్వరులు వృషభ వాహనంపై ఆకాశములో విహరిస్తూ రోధించుచున్న ఈభాలుడిని చూసిరి. అపుడు పార్వతి దేవికి ఆ పసికందుపై జాలి కలిగెను . అప్పుడు శంఖరుడు ఆ బాలుడిని యువకుడిగా మార్చివేసెను అంతే కాక అతనికి అమరత్వమును . ఒక విమానమును కూడా ఇచ్చెను . అప్పుడు ఉమా దేవికూడా రాక్షసస్త్రీలకు సద్యోగర్భప్రాప్తించునట్లుగాను . వెంటనే శిశువు కలుగునట్లుగాను ఆ శిసువు మరుక్షణమే యువకుడు అయ్యినట్లు వరమును ఇచ్చెను . విధ్వకేశుని కుమారుడైన ఆ కుమారుడు సుకేశుడుగా ప్రసిద్దుడై
ప్రాగ్న్యాసాలి అయ్యెను . దయాళువు ఐన శివుడి వరములు కూడా లభించుటచే అతడు గర్వోన్మత్తుడయ్యెను. అలా తోటివారిలో ప్రముఖుడైన ఆ సుఖేసుడు శివానుగ్రహము వలన విమానంపై ఆకాశమంతా సంచరించు సాగేను .
రామాయణము --------ఉత్తరకాండ ------నాలుగవసర్గ ---------సమాప్తము
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు .
No comments:
Post a Comment