రామాయణము
యుద్ధకాండ - నూటపదునేడవసర్గ
హనుమ వాయు వేగముతో శ్రీ రాముని సమీపించి ఆయనతో "ప్రభూ !నీ విజయ వార్త వినగానే సీతాదేవి సంతోషముతో పొంగిపోయినది . 'నా భర్తను ,ఆయన తమ్ముడిని చూడాలనుకుంటున్నాను 'అని నాతొ పలికినది . "అని చెప్పెను .
హనుమ పలికిన మాటలు వినగానే శ్రీ రామునికి సీతాదేవి గుర్తుకువచ్చి , అయన కంట తడి పెట్టెను . అప్పుడు శ్రీ రాముడు . తనలో తాను రావణుని గృహంలో ఇంతకాలమూ ఉన్న సీతాదేవిని గ్రహించినచో లోకాపవాదము రావచ్చు ఏదోషము ఎరుగని ఆ సాద్విని వదిలివేయుట మహా దోషముకాదా అని తనలో తాను కొంతసేపు ఆలోచనలోపడెను . పిమ్మట ఆ స్వామి తన పక్కనే ఉన్న విభీషణునితో " సీతాదేవిని చక్కగా అలంకరింప చేసి వెంటనే ఇక్కడకు తీసుకురండి . " అని పలికెను
శ్రీ రాముడు ఆదేశించిన వెంటనే విభీషణుడు త్వరగా లంకా నగరంలోని అశోక వనము వద్దకు వెళ్లెను . అశోకవనము బయట కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో తన రాకను గూర్చి సీతా మాతకు విన్నవించమని దర్శమునకు అనుమతిని ఇవ్వమని కోరెను . వారు వెళ్లి చెప్పగా సీతా మాత విభీషణునికి దర్శమునకు అనుమతి ఇచ్చినది . అప్పుడు శ్రీ రాముడు జానకీ మాతవద్దకు వెళ్లి ,ఆమెను దర్శించి ,శిరస్సువంచి ఆమెకు ప్రణామము చేసి ,ఆమెతో "అమ్మా !వైదేహి !అంతఃపుర స్త్రీలు నీకు అభ్యంగన స్నానము చేయించి ,వస్త్రాభరణములు ,చక్కటి అలంకారములు చేసెదరు . పిమ్మట నీవు పల్లకీని అధిరోహించుము . మీ పతి దేవుడు మిమ్ము చూడగోరుచున్నారు . " అని పలికెను .
వింహీషణుడి విన్నపము విన్న పిమ్మట సీతాదేవి " రాక్షస రాజా నేను ఇప్పుడే నా పతిని చూడ గోరుచున్నాను."
అని పలికెను . అప్పుడు విభీషణుడు " అమ్మా ! నీ పతిదేవుడు ఆదేశించినదే నేను నీకు చెప్పాను . " అనగా అప్పుడు సీతా దేవి " సరే " అని పలికెను . అప్పుడు అంతఃపుర స్త్రీ లు సీతాదేవిని తీసుకు వెళ్లి అభితంగానా స్నానము చేయించిరి . అమూల్యమైన వస్త్రాభరణములతో ఆమెను అలంకరించిరి . పిమ్మట శ్రేష్టమైన పల్లకీనందు ఆమెను కూర్చుండ బెట్టిరి . పెక్కు మంది రాక్షస భటులు పల్లకీ చుట్టూ రక్షణ గా నడుచుచుండగా విభీషణుడు కూడా పల్లకీతోపాటే నడుస్తూ ఆ పల్లకిని శ్రీ రాముడి వద్దకు చేర్చెను .
అది చూసిన శ్రీరాముడు సీతాదేవిని ఇక్కడికీ తీసుకురండి . అని పలికెను . అప్పుడు విభీషణుడు తనవెంటవచ్చుచుండగా ఆ మైథిలి బిడియముతో తన శరీరమును కుదించుకొనుచూ తనభర్తయెదుట నిలిచెను . ఆమె మేలిముసుగు లో ఉన్నది , జనుల సమక్షమున సిగ్గుపడుచూ తన భర్తను ఆర్య పుత్రా అని పిలిచింది పిమ్మట ఆమె ఏడవసాగెను . కొద్దీ సేపటికి మోహము పైకెత్తి పతి ముఖమును చూసేను . ఉదయించుచున్న నిండు చంద్రుడి వంటి భర్తముఖమును చూచుటతో ఆ దేవి భాద తొలగిపోయెను . ఇంత కాలము వరకు ఆయన దర్శన భాగ్యమునకు నోచుకోని సీతాదేవికి . శ్రీ రామచంద్ర ప్రభువును చూసే అదృష్టం పెట్టినందుకు ఆమె వదనము నిర్మలమైన చంద్రకాంతులతో శోభిల్లెను .
రామాయణము ---------యుద్ధకాండ ----------నూటపదునేడవ సర్గ ------------సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ) తెలుగుపండితులు .
No comments:
Post a Comment