రామాయణము
ఉత్తరకాండ ---------- ఇరువదియవసర్గ
రావణుడు భూమండలమును గడగడలాడించుచూ ఒక రోజు నారదుడిని చూసి అయన వద్దకు వెళ్లి నమస్కారము చేసి కుశల ప్రశ్నలు అడిగెను . అప్పుడు నారదుడు " రాక్షసరాజా ! నీ సూర్య సాహసములకు మిక్కిలి సంతోషించితిని నీకు ఉన్నచో మాటలు చెప్పెదను వినుము . నాయనా ! అమరులైన దేవతలు సైతం నిన్ను చంపలేదు . ఇంక మానవ మాత్రులు ఎంత ? నిత్యము ఆకలి దప్పులతో రోగములతో , ముసలితనముతో, అర్ధకామములతో చస్తూ బ్రతికే వారిని చంపుటవలన ప్రయోజనమేమి ? మానవులందరు యమలోకమునకు వెళ్లవలిసిన వారే కావున వీరిని బాధించుటమాని యమునిపని పట్టుము . యముని జయించినచో సమస్తము జయించినట్లే అగును . "" అని పలికెను .
నారదుని మాటలువిన్న రావణుడు " మహాత్మా! యమధర్మ రాజును వధించుటకు నేను కృత నిశ్చయుడనై ఉన్నాను . కావున అతడు నివసించే దక్షిణ దిశకే బయలుదేరుతున్నాను . ప్రాణులను ఏతేన పాలు చేయునట్టి ఆ యమధర్మరాజుకు మృత్యుముఖమునకు పంపెదను " అని పలికి ఆ మహామునికి నమస్కరించి దక్షిణ దిశగా బయలుదేరెను . రావణుడికి యముడికి మధ్య జరిగే యుద్ధము చూచుటకై నారదుడు కూడా యమపురికి వెళ్లెను .
No comments:
Post a Comment