Friday 15 May 2020

రామాయణము ఉత్తరకాండ ---------- ఇరువదియవసర్గ

                                     రామాయణము 

                                ఉత్తరకాండ ----------  ఇరువదియవసర్గ 

రావణుడు  భూమండలమును  గడగడలాడించుచూ  ఒక  రోజు  నారదుడిని  చూసి  అయన వద్దకు  వెళ్లి  నమస్కారము  చేసి  కుశల  ప్రశ్నలు  అడిగెను . అప్పుడు నారదుడు " రాక్షసరాజా ! నీ సూర్య సాహసములకు మిక్కిలి సంతోషించితిని నీకు  ఉన్నచో  మాటలు  చెప్పెదను  వినుము .  నాయనా ! అమరులైన  దేవతలు సైతం  నిన్ను చంపలేదు . ఇంక మానవ  మాత్రులు  ఎంత ? నిత్యము  ఆకలి దప్పులతో  రోగములతో , ముసలితనముతో, అర్ధకామములతో  చస్తూ  బ్రతికే వారిని  చంపుటవలన  ప్రయోజనమేమి  ? మానవులందరు  యమలోకమునకు  వెళ్లవలిసిన   వారే  కావున వీరిని బాధించుటమాని  యమునిపని   పట్టుము . యముని  జయించినచో  సమస్తము జయించినట్లే  అగును . "" అని పలికెను . 
నారదుని  మాటలువిన్న  రావణుడు " మహాత్మా! యమధర్మ  రాజును  వధించుటకు  నేను  కృత నిశ్చయుడనై  ఉన్నాను . కావున అతడు నివసించే  దక్షిణ దిశకే  బయలుదేరుతున్నాను .  ప్రాణులను  ఏతేన పాలు చేయునట్టి  ఆ యమధర్మరాజుకు  మృత్యుముఖమునకు  పంపెదను " అని పలికి ఆ మహామునికి  నమస్కరించి  దక్షిణ దిశగా  బయలుదేరెను . రావణుడికి  యముడికి మధ్య జరిగే  యుద్ధము చూచుటకై  నారదుడు  కూడా  యమపురికి  వెళ్లెను . 


రామాయణము ----------ఉత్తరకాండ ---------ఇరువదియవసర్గ -----------సమాప్తము . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 














No comments:

Post a Comment